అన్వేషించండి

TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం

TG TET 2024: టీజీ టెట్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. టెట్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబరు 22 వరకు వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు.

TG TET 2024 Application Edit: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET)-2204 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి విద్యాశాఖ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబర్‌ 22 వరకు వివరాలు సవరించుకోవచ్చని టెట్‌ ఛైర్మన్‌ ఈవీ నరసింహారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టెట్ దరఖాస్తు గడువు నవంబర్‌ 20తో ముగియనుంది. టెట్ పరీక్ష కోసం దాదాపు 1.26 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. వీరిలో పేపర్‌-1కు 39,741, పేపర్‌-2కు 75,712 మంది, రెండింటికీ కలిపి 10,599 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు ఇంకా సమయం ఉండటంతో.. దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అదనంగా మరో 50 వేల దరఖాస్తులు రావచ్చని భావిస్తున్నారు. అభ్యర్థులు www.schooledu.telagana.gov.in. వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383, 90007561 78 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

టెట్‌ దరఖాస్తు ఫీజును కూడా ప్రభుత్వం భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి ఒక పేపర్‎కు రూ.1000, రెండు పేపర్లు రాస్తే రూ.2000 ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఫీజను రూ.750కి కుదించారు. అంటే ఒక పేపర్‌ రాసేవారు రూ.750 చెల్లించాలి. రెండు పేపర్లు రాసేవారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు. ఆఫీస్: 70750 88812/70750 28881, వెబ్‌సైట్ సంబంధిత: 70750 28882/70750 28885, టెక్నికల్ సమస్యలకు: 70329 01383/ 90007 56178 నంబర్లలో సంప్రదించవచ్చు. నిర్ణీత పనివేళల్లో మాత్రమే సంప్రదించాల్సి ఉంటుంది. 

గతంతో పోల్చితే ఆదరణ తక్కువే..
ఇదిలా ఉండగా.. టెట్‌ పరీక్షపై అభ్యర్థుల్లో ఆసక్తి క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2022 టెట్ కోసం 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా.. 2023లో 2.86 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఒకసారి ఏకంగా 6.28 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు.  ఇక టెట్‌ (నవంబరు)-2024కు ఇప్పటివరకు 1.26 లక్షల దరఖాస్తు చేసుకున్నారు. ఇది వరకు టెట్‌ నిర్వహించినప్పుడల్లా 4-6 లక్షల మంది దరఖాస్తు చేసేవారు. కాని ఈసారి 2 లక్షలు కూడా దాటలేకపోయింది. నిరుద్యోగులతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్‌ టీచర్లు టెట్‌కు హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సైతం టెట్‌ స్కోరును తప్పనిసరి చేయడంతో.. వర్కింగ్ టీచర్లు కూడా టెట్‌ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టెట్‌కు హాజరయ్యే వారి సంఖ్య పెరగాలి. కానీ అభ్యర్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంటూ వస్తోంది. టెట్‌ వ్యాలిడిటీ గతంలో 7 సంవత్సరాలు ఉండగా.. దాన్ని జీవితకాలంపాటు పొడిగించారు. దీంతో గతంలో టెట్‌ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్‌ రాసేందుకు ఆసక్తిచూపడంలేదు. 

జనవరి 1 నుంచి పరీక్షలు..
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్‌లో జనరల్ అభ్యర్థులు అర్హత సాధించడానికి కనీసం 60% మార్కులు (అంటే 150 మార్కులకు 90 మార్కులు) స్కోర్ చేయాల్సి ఉంటుంది. OBCవర్గాలకు చెందిన అభ్యర్థులుు 75 మార్కులు సాధిస్తే చాలు అర్హత సాధించినట్టే. SC/ST/PH అభ్యర్థులకు 50 మార్కులు వస్తే వాళ్లు డీఎస్సీ రాసుకునేందుకు అర్హులు అవుతారు.  

పరీక్ష ఇలా..
TG TETలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1, పేపర్ 2. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు TG TET పేపర్ 1 పరీక్ష రాస్తారు. దీనికి డీఈడీ చేసి చేసిన వాళ్లు మాత్రమే అర్హులు.  6 తరగతి నుంచి 8 తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 2  కోసం పరీక్ష రాస్తారు. బీఈడీ చేసిన వాళ్లు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. వీళ్లు కాకుండా 1 నుంచి 8 తరగతుల వరకు బోదించే వాళ్లు రెండు పేపర్లు రాస్తారు. TG TET పరీక్షా సరళి చూస్తే పేపర్ 1కి పేపర్ 2కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నాలుగు ఆప్షన్స్‌ (MCQలు)ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పేపర్ 1, పేపర్ 2  సిలబస్‌ను ఇక్కడ చూడొచ్చు. 

టెట్-2024 పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Embed widget