అన్వేషించండి

JEE Main Counselling 2021: అక్టోబర్‌ 16 నుంచి జేఈఈ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌.. అడ్వాన్స్‌డ్ గడువు పెంపు..

JEE Main Counselling: జేఈఈ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబర్‌ 16 నుంచి మొదలు కానుంది. జోసా (JoSAA) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వివరాలను విడుదల చేసింది. అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది.

దేశంలో ఐఐటీలు (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ), ఎన్‌ఐటీలు (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ), ఐఐఐటీలతో (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ) పాటు ప్రభుత్వ ఆర్థిక సాయం పొందుతున్న సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబర్‌ 16వ తేదీ నుంచి మొదలు కానుంది. ఈ మేరకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా– JoSAA) అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వివరాలను విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాక అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు జోసా వెల్లడించింది.

జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాల విడుదలలో జాప్యం నెలకొన్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్షల ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్‌ ఫలితాలు ఈ నెల 11వ తేదీకి ముందే విడుదల అవుతాయని అంతా భావించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌ 12 నుంచి 19 వరకు నిర్వహించాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ గతంలో అధికారిక నోటిఫికేషన్ సైతం వెలువరించింది. అయితే జేఈఈ మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు ఆలస్యం కావడంతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మెయిన్‌ నాలుగో విడత ఫలితాలు 14వ తేదీన విడుదలయ్యాయి. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ గడువు పెంపు.. 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఐఐటీ ఖరగ్‌పూర్‌ పొడిగించింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తు గడువు నిన్నటితో ముగియాల్సి ఉండగా.. మరో 24 గంటల పాటు పెంచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష కోసం ఈరోజు (సెప్టెంబర్ 21) రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తు రుసుము చెల్లించే గడువును మాత్రం పొడిగించలేదు. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.2,800ని ఈ రోజు రాత్రి 11:59 లోగా చెల్లించాల్సి ఉంటుంది. 

2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు..
జేఈఈ మెయిన్‌లో నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన వారు అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. దీని ప్రకారం 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. వీరంతా అక్టోబర్ 3న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు హాజరుకానున్నారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అక్టోబర్‌ 5 సాయంత్రం నుంచి అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అక్టోబర్‌ 10న అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనున్నారు. ‘కీ’పై అభ్యంతరాలను అక్టోబర్ 10, 11 తేదీల్లో స్వీకరించనున్నారు. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తుది ఫలితాలు అక్టోబర్‌ 15న విడుదల కానున్నాయి. అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ 16 నుంచి ప్రారంభం కానుంది.  

20 మందిపై వేటు.. 
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్‌ పరీక్షలను 4 సెషన్లలో నిర్వహించింది. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షలకు  మొత్తం 9,39,008 మంది దరఖాస్తు చేశారు. ఈ నాలుగు సెషన్లలో విద్యార్థులు దేనిలో ఎక్కువ మార్కులు సాధిస్తే దానినే తుది ఫలితంగా పరిగణిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడిన 20 మంది విద్యార్థులపై ఎన్‌టీఏ వేటు వేసింది. హరియాణాలోని సోనిపట్‌లో ఒకే పరీక్ష కేంద్రంలో వీరంతా ఎగ్జామ్ రాసినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన సీబీఐ.. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ అవకతవకల్లో పాలుపంచుకున్న 20 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు తెలిపింది. దీంతోపాటు రానున్న మూడేళ్లు ఈ పరీక్షలు రాయడానికి వీల్లేకుండా వారిని డిబార్‌ చేసింది.  

Also Read: IIT Admissions: ఆర్ట్స్, కామర్స్ వాళ్లు కూడా ఐఐటీల్లో చేరవచ్చు.. ఎలా అంటే?

Also Read: B.Tech Courses: కొలువులకు దీటైన టెక్నాలజీ కోర్సులు.. రోబోటిక్స్, ఏఐ ఇంకా ఎన్నో.. ఈ ఏడాది నుంచే అమలు..

టాప్ హెడ్ లైన్స్

How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Embed widget