అన్వేషించండి

TGBIE Supplementary Results: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

Inter Supply Results: తెలంగాణలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

TG Inter Supplementary Results: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 24న విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షల జనరల్, వొకేషనల్, జనరల్ బ్రిడ్జ్ కోర్సు, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సుల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి విడుదల చేసింది.  సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల మార్కులను కూడా వెల్లడించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్‌లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, తదితర వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. 

ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో జనరల్ విభాగంలో 63.86 శాతం, వొకేష‌న‌ల్‌లో 53.24 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 43.77 శాతం, వొకేష‌నల్‌లో 51.12 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మొత్తం 70.26 శాతం బాలిక‌లు ఉత్తీర్ణత సాధించగా, 58.39 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఇక రెండో సంవత్సరం ఫలితాల్లో 47.54 శాతం బాలికలు, 41.37 శాతం బాలురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం మొదట ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.- https://tsbie.cgg.gov.in/  

➥ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి. 

➥ అక్కడ వచ్చే పేజీలో విద్యార్థులు తమ  హాల్‌టికెట్ నెంబర్‌, తదితర వివరాలు నమోదుచేసి  SUBMIT బటన్‌పై క్లిక్ చేయాలి.

➥ వివరాలు నమోదుచేయగానే విద్యార్థి మార్కుల వివరాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

➥ విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఈ ఏడాది మే 24 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4.5 లక్షల మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన విద్యార్థులతోపాటు, ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు కూడా ఉన్నారు. గత అనుభవాల నేపథ్యంలో పరీక్షల మూల్యాంకనంలో ఎలాంటి తప్పులు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థుల మార్కుల డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు ప్రక్రియ పూర్తికావడంతో ఫలితాల వెల్లడికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత ఫలితాలను అప్‌లోడ్ చేశారు. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలను మూడేసి సార్లు క్షుణ్నంగా పరిశీలించారు.

ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులు దాదాపు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇప్పటికే ఎప్‌సెట్ పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మరోవైపు దోస్త్ రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎప్‌సెట్ అర్హత ఉంటే.. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత పొందుతారు. ఎప్‌సెట్ అర్హత లేనవారు దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది.  

తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలకు మొత్తం 9.80 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan in Assembly: పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ  పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
పదిహేనేళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన - వైసీపీ తీరు వివేకా హత్యను గుర్తు చేస్తోంది - అసెంబ్లీలో పవన్
Revanth Reddy : ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
ఢిల్లీకి రేవంత్ రెడ్డి - ప్రధానితో అపాయింట్‌మెంట్ ఖరారు
Nara Lokesh Fires on YSRCP: మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ఎమ్మెల్యే జగన్ అన్నారు, 5 ఏళ్లు ఏం చేశారంటూ నారా లోకేష్ గరం గరం
Telangana Latest News: రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
రేవంత్ సర్కార్‌ని టార్గెట్‌ చేసిన కాంగ్రెస్ నేత- బీఆర్‌ఎస్‌కు కొత్త అస్త్రం దొరికినట్టే?
NTRNeel Project: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?
Sai Pallavi: సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా?
సాయి పల్లవి మిగతా హీరోయిన్లలా ఎందుకు మేకప్ వేసుకోదో తెలుసా ?
Maha Kumbh: ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో  పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
ఎలా వస్తాయబ్బా ఇలాంటి ఐడియాలు - వీడియో కాల్‌తో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయించేస్తున్నారు.
Telangana Ration Card Latest News:తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసిన వాళ్లకు గుడ్ న్యూస్- పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Embed widget