అన్వేషించండి

Jogi Rajeev: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం - మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడుకి బెయిల్ మంజూరు

Andhra News: అగ్రిగోల్డ్ భూముల కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సర్వేయర్‌కు సైతం బెయిల్ మంజూరైంది.

ACB Court Granted Bail To Jogi Rajeev In Agrigold Lands Issue: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు (Jogi Rajeev) ఊరట లభించింది. ఆయనకు, సర్వేయర్ రమేష్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ వివాదం

ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో (Ambapuram) ఆర్ఎస్ నెం.69/2, రీసర్వే నెం.87లో అగ్రిగోల్డ్‌ భూములను ఏపీ సీఐడీ ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. ప్లాట్ల రూపంలో ఉన్న సుమారు 2,300 గజాల భూమిని సీజ్ చేసింది. ఇలా వివాదంలో ఉన్న భూములను జోగి ఫ్యామిలీ అప్పనంగా కాజేసిందని ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్‌ బాబాయ్ అయిన వెంకటేశ్వరావు, జోగి కుమారుడు రాజీవ్ కలసి వీటిని నొక్కేసినట్లు ప్రధాన అభియోగం. ఒకరి పేరు మీద 1,086 గజాలు, మరొకరి పేరు మీద 1,074 గజాలు రాయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇది డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తే సమస్య అవుతుందని గ్రహించిన జోగీ కుటుంబం... పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించినట్టు.. వాళ్ల వద్దే కొన్నట్టు పత్రాలు సృష్టించారనే విమర్శలున్నాయి.  

కాగా, దీనిపై విచారించిన ఏసీబీ అధికారులు ఈ నెల 13న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించి ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ పిటిషన్‌పై తీర్పు ఆ రోజే..

మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఆయన రెండుసార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఆయన్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

పిన్నెల్లికి బెయిల్

అటు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakirshna Reddy) సైతం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని.. పాస్ పోర్ట్ అప్పగించాలని తెలిపింది. అలాగే, ప్రతీ వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పాల్వాయిగేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో ఆయన అరెస్టై.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూన్ 26 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

Also Read: Achuthapuram SEZ: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Bondi Beach Shooting: బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
బాండీ బీచ్ ఘటన హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గార్డ్ ఆఫ్ హానర్.. చప్పట్లతో మార్మోగిన స్టేడియం
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Embed widget