అన్వేషించండి

TTD Vigilance Officers: వరుస వివాదాల్లో కాణిపాకం ఆలయ సిబ్బంది - పోలీసుల అదుపులో గ్యాస్ ఆపరేటర్, ఆలయ ఏఈవో

TTD Seva Ticket Scam: సుపధం మార్గం దర్శనంను సేవగా భక్తులను నమ్మించి 12 సుపధం టిక్కెట్లను అధిక ధరకు విక్రయించిన‌ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

కాణిపాకం ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా ప్రవర్తిస్తున్న సిబ్బంది..
కాణిపాకం ఆలయం పిఆర్ఓగా గ్యాస్ ఆపరేటర్  తిరుమలలో చలామణి
సుపధం టిక్కెట్టుని సేవగా నమ్మించి భక్తుల వద్ద భారీ నగదు కాజేసిన దళారి
భక్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టిటిడి విజిలెన్స్..
పోలీసుల అదుపులో గ్యాస్ ఆపరేటర్, కాణిపాకం ఆలయ ఏఈవో

TTD Seva Ticket Scam: తిరుమల పుణ్యక్షేత్రంలో దళారులు చాప కింద నీరులా భక్తులను మోసగిస్తున్నారు. దర్శనం కోసం చూసే భక్తులను టార్గెట్ గా చేసుకుని నిలువునా దోచేస్తున్నారు. దర్శన టోకెన్లు లేని భక్తులను గుర్తించి వారి వద్ద అధిక మొత్తంలో నగదు వసూలు చేసి జోబులను నింపుకుంటున్నారు కొందరు దళారులు. ఏడుకొండలపై పిఆర్ఓల పేరుతో కొందరు దళారులు భక్తులను బురిడీ కొట్టిస్తూ అందిన వరకూ దోచేస్తూ వేలకు వేలు దండుకుంటున్నారు. తాజాగా కాణిపాకం ఆలయంలో కాంట్రాక్టు గ్యాస్ ఆపరేటర్గా విధులు నిర్వర్తిస్తున్న కరుణాకర్ అనే దళారి మూడు వందల రూపాయలు విలువ గల సుపధం మార్గం దర్శనంను సేవగా భక్తులను నమ్మించి 12 సుపధం టిక్కెట్లను అధిక ధరకు విక్రయించిన‌ దళారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దళారితో పాటుగా కాణిపాకం ఆలయ ఏఈవోను సైతం పోలీసులు విచారిస్తున్నారు.

ప్రతి నిత్యం వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణలతో ఏడు కొండలు మారుమోగుతుంటాయి. స్వామి వారి దర్శనం పొందేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడరు. స్వామి వారికి ఉన్న డిమాండ్ నే కొందరు క్యాష్ చేసుకుని కొందరు అమాయకులను నమ్మించి నిలువుగా దొపిడి చేస్తున్నారు. వైసీపి అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భాధ్యతలు చేపట్టిన తరువాత కొండపై దళారుల ఏరివేతకు టీటీడీ చర్యలు తీసుకుంది. భక్తులను మోసగించే దళారులపై కేసు నమోదు చేసి కఠన చర్యలు తీసుకున్నారు. దీంతో కొద్ది రోజుల పాటు నెమ్మకుండి పోయినా దళారులు కొత్త కొత్త ఆలోచనలతో, చాప కింద నీరులా భక్తులను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దళారిగా మారిన గ్యాస్ ఆపరేటర్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ లో గ్యాస్ ఆపరేటర్ గా కరుణాకర్ విధులు నిర్వహిస్తున్నాడు. కాణిపాకం ఆలయంలో గత కొద్ది రోజుల‌ కిందట కొంత వివాదంలో చిక్కుకోవడంతో కరుణాకర్ ను ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో తిరుమలలో కాణిపాకం ఆలయ పిఆర్ఓగా అవతారం ఎత్తాడు. కాణిపాకంలో పని చేస్తున్న సమయంలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని సులభతరంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం పరిచయం ఉన్న అధికారులు, రాజకీయ నాయకుల నుంచి దర్శనం‌ సిఫార్సు లేఖలను పొంది దర్శనం లేని భక్తులను గుర్తించి వారి పేర్లతో టీటీడీ ఛైర్మన్ కార్యాలయం, జేఈవో కార్యాలయంలో కాణిపాకం ఆలయం పిఆర్ఓగా చెప్పకుంటూ దర్శనాలు పొందుతూ వచ్చేవాడు. ఈ టిక్కెట్లను సుదూర‌ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులకు అధిక ధరలకు విక్రయించేవాడు. 
గతంలో కాణిపాకం ఈవోగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్ తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలని టీటీడీకి లెటర్ పంపాడు. అందులో మరో ముగ్గురి పేర్లు చేర్చిన కరుణాకర్ వారి వద్ద అధిక డబ్బును వసూలు చేశాడు. ఈవో కుటుంబ సభ్యులతో పాటు వీరు ఎవరు అని విజిలెన్స్ సిబ్బంది ప్రశ్నించడంతో మూడు టిక్కెట్లు అమ్మేశాడని తేలింది. ప్రముఖ ఆలయం, తన పరువు పోతుందని, టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని‌ వెంకటేశ్ విన్నవించుకోవడంతో కరుణాకర్ ని‌ మందలించి వదిలి పెట్టారు. అంతటితో ఆగకుండా తన కుటుంబ సభ్యులకు దర్శనంకు వెళ్ళేందుకు సిఫార్సు లేఖ కావాలని చెప్పి మరో‌సారి ఆలయంలోని‌ ఓ‌ అధికారి పేరు‌ మీదుగా విఐపి బ్రేజ్ దర్శనం టిక్కెట్లను పొంది వాటిని అధిక ధరలకు విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న కాణిపాకం ఆలయ‌ ఈవో కరుణాకర్ ను పిలిచి‌గెట్టిగా మందలించాడు. కొద్ది‌రోజుల పాటు తన రహస్యంగా బయటి అధికారులు, రాజకీయ నాయకుల‌ సిఫార్సు‌ లేఖలపై దర్శనాలను‌ పొందుతూ వాటిని విక్రయిస్తూ వచ్చేవాడు. సిఫార్సు లేఖ లభించక పోవడంతో తన కుటుంబ సభ్యులకు దర్శనం కల్పించాలంటూ కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని కోరాడు. 

గతంలో‌ కాణిపాకం ఆలయంలోని అన్నదాన సత్రంలో గ్యాస్ ఆపరేటర్ గా పని చేసే సమయంలో కాణిపాకం ఆలయ ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న మాధవ్ రెడ్డి తో కరుణాకర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకే ఆలయంలో పని చేస్తున్న వ్యక్తులు కావడంతో ఏఈవోతో మరింత స్నేహపూర్వకంగా మెలిగేవాడు కరుణాకర్. మాధవ్ రెడ్డి వద్ద లెటర్ హెడ్ పొందిన కరుణాకర్ కర్ణాటక రాష్ట్రం, చింతామణికి చెందిన కేశవమూర్తి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. శ్రీవారి వద్ద కూర్చొని ఉండే సేవ టిక్కెట్లు తీసిస్తానని నమ్మబలికాడు. ఒక్కో టికెట్ ధర రూ. 6000 వేలుగా బేరం ఆడాడు. చివరికి ఒక్కో టికెట్ ధర రూ. 3300గా నిశ్చయించాడు. చివరకు ఆ భక్తులను సుపథం టిక్కెట్ల ద్వారా దర్శనానికి తీసుకెళ్లాడు. సేవ అని చెప్పి సుపథంకి తీసుకెళ్లాడని కరుణాకర్ పై పోలీసులకు పిర్యాదు చేసాడు కేశవమూర్తి. దింతో కరుణాకర్ ను అదుపులోకి తీసుకోని విచారణ చేపడుతున్నారు పోలీసులు. ఈ టిక్కెట్ల స్కాంకు సంబందించి కాణిపాకం ఆలయ ఏఈవో మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు పోలీసులు. 

కాణిపాకం ఈవో ఏం అన్నారంటే...
ఈ ఘటనపై కాణిపాకం ఆలయ ఈవో రాణాప్రతాప్ ను సంప్రదించగా "ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఏఈవోపై చర్యలు తీసుకుంటాం. ఏఈవో తప్పు చేసినట్లు ఎఫ్ఐఆర్ కాఫీలో పోలీసులు నిర్ధారణకు వస్తే మెమో జారీ చేస్తాం. తన వద్ద నుంచి అంజాయిషి లేఖను కోరుతాం. ఇక ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కరుణాకర్ ను ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగిస్తామని" కాణిపాకం ఈవో రాణాప్రతాప్ ఫోన్ సంభాషణలో తెలిపారు. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతుందని, ఏఈవో మాధవ్ రెడ్డిని విచారిస్తున్నాంమని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తిరుమల అడిషనల్ ఎస్పి మునిరామయ్య వెల్లడించారు. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దర్శన టికెట్ల‌ను బుక్ చేసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు అధికారులు‌ భక్తులను విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
Cyberabad Gandipet land scam 2026: గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
గండిపేట భూ కుంభకోణం: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు.. రూ. 1500 కోట్ల దందా బట్టబయలు!
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget