By: ABP Desam | Updated at : 01 Dec 2022 08:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఎల్ఎల్బీ విద్యార్థినిపై అత్యాచారం
Warangal News :వరంగల్ జిల్లా హన్మకొండ నగరంలో దారుణ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతున్న విద్యార్థిని (23)పై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండటం కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లాకు చెందిన విద్యార్థిని హన్మకొండలోని ఓ కళాశాలలో ఎల్ఎల్బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. తనపై లైంగికదాడి జరిగిందని బుధవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే పీఏ ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పీఏతోపాటు అతడి స్నేహితుడు, హాస్టల్ నిర్వాహకురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అశ్లీల వీడియోలు చూసి విద్యార్థినిపై లైంగిక దాడి
హైదరాబాద్ హయత్ నగర్ లో జరిగిన పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లిదండ్రుల ఫోన్ తీసుకున్న ఓ అబ్బాయి అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. వాటినే తన స్నేహితులకు కూడా చూపిస్తూ అలవాటుగా మార్చుకున్నారు. ఆ వీడియోల్లో లాగే చేయాలని నిర్ణయించుకుని పథకం ప్రకారమే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీసి బెదిరింపులకు పాల్పడి మరోసారి దారుణానికి ఒడిగట్టారు.
తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ లో
హయత్ నగర్ కు చెందిన ఓ బాలుడు తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్ తీసుకొని అశ్లీల వీడియోలు చూడడం అలవాటు చేసుకున్నాడు. తన ఫ్రెండ్స్కి కూడా ఆ వీడియోల గురించి చెప్పాడు. వాళ్లంతా కలిసి వీడియోలు చూశారు. రోజూ క్లాస్ అయిపోగానే వారంతా కలిసి ఎవరూ లేని ప్లేస్కు వెళ్లి అశ్లీల వీడియోలు చూసేవారు. నెల రోజుల పాటు వీడియోలు చూశాక వారి మైండ్ పూర్తిగా అలాంటి ఆలోచనలతో నిండిపోయింది. వారిలో కోరికలు మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ఉన్నట్లుగానే చేయాలని నిర్ణయించుకున్నారు. వీడియోల్లో ఉన్నట్టుగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విద్యార్థులు.. తమ క్లాస్మీట్కు వల వేశారు. ఓ అమాయకురాలైన అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చదువుతున్నది పదో తరగతే అయినప్పటికీ మాససికంగా చిన్న పిల్లల ప్రవర్తించడంతో ఆమెనే వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మాయ మాటలు చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు. అయితే ఈ తతంగాన్ని అంతా అందులో ఉండే మరో అబ్బాయి వీడియో తీశాడు. దాన్ని చూపిస్తూ రెండో సారి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు.
రెండోసారి కూడా
వీడియోల్లో ఉన్నట్టుగా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విద్యార్థులు.. తమ క్లాస్మేట్కు వల వేశారు. ఓ అమాయకురాలైన అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చదువుతున్నది పదో తరగతే అయినప్పటికీ మాససికంగా చిన్న పిల్లల ప్రవర్తించడంతో ఆమెనే వాళ్లు సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మాయ మాటలు చెప్పి స్వాతంత్ర దినోత్సవం నాడు మొదటి సారి అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు అమ్మాయిని జీవితాన్ని పాడు చేశారు. అయితే ఈ తతంగాన్ని అంతా అందులో ఉండే మరో అబ్బాయి వీడియో తీశాడు. దాన్ని చూపిస్తూ రెండో సారి కూడా అత్యాచారానికి పాల్పడ్డారు.
Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే
Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం