అన్వేషించండి

Jaahnavi Kandula: అమెరికాలో జాహ్నవి కందుల మృతి - ఆ పోలీస్ అధికారి ఉద్యోగం ఊస్ట్

Andhrapradesh News: అమెరికాలో కర్నూలు యువతి కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన పోలీస్ అధికారిపై వేటు పడింది. ఆయన్ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు.

US Cop Lost His Job In Kurnool Young Woman Death Issue: గతేడాది అమెరికాలో కర్నూలు జిల్లాకు చెందిన యువతి జాహ్నవి కందుల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిని చులకనగా చేస్తూ మాట్లాడిన పోలీస్ అధికారిపై అక్కడి ఉన్నతాధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. డేనియల్ అడెరెర్ అనే పోలీస్ అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విషాద సమయంలో ఆయన మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే.?

ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. గతేడాది జనవరిలో సియాటెల్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తుపై డేనియల్ అడెరెర్ అనే పోలీస్ అధికారి యువతి మృతి పట్ల చులకనగా మాట్లాడాడు. 'ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువ లేదు.' అన్నట్లుగా ఆయన మాట్లాడిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. అంతే కాకుండా ఆయన పగలబడి నవ్వడం కూడా తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్ చేసింది. ఈ క్రమంలో సదరు అధికారిని అప్పట్లోనే సస్పెండ్ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు చేపట్టారు. 

'పోలీస్ వృత్తికే సిగ్గుచేటు'

కందుల జాహ్నవి మృతిపై పోలీస్ అధికారి అడెరెర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని.. పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ రహర్ తెలిపారు. ఆయన మాటలు సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు మాయని మచ్చ తెచ్చాయని పేర్కొన్నారు. అడెరెర్ వ్యాఖ్యలు పోలీస్ వృత్తికే సిగ్గుచేటని.. ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని అన్నారు. పోలీసులు బాధ్యతగా వ్యవహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో అడెరెర్‌ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్‌మెంట్‌కే అగౌరవమని.. అందుకే ఆయన్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: Crime News: తిరుపతి జిల్లాలో దారుణాలు - బిస్కెట్ల ఆశ చూపి 8 ఏళ్ల చిన్నారిపై హత్యాచారం, మరో చోట ఇంటర్ విద్యార్థినిపై అఘాయిత్యం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget