AP LAWCET: ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్సెట్ 2025 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే
APLAWCET: ఏపీలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ లాసెట్/ పీజీఎల్సెట్ నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. ఈ ఏడాది జూన్ 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AP LAWCET Notification 2025: ఏపీలోని న్యాయ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏపీ లాసెట్/ పీజీఎల్సెట్ (AP LAWCET 2025/PGLCET 2025) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. దీనిద్వారా ఏపీలోని లా కాలేజీల్లో 3, 5 సంవత్సరాల ఎల్ఎల్బీ డిగ్రీ కోర్సులు, 2 సంవత్సరాల పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
* ఏపీ లాసెట్, ఏపీ పీజీఎల్సెట్ - 2025 (AP LAWCET/ AP PGLCET)
కోర్సుల వివరాలు..
1) మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సు
- ఎల్ఎల్బీ
- ఎల్ఎల్బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
2) ఐదేళ్ల ఎల్ఎల్బీ కోర్సు
- బీఏ ఎల్ఎల్బీ
- బీకామ్ ఎల్ఎల్బీ
- బీబీఏ ఎల్ఎల్బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
3) రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సు
అర్హత: ఎల్ఎల్బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
లాసెట్ పరీక్ష విధానం:
➥ మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో పార్ట్-ఎ: జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-బి: కరెంట్ ఎఫైర్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, పార్ట్-సి: ఆప్టిట్యూడ్ (స్టడీ ఆఫ్ లా) 60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. పార్ట్-సిలో బేసిక్ లా ప్రిన్సిపుల్స్, భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.
➥ ఐదేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి ఇంటర్ స్థాయిలో, మూడేళ్ల లా కోర్సు పరీక్ష రాసేవారికి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం మాక్ టెస్టులకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. పరీక్షలో కనీసం అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
పీజీఎల్సెట్ పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. పరీక్షలో మొత్తం 2 సెక్షన్లు (పార్ట్-ఎ, పార్ట్-బి) ఉంటాయి. ఇందులో పార్ట్-ఎ నుంచి 40 పశ్నలు, పార్ట్-బి నుంచి 80 పశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే పరీక్ష ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు.
ముఖ్యమైన తేదీలు...
➥ నోటిఫికేషన్ వెల్లడి: 22.03.2025.
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.03.2025.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.04.2025.
➥ పరీక్ష తేది: 05.06.2025.
(పరీక్ష సమయం: ఉదయం 09.30 గంట నుంచి - 10.30 గంటల వరకు).
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

