అన్వేషించండి

Jogi Rajeev: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం - మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడుకి బెయిల్ మంజూరు

Andhra News: అగ్రిగోల్డ్ భూముల కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సర్వేయర్‌కు సైతం బెయిల్ మంజూరైంది.

ACB Court Granted Bail To Jogi Rajeev In Agrigold Lands Issue: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్‌కు (Jogi Rajeev) ఊరట లభించింది. ఆయనకు, సర్వేయర్ రమేష్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాజీవ్ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ అంశంలో మొత్తం 9 మందిపై కేసు నమోదైంది. తన అరెస్టును సవాల్ చేస్తూ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఇదీ వివాదం

ఎన్టీఆర్ జిల్లా అంబాపురంలో (Ambapuram) ఆర్ఎస్ నెం.69/2, రీసర్వే నెం.87లో అగ్రిగోల్డ్‌ భూములను ఏపీ సీఐడీ ఎప్పుడో స్వాధీనం చేసుకుంది. ప్లాట్ల రూపంలో ఉన్న సుమారు 2,300 గజాల భూమిని సీజ్ చేసింది. ఇలా వివాదంలో ఉన్న భూములను జోగి ఫ్యామిలీ అప్పనంగా కాజేసిందని ఆరోపణలు వచ్చాయి. జోగి రమేష్‌ బాబాయ్ అయిన వెంకటేశ్వరావు, జోగి కుమారుడు రాజీవ్ కలసి వీటిని నొక్కేసినట్లు ప్రధాన అభియోగం. ఒకరి పేరు మీద 1,086 గజాలు, మరొకరి పేరు మీద 1,074 గజాలు రాయించుకున్నట్లు తెలుస్తోంది.  ఇది డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తే సమస్య అవుతుందని గ్రహించిన జోగీ కుటుంబం... పట్టాదారులుగా ఉన్న కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు భూమిలో 4 ఎకరాలను బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించినట్టు.. వాళ్ల వద్దే కొన్నట్టు పత్రాలు సృష్టించారనే విమర్శలున్నాయి.  

కాగా, దీనిపై విచారించిన ఏసీబీ అధికారులు ఈ నెల 13న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి సోదాలు నిర్వహించి ఆయన కుమారుడు జోగి రాజీవ్‌ను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారని మరిన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి ఆయన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ పిటిషన్‌పై తీర్పు ఆ రోజే..

మరోవైపు, మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఆయన రెండుసార్లు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, ఆయన్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.

పిన్నెల్లికి బెయిల్

అటు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakirshna Reddy) సైతం ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రూ.50 వేలు విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని.. పాస్ పోర్ట్ అప్పగించాలని తెలిపింది. అలాగే, ప్రతీ వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం చేయాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున పాల్వాయిగేట్ సమీపంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు, పోలీసులపై దాడి కేసులో ఆయన అరెస్టై.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. జూన్ 26 నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు.

Also Read: Achuthapuram SEZ: అచ్యుతాపురం ప్రమాద ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Female cop kills father: పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
పేరుకే పోలీసు - కానీ తండ్రినే చంపిన హంతకురాలు - ఈమెకు ఏ శిక్ష కరెక్ట్ ?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Allahabad High Court: వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
వివాహితుడు మరో మహిళతో సహజీవనం చేయడం నేరంకాదు! అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు!
Instagram Love Tragedy: ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య
ఇన్‌స్టా లవ్ విషాదాంతం.. భర్తను వదిలి ప్రియుడితో పెళ్లి! కాలువలో దూకి ఇద్దరూ ఆత్మహత్య

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RCB VS SRH Highlights: ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో అనికేత్ వర్మ మెరుపులు.. RCBకి SRH బిగ్ టార్గెట్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Embed widget