News
News
వీడియోలు ఆటలు
X

UP Tractor Accident : ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం, వంతెనపై నుంచి నదిలో పడిన ట్రాక్టర్- 12 మంది మృతి

UP Tractor Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోరప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి ట్రాక్టర్-ట్రాలీ పడిపోవడంతో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

FOLLOW US: 
Share:

UP Tractor Accident : ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నీళ్లు తీసుకురావడానికి 30 మందితో వెళ్తోన్న ట్రాక్టర్‌ అదుపు తప్పి వంతెనపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు అజ్మత్‌పూర్‌ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. ప్రమాదస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేట్టారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని  షాజహాన్‌పూర్‌ ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించామన్నారు.  ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. 

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం 

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ ​గఢ్​ జిల్లాలోని ఓల్డ్ ముంబయి- పుణె హైవేపై నుంచి ఓ బస్సు లోయలో పడిపోయింది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 12మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మందికి తీవ్రగాయాలయ్యాయి. ముంబ జార్జ్ గావ్ ​కు చెందిన బాజి ప్రభు వాడక్​ గ్రూప్​ అనే మ్యూజిక్​ బృందం ఈవెంట్​ కోసం పుణెలోని పింప్రి చిచ్వాడ్​ ప్రాంతానికి వచ్చింది. అక్కడి నుంచి శుక్రవారం అర్ధరాత్రి  తిరిగి జార్జ్ గావ్ కు ఓ ప్రైవేట్​ బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం.  

12 మంది మృతి 

ఈ బస్సు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రమాదంలో మృతిచెందిన వారితో పాటు గాయపడిన వారిని స్థానిక కోపాలీ రూరల్​ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు.  రాయ్ గడ్ ​లోని లోయలో బస్సు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఎస్​పీ సోమ్​నాథ్​ గర్గ్​ మీడియాకు తెలిపారు.  

Published at : 15 Apr 2023 08:10 PM (IST) Tags: Uttarpradesh Shahjahanpur Tractor Accident 12 diead falls off

సంబంధిత కథనాలు

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Guntur Accident: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Ongole News: ఒంగోలులో విషాదం - తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి 

Bike Stunts: వికటించిన మైనర్ల బైక్‌ విన్యాసాలు, కిందపడి గాయాలు, చుట్టుముట్టిన కేసులు

Bike Stunts: వికటించిన మైనర్ల బైక్‌ విన్యాసాలు, కిందపడి గాయాలు, చుట్టుముట్టిన కేసులు

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన