అన్వేషించండి

CBSE On Covid19: ఆ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త.. కొవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో బోర్డు కీలక ప్రకటన

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బోర్డ్ ఎగ్జామ్స్ విధానంలో ఇటీవల స్వల్ప మార్పులు చేసింది. కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో తాజాగా ఆ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Board Exams 2021-22) బోర్డ్ ఎగ్జామ్స్ విధానంలో ఇటీవల స్వల్ప మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి తరువాత విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో విద్యా సంవ‌త్స‌రాన్ని రెండు ట‌ర్మ్‌లుగా విభ‌జించి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ బోర్డ్ ఇప్ప‌టికే పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఉపశమనం కలిగించే విషయాన్ని చెప్పింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు వసూలు చేయడం లేదని బోర్డ్ తెలిపింది. ఈ మేరకు పీటీఐ ఆ విషయాన్ని ట్వీట్ చేసింది.

కొవిడ్19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబ‌ర్ 10, 2021 నాటికి టెన్త్ క్లాస్, పన్నెండో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు సీబీఎస్ఈ (CBSE) మొద‌టి ట‌ర్మ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉంది. ఈ క్రమంలో సీబీఎస్ఈ తన నిర్ణయాన్ని వెల్లడించింది.

Also Read: AP PGECET 2021: ఏపీ పీజీఈసెట్ హాల్‌టికెట్లు రిలీజ్ అయ్యాయి.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు, లేక ఉన్న సింగిల్ పేరెంట్ చనిపోయిన వారికి, సంరక్షకుడు లేదా సంరక్షకురాలు చనిపోయిన విద్యార్థులకు 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి సీబీఎస్ఈ మినహాయింపు ఇచ్చింది. మరోవైపు పాఠశాలలు బోర్డు ఎగ్జామ్‌కు హాజరుకానున్న విద్యార్థుల జాబితాలను సీబీఎస్ఈకి ఇదివరకే పంపించింది. విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా బోర్డ్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేట్ ఫీజుతో అక్టోబర్ 9వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది బోర్డ్. 

Also Read: JEE Main Counselling 2021: అక్టోబర్‌ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..

టర్మ్ 1లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, టర్మ్ 2 లో లాంగ్ ఆన్సర్ ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు టర్మ్స్‌లోనూ కేస్-బేస్డ్ ప్రశ్నలు వివిధ ఫార్మాట్లలో ఉంటాయి. టర్మ్ 1 ఎగ్జామ్ అక్టోబర్‌లో, టర్మ్ 2 ఎగ్జామ్స్ వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో నిర్వహించడానికి సీబీఎస్ఈ బోర్డ్ షెడ్యూల్ చేసింది.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget