అన్వేషించండి

Higher Education in AP: ఏపీలో ఉన్నత విద్య ప్రవేశాల్లో వ్యత్యాసాలు, AISHE సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (GER) రోజురోజుకు తగ్గిపోతోంది. ఉన్నత విద్య ప్రవేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది.

AISHE Survey Report AP: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి (GER) రోజురోజుకు తగ్గిపోతోంది. ఉన్నత విద్య ప్రవేశాల్లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తేడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2020-21 సంవత్సరానికిగాను జీఈఆర్ 37.2 శాతం ఉండగా, 2021-22 నాటికి 36.5కి పడిపోయింది. అబ్బాయిల ప్రవేశాలు 0.6శాతం, అమ్మాయిల చేరికలు 0.8 శాతం తగ్గాయి. పక్కనున్న తెలంగాణలో జీఈఆర్ 40శాతం ఉండగా.. తమిళనాడులో 47, కర్ణాటకలో 36.2 శాతంగా ఉంది. కేంద్రం విడుదల చేసిన అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE - All India survey on Higher Education) 2021-22 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఉన్నత విద్యలో ప్రవేశాలు, అధ్యాపకుల నిష్పత్తిపై నిర్వహించిన సర్వేలో.. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కలిపి రాష్ట్రం నుంచి 3,262 సమాచారాన్ని అందించాయి. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. ముఖ్యంగా పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు తగ్గాయి. పీహెచ్‌డీలో రెగ్యులర్‌గా 2020-21లో 6,991మంది ప్రవేశాలు పొందగా.. 2021-22లో ఇది 5,583 కు తగ్గిపోయింది. పీజీలో 1,81,102మంది ప్రవేశాలు ఉండగా.. 2021-22 నాటికి 1,50,142కు పడిపోయింది. జాతీయ స్థాయిలో పెరుగుతుంటే.. రాష్ట్రంలో మాత్రం తగ్గడం గమనార్హం.

రాష్ట్రంలో అన్ని రకాల పీజీ కోర్సుల్లోనూ ఏటా ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. చాలామంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్‌(యూజీ)తోనే చదువు ఆపేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పాఠాల బోధనకు అధ్యాపకుల కొరత ఏర్పడుతుంది. పీహెచ్‌డీలోనూ అదే దుస్థితి నెలకొంది. మరోవైపు విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదువుకునేందుకు, ఉద్యోగాలకు వెళ్లిపోతుండటంతో ఏపీలో పీహెచ్‌డీ, పీజీ ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. జాతీయ స్థాయిలో 18-23 సంవత్సరాల వయసున్నవారు 2017 నుంచి 2021 వరకు పీహెచ్‌డీ, పీజీ ప్రవేశాలలో క్రమంగా పెరుగుతుండగా.. రాష్ట్రంలో తగ్గిపోతున్నారు. 2019లో 54,01,400 మంది ఉండగా.. 2021 నాటికి 52,85,000 పడిపోయింది. 

అమ్మాయిల సంఖ్య తక్కువే..
జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో ప్రతి వంద మంది అబ్బాయిలకు 93 మంది అమ్మాయిలే ఉన్నత విద్యలో ఉన్నారు. 2020-21లో 94చొప్పున ఉండగా.. 2021-22కు వచ్చేసరికి ఇది 93కు తగ్గిపోయింది. అత్యధికంగా కేరళలో 144 చొప్పున ఉండగా.. ఒడిశాలో 88మంది ఉన్నారు. రాష్ట్రంలో 18-23 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి లక్ష మందికి 49 కళాశాలలు ఉండగా.. ఒక్కో దాంట్లో సరాసరిన 554మంది చొప్పున ప్రవేశాలు పొందారు.

ప్రవేశాల తీరిది..

➥ 2019-20లో పీజీ ప్రవేశాలు 2,17,840; పీహెచ్‌డీ ప్రవేశాలు 6,716

➥ 2020-21లో పీజీ ప్రవేశాలు 1,95,814; పీహెచ్‌డీ ప్రవేశాలు 6,991

➥ 2021-22లో పీజీ ప్రవేశాలు 1,84,942, పీహెచ్‌డీ ప్రవేశాలు 5,583

ఉన్నత విద్యలో అమ్మాయిలు, అబ్బాయిల నిష్పత్తి పరిశీలిస్తే.. ప్రతి 100 మంది అబ్బాయిలకు ఏపీలో 93 మంది అమ్మాయిలే ఉన్నారు. ఇక కర్ణాటకలో 101 మంది అమ్మాయిలు, తమిళనాడు 101 మంది అమ్మాయిలు, తెలంగాణ 108 మంది అమ్మాయిలు ఉన్నారు. జాతీయ స్థాయిలో పరిశీలిస్తే ప్రతి 100 మంది అబ్బాయిలకు 101 మంది అమ్మాయిలు ఉన్నారు. 

ALSO READ:

బిట్‌శాట్‌- 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షల షెడ్యూలు ఇలా
రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న 'బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్(బిట్స్)'- బిట్‌శాట్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు కల్పించనున్నారు. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆయా క్యాంపస్‌లలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. 
ప్రవేశపరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
Board Exams Cancel: వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
వార్ ఎఫెక్ట్.. ఖతార్, యుఏఈ సహా గల్ఫ్ దేశాలలో CBSE 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget