అన్వేషించండి

Crime News: హైదరాబాద్‌లో మర్డర్, కర్ణాటకలో కాల్చేసింది - ప్రియుడితో కలిసి మూడోభర్తను చంపేసింది, ఆస్తి కోసం దారుణం

Hyderabad News: ఓ మహిళ ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి కడతేర్చింది. హైదరాబాద్‌లో చంపేసి మృతదేహాన్ని బెంగుళూరులో ముక్కలుగా నరికేసి కాల్చేశారు. పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Wife Murdered Her Husband In Hyderabad: ఆస్తి కోసం ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలిసి మూడో భర్తను హతమార్చింది. హైదరాబాద్‌లో (Hyderabad) చంపేసి కర్ణాటకలో మృతదేహాన్ని ప్రియుడి సాయంతో కాల్చేసింది. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడడంతో పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన నిహారిక (29) వరుసగా బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హరియాణాకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చింది. రెండో భర్త పెట్టిన కేసులో జైలుకు వెళ్లగా.. ఆమెకు మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది. అనంతరం బెంగుళూరుకు మకాం మార్చింది.

స్థిరాస్తి వ్యాపారిని..

అనంతరం మ్యాట్రిమోనీ వేదిక ద్వారా హైదరాబాద్ తుకారాంగేట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పింది. రమేశ్‌కు అప్పటికే భార్య, కుమార్తె ఉన్నారు. అయినా ఇద్దరూ 2018లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఘట్‌కేసర్ పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో కాపురం పెట్టారు. ఉద్యోగం పేరిట నిహారిక బెంగుళూరుకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో నిహారిక ఈ నెల 4వ తేదీన పోచారానికి రాగా.. అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేశ్ కుమార్ గొడవపడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన నిహారిక.. రాణాను వెంటబెట్టుకొని తిరిగివచ్చింది. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. రాత్రి 11 గంటల సమయంలో కారులో బయటకు వెళ్లారు. రమేశ్ కుమార్ హత్యకు పక్కాగా ప్లాన్ చేశారు.

నిహారిక, రాణాలు మేడిపల్లి ఠాణా పరిధి పీర్జాదిగూడ కమాన్ వద్ద రమేశ్‌ను కారులోనే కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని ఆమె బెంగుళూరులోని మరో ప్రియుడు నిఖిల్ రెడ్డికి చెప్పింది. అతడి సూచనతో మృతదేహాన్ని కారులోనే కర్ణాటకలోని కొడుగు జిల్లా సుంటికుప్ప ప్రాంతానికి తరలించారు. అక్కడ ఓ కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. అక్కడే కాల్చేసి పరారయ్యారు. 8వ తేదీన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాఫీ తోట, చుట్టుపక్కల ప్రాంతాల్లో 500 సీసీ కెమెరాలను పరిశీలించారు. వాటిలో నమోదైన కారు నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. రమేశ్ పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తిని కాజేసేందుకే హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. కేసును మేడిపల్లి ఠాణాకు బదిలీ చేయనున్నారు.

మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య

మరో ఘటనలో, ప్రియురాలి బంధువులు కొట్టారని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పుల్కల్ గ్రామానికి చెందిన యువతి, మునిపల్లి మండలం మూలపాడు గ్రామానికి చెందిన రంజిత్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం రాత్రి యువతి బర్త్ డే ఉండడంతో రంజిత్ పుల్కల్ వెళ్లి యువతిని కలిశాడు. దీన్ని కుటుంబ సభ్యులు గమనించి ఆగ్రహంతో రంజిత్‌పై దాడి చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక రంజిత్ సింగూర్ బ్యాక్ వాటర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువతి కుటుంబ సభ్యులే కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Who Is Raj Pakala : సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
Embed widget