అన్వేషించండి

Warangal: చిట్ ఫండ్ నిర్వాహకుల చీటింగ్... రాజకీయనాయకుల అండదండతో దందాలు... రంగంలోకి వరంగల్ పోలీసులు

చిట్ ఫండ్ కంపెనీ యాజమాన్యం పై నమ్మకంతో పైసా పైసా కూడా బెట్టి చీటీలు వేసిన పేద ప్రజలకు నమ్మక ద్రోహం జరిగింది. వరంగల్ జిల్లాలో కస్టమర్ ల డబ్బుతో   చిట్ ఫండ్ యజమానులు కోట్లకు పడగలెత్తుతున్నారు. 

చిట్ ఫండ్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిట్టీ ముగిశాక , తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే  వినియోగదారులను ముప్పు తిప్పులు పెట్టి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు.  ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటే కస్టమర్ల జీవితాలను ఆగమాగం చేస్తున్నారు. బడాబాబులు, పలు పార్టీల నేతలు సైతం ఈ పాపంలో వాటాలు తీసుకుంటూ బీదవాడి ఉసురు తీస్తున్నారు. కస్టమర్లతో చిట్టీలు కట్టించుకోవడం, నెలనెల క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యే. ఎప్పుడైతే చిట్టీ మెచ్యూరిటీ సమయం వస్తుందో అప్పుడే అసలు కిటుకు మొదలవుతుంది. అప్పటి నుంచి వినియోగదారుడికి ఎలాంటి స్పందన ఉండదు. డబ్బులు ఎప్పుడిస్తారో కూడా తెలియదు, కనీసంగా ఫోన్లలో కూడా సమాధానం దొరకదు. ఆ మాటకొస్తే చిట్ ఫండ్ నిర్వాహకులు సదరు కస్టమర్లను తప్పించుకుని తిరుగుతారు. అనుకోకుండా ఎప్పుడైనా ఎదురైతే ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే కస్టమర్లకు నరకం చూపించే క్రమంలో అందరూ ఒక్కటే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. పేర్లు వేరైనా, తమ ప్రయోజనం మాత్రం అంతిమంగా వినియోగదారులను నిండా ముంచడమే లక్ష్యమని చెప్పకనే చెబుతున్నాయి.

సొమ్ముతో వెంచర్లు

చిట్ ఫండ్ యజమానులంతా వినియోగదారుల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పోగైన డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. తక్కువ ధరలు ఉన్న ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, సమయాన్ని చూసి ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. వ్యవసాయ భూములు కొనడానికి వినియోగదారుల సొమ్మునంతా పెట్టుబడిగా పెట్టి వేడుక చూస్తుంటారు. ఏదో అవసరానికి చిట్టీ ఎత్తుకున్న వారు ఎంతకీ డబ్బులు చేతికి అందక పడరాని పాట్లు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయిన కస్టమర్లు నిలదీస్తే, సిబ్బందితో వారిపై దాడులు చేయిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాలు, ఫర్నిచర్ ను చిట్ ఫండ్ యాజమాన్యాలు తామంతట తామే నష్టపర్చుకుని, డబ్బులు అడిగినందుకు ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరిగాయని కూడా కస్టమర్లు వాపోతున్నారు. కస్టమర్లను విల్లాలు, వెంచర్లు అంటూ భ్రమల్లో విహరింపజేస్తున్నారు. కార్లలో సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వెంచర్లకు తీసుకెళ్లి రోజంతా తిప్పి, విలాసవంతమైన హోటళ్లలో డిన్నర్లు ఇప్పించి సాయంత్రానికి ఇళ్ల వద్ద దింపుతూ పబ్బం గడుపుకుంటున్నాయి. తమ సొమ్ము తమకు ఇవ్వడానికి ఇదంతా ఎందుకని ప్రశ్నిస్తే డబ్బులన్నీ వెంచర్లు, విల్లాల్లో పెట్టుబడులు పెట్టామని, లాభం రెట్టింపుగా రాగానే వాటా ఇచ్చేస్తామని కాలం వెల్లదీస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు డబ్బులు లేవు.. ఓ ఫ్లాట్ తీసుకొండని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

కాలిబూడిదైన కస్టమర్..

ఓ పేరుమోసిన చిట్ ఫండ్ యాజమాన్యం నిర్వాకంతో హన్మకొండ కాంగ్రెస్ భవన్ ఎదుట ఓ వ్యక్తిపై పెట్రోల్ దాడి కూడా జరిగింది. గడువు తీరిన తర్వాత రావాల్సిన చిట్టీ డబ్బులు అడగడంతో మధ్యవర్తిగా ఉన్న చిట్ ఫండ్ ఉద్యోగి భార్యతో సహా వెళ్లి కస్టమర్ పై పెట్రోల్ దాడి చేయించారు. ఈ ఘటనలో సెల్ షాపు నిర్వాహకుడు తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి రెండు రోజులు గడిచిన తర్వాత తుది శ్వాస విడిచిన విషయం ఎవరూ మరిచిపోలేనిది. ఇది కేవలం బయటకు వచ్చిన దారుణం మాత్రమే, ఇలాంటివి ఇంకా లోలోపల జరుగుతున్న ఘటనలు ఎన్నెన్నో. పలువురు వినియోగదారులు చిట్టీ డబ్బులకు తిరిగి విసిగిపోయి కుటుంబాలతో సహా వచ్చి నిరసన తెలిపిన ఘటనలూ ఉన్నాయి.  చిట్ ఫండ్ యజమాన్యాలు వినియోగదారులే దేవుళ్లు అనే సూక్తిని మరిచి, వారి పాలిట యముళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయి.


గతంలోనే పోలీసులు  చిట్ ఫండ్స్ యజమానులతో వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. వినియోగదారుల విషయంలో, చిట్టీల నిర్వహణలో నిబంధనలు పాటించాలని సూచించారు. విచ్చలవిడిగా చిట్స్ ప్రారంభిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, వినియోగదారులను ఇబ్బందులుపెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. . అయినా, చిట్స్ నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా, కొందరు రాజకీయ నాయకుల అండదండలతో నిర్వాహకులు పేట్రెగిపోతున్నట్లు సమాచారం. బడాబడా లీడర్ల సపోర్ట్ తో చిట్స్ మేనేజ్మెంట్లు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోంది. కమిషనర్ స్థాయి వ్యక్తే స్వయంగా సమావేశాలు ఏర్పాటు చేసి, హెచ్చరించినా వ్యవస్థలో మార్పు లేదంటే నిర్వాహకులు ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది.

ఫిర్యాదులపై కమిషనర్ దృష్టి..

చిట్ ఫండ్స్ యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక లెక్కకు మిక్కిలి వస్తున్న ఫిర్యాదులపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించారు.  ఈ క్రమంలోనే బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పేరుమోసిన పలువురు చిట్ ఫండ్స్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చిట్ ఫండ్స్ కార్యాలయాల నిర్వహణ, నిబంధనలు, లావాదేవీలు జరుగుతున్న తీరు తదితరాలపై విచారణ జరుపుతున్నట్టు సమాచారం. వినియోగదారుల విషయంలో అనుసరిస్తున్న తీరు, డబ్బులు చెల్లించేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పై ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా విచారణలో ఇంకా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.  చిట్ ఫండ్స్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారణ జరుగుతుండగానే, పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు మొదలైనట్టు తెలుస్తోంది. బడా లీడర్లు కొందరు పోలీసులను లైన్లోకి తీసుకుని విచారణకు ఆటంకం కలిగిస్తునట్టు వినికిడి. చిట్ ఫండ్స్ యజమానులు రాజకీయ నాయకుల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తుండడంతో వారిని కాపాడే పనిలో పడ్డారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
Yadadri Crime News: భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం
భార్యపై కోపంతో పండులో ఎలుకల మందు కలిపి కుమార్తె హత్య, ఆపై తండ్రి ఆత్మహత్యాయత్నం

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget