అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు - రోడ్డు ప్రమాదాల్లో నలుగురు, గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

Andhra News: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 9 మందికి గాయాలయ్యాయి. ఏపీలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా.. తెలంగాణలో ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.

Two People Died Due To Cylinder Explodes In Nandyal: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా 9 మందికి గాయాలయ్యాయి. తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు నలుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల (Nandyal) పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వీరికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు. ఈ క్రమంలో గ్యాస్ కొద్దికొద్దిగా లీకైంది.

మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచిన వెంకటమ్మ.. గ్యాస్ లీకైన విషయం గమనించకుండా వంటగదిలో లైట్ వేసింది. దీంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించా యి. పేలుడు ధాటికి మిద్దె పైకప్పు కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటమ్మతో పాటు దినేశ్ అనే పదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు సుబ్బమ్మ, రాయుడుతో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నారు.

మితిమీరిన వేగంతో..

అటు, తెలంగాణలోని వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. శివరాంపల్లి సమీపంలోకి రాగానే బైక్ ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొట్టి డివైడర్ వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువకులు బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగం, ట్రిపుల్ రైడింగే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

మరోవైపు, మణికొండలో (Manikonda) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తండ్రి స్కూటీపై కూతురిని స్కూల్‌కు డ్రాప్ చేయడానికి వెళ్తుండగా.. యాక్టివాను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ కింద పడి కూతురు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రికి స్వల్ప గాయాలు కాగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కింద పడి..

అటు, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) తలమడుగు మండల కేంద్రంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని వర్ణికి చెందిన యువకుడు బైక్‌పై తలమడుగు మండలం సుంకిడి నుంచి సొంత గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme Rules: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు ఇవే, 21 నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా ఇళ్లు
YS Jagan Security: మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
మాజీ సీఎం జగన్ నివాసం, వైసీపీ సెంట్రల్ ఆఫీసు వద్ద నిఘా పెంచిన పోలీసులు - మ్యాటర్ ఏంటంటే
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Telugu TV Movies Today: నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
నాగార్జున ‘నిర్ణయం’, అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ to రవితేజ ‘ఇడియట్’, రామ్ ‘ది వారియర్’ వరకు - ఈ సోమవారం (ఫిబ్రవరి 10) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం - పేలుడు పదార్థాలు సీజ్
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Embed widget