అన్వేషించండి

AP SSC Results 2025: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల, ఒక్క క్లిక్‌తో రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Andhra Pradesh 10th Results 2025: ఏపీలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. విద్యార్థులు టెన్త్ ఫలితాలను ఒక్క క్లిక్ ద్వారా ఇక్కడ చెక్ చేసుకోండి.

రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసిన వారిలో 81.14 శాతం మంది విద్యార్థులు పాసయ్యారని విద్యాశాఖ తెలిపింది. టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరైన 6,14,459 మంది విద్యార్థులు కాగా, వీరిలో 4,98,585 మంది విద్యార్థులు పాసయ్యారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ లో, ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.. 

93.90శాతం ఉత్తీర్ణతతో మొదటిస్థానంలో మన్యం జిల్లా నిలిచింది. టెన్త్ పరీక్షలలో 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలు 1680 ఉన్నాయి. ఫలితాలను ఆన్ లైన్, వాట్సాప్ లో అప్ లోడ్ చేసి విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.  ఈ ఫలితాలు విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. దీంతో వెబ్ సైట్ తో పాటు వాట్సాప్ లో ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో అధికారులు వివరాలు వెల్లడించారు.

అభ్యర్థులు టెన్త్ ఫలితాల కోసం వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలు ఎంచుకుని, ఆపై టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ ద్వారా టెన్త్ క్లాస్ ఫలితాల PDF కాపీని పొందవచ్చు.

 

టెన్త్ రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి హైలైట్స్.. 
• అభ్యర్థులను సమర్పించిన మొత్తం పాఠశాలల సంఖ్య: 11,819
• టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు : 6,14,459
• రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం (రెగ్యులర్ అభ్యర్థులు): 81.14%
• బాలురు ఉత్తీర్ణత శాతం: 78.31%
• బాలికలు ఉత్తీర్ణత శాతం: 84.09%
• బాలికల మొత్తం ఉత్తీర్ణత శాతం బాలుర కంటే 5.78% ఎక్కువ.
• మొత్తం 1,680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత రేటును సాధించాయి.
• 19 పాఠశాలలు 0% ఉత్తీర్ణత రేటును నివేదించాయి.
• పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని 93.90%తో నమోదు చేసింది.
• అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64%తో అత్యల్ప ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది.
• ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలు 95.02%తో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి.
• డివిజన్ వారీగా విద్యార్థుల ఫలితాలు ఇలా ఉన్నాయి. 65.36% మంది ఫస్ట్ డివిజన్, 10.69% మంది సెకండ్ డివిజన్, 5.09% మంది థర్డ్ డివిజన్ సాధించారు.

2015 నుండి 2025 వరకు సంవత్సం వరకు పనితీరులో 2019 వరకు స్థిరమైన ఉత్తీర్ణత రేట్లు 90% కంటే ఎక్కువగా ఉన్నాయి. మహమ్మారి సంబంధిత కారణంగా 2020, 2021లో 100% ఉత్తీర్ణత శాతాలు ఉన్నాయి. 2022లో అత్యల్ప ఉత్తీర్ణత రేటు (67.26%), ఆ తర్వాత 2025లో క్రమంగా కోలుకుని ఏకంగా 81.14%కి చేరుకుంది.
• SSC అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 19-05-2025 నుండి 28-05-2025 వరకు షెడ్యూల్ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget