అన్వేషించండి

JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

JEE Advanced 2026 ఫలితాలు విడుదలయ్యాయి. IITలు, NITలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2 నుండి JoSAA కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.

న్యూఢిల్లీ:  మే 17న నిర్వహించిన JEE Advanced 2026 ఫలితాలు అర్ధరాత్రి విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా IITలు, NITలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశ ప్రక్రియ దీంతో ప్రారంభమైంది. అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ 2 నుండి ప్రారంభమయ్యే JoSAA కౌన్సెలింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన కోర్సులు, కాలేజీలను ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలు విడుదల కావడంతో విద్యార్థులకు కీలకమైన అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఇకపై జోసా కౌన్సెలింగ్ JoSAA Counselling 2026 ద్వారా ఐఐటీ (IIT), ఎన్‌ఐటీ (NIT), ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రభుత్వ సాంకేతిక విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల ముందు సరైన కాలేజీ, సరైన బ్రాంచ్‌ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

టాపర్స్ వీరే
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలలో ఢిల్లీ జోన్ అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటింది. అడ్వాన్స్‌డ్ పరీక్షలో శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ (AIR 1) సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచాడు. మరోవైపు, విద్యార్థినుల కేటగిరీలో ఆరోహి దేశ్‌పాండే అత్యుత్తమ ప్రదర్శనతో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది విడుదల చేసిన మెరిట్ జాబితాలో ఢిల్లీ జోన్ హవా కనిపించింది. ఇక్కడ టాప్ ర్యాంకులు సాధించిన పలువురు అభ్యర్థులు ఈ జోన్ నుంచే ఉన్నారు. ఇప్పుడు ఈ  అభ్యర్థులతో పాటు వేలాది మంది విద్యార్థులు JoSAA Counselling ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రముఖ టెక్నికల్ కాలేజీలను ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చనున్నారు. 

Also Read: Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

జూన్ 2 నుండి జోసా కౌన్సెలింగ్ ప్రారంభం
జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 2వ తేదీన ప్రారంభమవుతోంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. తమకు నచ్చిన కాలేజీ, బ్రాంచ్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత దశల వారీగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుంది.

IIT, NITలతో పాటు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశం 
జోసా ద్వారా దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఇతర ప్రభుత్వ నిధులు పొందే సాంకేతిక సంస్థలలో ప్రవేశాలు కల్పిస్తారు. ఒకే ప్లాట్‌ఫారమ్ ద్వారా విద్యార్థులు అనేక కాలేజీలు, కోర్సుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల ప్రవేశ ప్రక్రియ ఈజీ అవుతుంది.

చాయిస్ ఫిల్లింగ్‌లో తొందరపడొద్దు
కౌన్సెలింగ్ సమయంలో చాయిస్ ఫిల్లింగ్ అత్యంత కీలకమైన దశ అని నిపుణులు తెలిపారు.  విద్యార్థులు కేవలం పాపులర్ కాలేజీల వెంటే పడకుండా, తమ ఆసక్తి, కెరీర్ లక్ష్యాలు, బ్రాంచ్  భవిష్యత్తు అవకాశాలు, ప్లేస్‌మెంట్ రికార్డులను దృష్టిలో ఉంచుకుని ఆప్షన్లను ఫిల్ చేయాలని సూచించారు. 

ఏఏటీ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం
ఐఐటీలలో బి.ఆర్క్ (B.Arch.) కోర్సులో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2026 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై, జూన్ 2 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. కేవలం JEE Advanced 2026 లో అర్హత సాధించిన వారు మాత్రమే దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

JoSAA Counselling 2026 కోసం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
స్టెప్ 1: జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nic.in ను సందర్శించాలి.

స్టెప్ 2: JEE Main లేదా JEE Advanced కి సంబంధించిన లాగిన్ వివరాల సహాయంతో లాగిన్ అవ్వండి.

స్టెప్ 3: మీ సమాచారం మరియు నోటిఫికేషన్‌లను చెక్ చేయాలి 

స్టెప్ 4: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐ (GFTI) సంస్థలను, బ్రాంచ్‌లను ఎంచుకోవాలి.

స్టెప్ 5: మీ ప్రాధాన్యత ప్రకారం చాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేసి, ఆ ఆప్షన్లను సేవ్ చేయాలి.

స్టెప్ 6: చివరి తేదీ కంటే ముందే మీ ఆప్షన్లను లాక్ చేయండి.

స్టెప్ 7: మాక్ సీట్ అలాట్‌మెంట్, సీట్ అలాట్‌మెంట్ ఫలితాల కోసం వెయిట్ చేయండి 

స్టెప్ 8: సీటు కేటాయింపు తర్వాత Seat Acceptance Fee చెల్లించి, ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
NEET Re Exam 2026: నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
నీట్ యూజీ రీ ఎగ్జామ్.. అభ్యర్థులకు NTA కీలక సూచనలు, వీటిని సెంటర్లోకి అనుమతించరు
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
Embed widget