అన్వేషించండి

AP ECET: రేపు ఏపీ ఈసెట్‌ ఫలితాలు, ఇలా చూసుకోండి!

వాస్తవానికి ఆగస్టు 6న ఈసెట్ ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. ఆగస్టు 10న ఫలితాలు ప్రకటించనున్నారు.

జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జులై 22న ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఏపీ ఈసెట్-2022 ఫలితాలను ఆగస్టు 10న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ ఆచార్య ఎ.కృష్ణమోహన్. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించనున్నామన్నారు. వాస్తవానికి ఆగస్టు 6న ఈసెట్ ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల ఫలితాల వెల్లడి ఆలస్యమైంది. దీంతో ఆగస్టు 10న ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

ఏపీ ఈసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులు 25 శాతంగా ఉంది. అంటే 200 మార్కులకు గాను అభ్యర్థులకు కచ్చితంగా 50 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కనీస అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు కేటాయిస్తారు. ఇక కటాఫ్ మార్కుల విషయానికొస్తే.. ఒక్కో అభ్యర్థికి ఒక్కో విధంగా ఉంటాయి. అభ్యర్థుల సామాజికవర్గం, గతేడాది కటాఫ్ మార్కులు, పరీక్ష కాఠిన్యత, పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది.

డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు మన రాష్ట్రంతో పాటు తెలంగాణలోని 103 కేంద్రాలలో జూలై 22న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించారు.

ఏపీ ఈసెట్-2022 పరీక్షకు మొత్తం 38,741 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నిర్వహించిన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, సివిల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించి 17,180 మంది హాజరు కాగా, 1,138 మంది గైర్హాజరయ్యారు.

ఇక మధ్యాహ్నం నిర్వహించిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్, ఫార్మసీ, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మైనింగ్‌ విభాగాలకు సంబంధించి 19,238 మంది హాజరయ్యారు. పరీక్ష ప్రాథమిక కీ ఈ జులై 24న విడుదల చేశారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలకు జులై 26వ తేదీ ఉదయం 10 వరకు అవకాశం కల్పించారు. 
Website

AP ECET-2022 ఫలితాలు ఇలా చూసుకోండి..

  • ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx  వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

  • అక్కడ హోంపేజీలో కనిపించే 'AP ECET - 2022' టాబ్‌పై క్లిక్ చేయాలి.

  • క్లిక్ చేయగానే ఈసెట్-2022కు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. -https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx

  • అక్కడ పేజీలో కనిపించే AP ECET - 2022 Results/Rank Cards ఆప్షన్‌పై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.

  • ఫలితాలతోపాటు ర్యాంకు కార్డులు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


JEE Advanced 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఆగస్టు 8న దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం ఆగస్టు 8 నుంచి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

షెడ్యూలు ప్రకారం ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలో రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2) ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం కేటాయించారు.

 

Also Read:

హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!

బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!


పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌


పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

HPV Vaccine : HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
HPV వ్యాక్సిన్ ఎవరికి అవసరం? మగవారు కూడా వేసుకోవచ్చా? అది ఎలా పని చేస్తుంది? 
Brain Storage Capacity: మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
మన మెదడు మెమొరీ స్టోరేజ్‌ కెపాసిటీ ఎంతో తెలుసా? వివరాలు తెలిస్తే షాక్ అవుతారు!
Common Man Legal Rights: నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
నిర్దోషిగా బయటపడ్డారు కానీ పోగొట్టుకున్న కాలం, గౌరవం మాటేమిటి?
Free Online Courses India: ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!
ఉచితంగా ఏఐ, ఐఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్ కోర్స్‌లు! ప్రతి విద్యార్థి ఫోన్‌లో ఉండాల్సిన యాప్‌లు ఇవే!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget