News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP SSC Exams: పదో తరగతి పరీక్షలపై ఏపీ కీలక నిర్ణయం... ఈ ఏడాది 7 పేపర్లతోనే పరీక్షల నిర్వహణ

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2021-22 విద్యాసంవత్సరంలో పదో పరీక్షలను 7 పేపర్లకే పరిమితం చేసినట్లు ప్రకటించింది.

FOLLOW US: 
Share:

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పరీక్ష పేపర్లను తగ్గించింది. వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలను 11 పేపర్లకు బదులు 7 పేపర్లే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. కోవిడ్‌ కారణంగా పదో తరగతి ఫైనల్ పరీక్షలను ఈ ఏడాది 7 పేపర్లకే కుదిస్తున్నట్లు తెలిపారు. 2021–22 విద్యాసంవత్సరంలో టెన్త్‌ పరీక్షలకు 6 లక్షల మంది హాజరవ్వనున్నారు. కరోనా కారణంగా 2019–20, 2020–21లో పది పబ్లిక్‌ పరీక్షలకు 11 పేపర్లకు బదులు 7కు కుదించారు. అయినా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయారు. 2019–20 విద్యాసంవత్సరంలో విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేశారు. 

Also Read: ఆలయాల ప్రాంగణాల్లోని దుకాణాల వేలంలో హిందూయేతరులూ పాల్గొనవచ్చు.. సుప్రీంకోర్టు ఆదేశం !

సప్లిమెంటరీ పరీక్షలకూ 7 పేపర్లు

కరోనా కారణంగా 2020–21లో కూడా పది పరీక్షలను నిర్వహించలేదు. విద్యార్థులను ఆల్‌పాస్‌గా ప్రకటించారు. దీంతో విద్యార్థుల పై చదువులకు, ఉద్యోగాలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారి అంతర్గత మార్కుల బట్టి గ్రేడ్లు ప్రకటించారు. 2020లో 6,37,354 మంది, 2021లో 6,26,981 మంది పదో తరగతి విద్యార్థులకు అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు పదోతరగతిలో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను కూడా ఏడు పేపర్లతోనే నిర్వహిస్తారు. సామాన్య శాస్త్రం మినహా అన్ని సబ్జెక్టులకూ ఒకే పేపరు నిర్వహిస్తారు. ప్రతీ పేపర్ లో మొత్తం 33 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు ఒకటిగా, జీవశాస్త్రం పేపర్లు ఒకటిగా ఇస్తారు. 100 మార్కుల పరీక్షకు 3.15 గంటల సమయం ఇవ్వగా... ప్రశ్నపత్రం చదువుకోవడానికి, రాసింది సరి చూసుకోవడానికి 15 నిమిషాలు, పరీక్ష రాయడానికి 3 గంటల సమయం ఉంటుంది. 7 పేపర్ల విధానాన్ని ఈ ఒక్క ఏడాదే అమలు మాత్రమే చేయనున్నారు. 2023 మార్చి నుంచి తిరిగి 11 పేపర్ల విధానం అమల్లోకి వస్తుంది.

Also Read:  మద్యంపై వ్యాట్ తగ్గింపు.. ఏపీలో తగ్గనున్న మద్యం ధరలు..! ఏ బ్రాండ్ ఎంత తగ్గనుందంటే ?

Also Read: మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ సభ...అమరావతిలో రాజధానికి వ్యతిరేకమని ప్రకటించిన మేధావులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Dec 2021 08:14 PM (IST) Tags: ap govt SSC exam AP SSC exams Seven papers ap ssc board

ఇవి కూడా చూడండి

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

CAT 2023 Exam: క్యాట్‌-2023 పరీక్షకు వేళాయే - హాజరుకానున్న 3.3 లక్షల మంది అభ్యర్థులు, ఇవి పాటించాల్సిందే!

AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు

AICTE: విద్యా సంస్థల మిళితం, ఇకపై కాలేజీలు కలిసి పనిచేయొచ్చు - త్వరలో ఏఐసీటీఈ మార్గదర్శకాలు

టాప్ స్టోరీస్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Innings Highlights:శతకంతో రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

IND Vs AUS, Innings Highlights:శతకంతో  రుతురాజ్ ఊచకోత , ఆసీస్ పై మరోసారి భారీ స్కోర్

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు

Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల

Sonia Gandhi: మీకు నిజాయతీ పాలనను అందించడానికి మేం సిద్ధం - సోనియా గాంధీ వీడియో విడుదల