అన్వేషించండి

Kadapa Crime News: కడప జిల్లాలో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి, గంటల వ్యవధిలో నిందితుడి అరెస్ట్

Kadapa Petrol Attack | కడప జిల్లాలో ప్రేమ పేరుతో వేధించి ఓ యువకుడు చేతిలో పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతిచెందింది. అయితే పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు అరెస్టయ్యాడు.

Petrol Attack in Kadapa District | కడప: కడప జిల్లా బద్వేల్‌లో పెట్రోల్‌ దాడికి గురైన విద్యార్థిని మృతి చెందింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోందన్న కోపంతో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్‌ శనివారం పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అనంతరం బాధితురాలిని కడప రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు విఘ్నేశ్‌ ను పోలీసులు గంటల వ్యవధిలో శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 

కడప జిల్లా బద్వేలులో గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి విఘ్నేశ్‌ అనే యువకుడు నిప్పంటించాడు. విద్యార్థినికి 80 శాతం కాలిన గాయాలు కాగా, తనకు సాయం చేయాలని ఆర్తనాదాలు చేసింది. అది గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలికి చికిత్స అందించేందుకు శనివారం నాడు కడప రిమ్స్ కు తరలించారు. మరోవైపు ఘటనపై సీఎం చంద్రబాబాబు సీరియస్ అయ్యారు. నిందితుడ్ని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టి నిందితుడు విఘ్నేశ్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ వేధింపులే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.

అసలేం జరిగింది..
కడప జిల్లా బద్వేల్‌ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థిని స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే ఏరియాకు చెందిన వాడు కావడంతో విఘ్నేశ్‌తో పరిచయం ఉంది. తనను ప్రేమించాలని కొన్నేళ్ల నుంచి నిందితుడు విఘ్నేశ్ యువతి వెంట పడి వేధింపులకు గురిచేస్తున్నాడు. కొన్ని నెలల కిందట యువకుడికి వివాహం అయినట్లు సమాచారం. అయినా యువతిని ప్రేమ పేరుతో వేధిస్తూ, తనను పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడాలని, రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేశాడు. అతడికి మరోసారి సర్దిచెబుతామని ఇంటర్ విద్యార్థిని ఆటోలో వెళ్లింది.

పై విఘ్నేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని  ఆమెను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలో పొదలచాటుకు తీసుకెళ్లిన విఘ్వేశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, అందుకు విద్యార్థిని నిరాకరించింది. ఆవేశానికి లోనైన నిందితుడు విఘ్నేశ్ ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ విద్యార్థినిపై పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి ప్రేమోన్మాది పరారయ్యాడు.

Also Read: Hyderabad Crime: వివాహిత మీద కన్నేసి చివరికి దారుణం, బాలిక హత్య కేసు ఛేదించిన సూరారం పోలీసులు

బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన
8వ తరగతి నుంచే తమ కుమార్తెను ప్రేమ పేరుతో నిందితుడు విఘ్నేశ్  వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. కొన్ని నెలల కిందట అతడికి వివాహమైనా కూడా వేధింపులు ఆపలేదన్నారు. చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి రప్పించి తన కుమార్తెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సమయంలో జిల్లా జడ్జి శనివారం నాడు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. భార్య వద్దు, నువ్వే కావాలంటూ వేధించాడని.. బ్లాక్ మెయిల్ చేసి రప్పించుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించినట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లికి నిరాకరించడంతో పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటినట్లు విద్యార్థిని స్టేట్మెంట్ ఇచ్చింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget