అన్వేషించండి

IITAdmissions: ఉన్నత విద్యాసంస్థల్లో పెరిగిన సీట్లు - ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 77,657 సీట్లు అందుబాటులో

Admissions: ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో 355 సీట్లు అదనంగా చేరాయి. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 17,385 నుంచి 17,740కి చేరాయి.

IIT, NIT Admissions: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ఈ విద్యాసంవత్సరంలో 355 సీట్లు అదనంగా వచ్చి చేరాయి. ఐఐటీల్లో గతేడాది 17,385 సీట్లు అందుబాటులో ఉండగా.. ఆ సంఖ్య ఈసారి 17,740కి చేరింది. ఇక ట్రిపుల్ ఐఐటీలు, నిట్‌లలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో వాటిల్లోనూ సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి మొత్తం 121 విద్యాసంస్థల్లో 59,917 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 77,657 సీట్లను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) ద్వారా భర్తీ చేయనున్నారు. 

పెరిగిన సీట్ల వివరాలు ఇలా..

➥ తిరుపతి ఐఐటీలో గతేడాది 244 సీట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరంలో 10 సీట్లతో నాలుగేళ్ల ఇంజినీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందుబాటులోకి తేవడంతో.. సీట్ల సంఖ్య 254కి చేరింది.  

➥ వరంగల్ నిట్(NIT)లో కొత్తగా సీఎస్‌ఈ (ఏఐ అండ్ డేటా సైన్స్) కోర్సును ప్రవేశపెట్టడంతో.. అదనంగా 60 సీట్లు చేరాయి. దీంతో సీట్ల సంఖ్య 989 నుంచి 1049కి పెరిగింది.  

➥ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ సీట్ల సంఖ్య 40 నుంచి 110కి పెరిగింది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సీఎస్‌ఈలో కొత్తగా 10 సీట్లు పెంచారు. దీంతో సీట్ల సంఖ్య 40 నుంచి 50కి పెరిగాయి. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్(మెటీరియల్స్ ఇంజినీరింగ్) కోర్సులో 60 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 

➥ ఐఐటీ గాంధీనగర్‌లో 30 సీట్లు పెరిగాయి. దీంతో సీట్ల సంఖ్య 370 నుంచి 400కి చేరింది. 

➥ ఐఐటీ బాంబేలోనూ 12 సీట్లు అదనంగా చేరాయి. గతేడాది 1356గా ఉన్న సీట్ల సంఖ్య ఈసారి 1368కి చేరింది. 

➥ ఐఐటీ-ధార్వాడ్‌లో 75 సీట్లు పెరిగాయి. అక్కడ సీట్ల సంఖ్య 310 నుంచి 385కి చేరింది.

➥ ఐఐటీ-భిలాయ్‌లో 50 సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 243 నుంచి 283కి చేరింది. 

➥ ఐఐటీ-భువనేశ్వర్‌లో 50 సీట్లు పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 476 నుంచి 496కి చేరింది. 

➥ ఐఐటీ-ఖగర్‌పూర్‌లో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 1869 నుంచి 1889కి చేరింది. 

➥ ఐఐటీ-జోధ్‌పూర్‌లో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 550 నుంచి 600కి చేరింది. 

➥ఐఐటీ-పాట్నాలో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 733 నుంచి 817కి చేరింది. 

➥ ఐఐటీ-గువాహటిలో పెరగడంతో మొత్తం సీట్ల సంఖ్య 952 నుంచి 962కు సీట్ల సంఖ్య పెరిగింది. 

➥ అన్ని ఐఐటీల్లో సీట్ల సంఖ్య పెరగగా.. ఐఐటీ మద్రాస్‌లో మాత్రం ఈసారి 6 సీట్లు తగ్గడం గమనార్హం.

జోసా కౌన్సెలింగ్ ప్రారంభం..
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. ఇక ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 

జోసా కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Best Home Coming | నాసాలో చికిత్స తర్వాత ఇంటికి వచ్చిన సునీతా విలియమ్స్ | ABP DesamDigvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
కంచి గచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేయాలి - తెలంగాణ హైకోర్టు ఆదేశం
Tirumala News: టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
టీటీడీలో వైట్ ఎలిఫెంట్స్‌ను తొలగించండి : చంద్రబాబు
pastor praveen kumar Case: విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన 
MLC Nagababu News: చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
చంద్రబాబుతో నాగబాబు భేటీ, నెక్స్ట్ మంత్రి పదవే
BC Protest at Jantar Mantar: జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
జనగణనతో పాటు కేంద్రం కులగణన చేయాలి, ఢిల్లీలో బీసీ పోరు గర్జనలో రేవంత్ రెడ్డి డిమాండ్
Hyderabad Crime News:ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
ప్రియుడిపై మోజుతో చిన్నారులను చంపిన తల్లి- అమీన్‌పూర్‌ కేసులో షాకింగ్ నిజాలు 
Crime News: నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
నెల్లూరులో దోపిడీ దొంగల బీభత్సం- రైళ్లు ఆపి బంగారం, ఆభరణాలు, నగదు దోపిడీ
Vizag News: విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
విశాఖలో యువకుడి ఘాతుకం- ప్రేమించలేదని తల్లీకూతురిపై దాడి- ఒకరు మృతి 
Embed widget