అన్వేషించండి

Telangana Student: అమెరికాలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం - వారం రోజులుగా ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆందోళన

Telangana News: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. హన్మకొండకు చెందిన రూపేశ్ మే 2వ తేదీన అదృశ్యం కాగా.. అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఆచూకీ కనుగొనాలని వేడుకుంటున్నారు.

Telangana Student Missing In America: అమెరికాలో భారత సంతతి విద్యార్థుల మరణాలు, అదృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా, అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన తెలంగాణ విద్యార్థి అదృశ్యం (Telangana Student Missing) కావడంతో అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా అతని ఆచూకీ లేదని అక్కడి భారత రాయబార కార్యాలయం పేర్కొంది. తెలంగాణలోని హన్మకొండకు (Hanmakonda) చెందిన రూపేశ్ చంద్ర చింతకింది (Rupesh Chandra) చికాగోలో (Chicago) విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. చివరిసారిగా ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం రూపేశ్ తో తండ్రి వాట్సాప్ కాల్ లో మాట్లాడారు. ఆ తర్వాత అతని ఫోన్ స్విచ్చాఫ్ లోకి వెళ్లిపోయిందని తండ్రి తెలిపారు. అతని స్నేహితులతో మాట్లాడగా.. ఎవరినో కలవడానికి వెళ్లారని వారు ఎవరో తెలియదని రూపేశ్ స్నేహితులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను, అమెరికా ఎంబసీని కోరారు.

ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన

'భారత్ కు చెందిన విద్యార్థి రూపేశ్ చంద్ర చింతకింది మే 2వ తేదీ నుంచి కనిపించడం లేదని తెలిసి కాన్సులేట్ ఆందోళన చెందుతుంది. అతని ఆచూకీ తెలుసుకునేందుకు అక్కడి పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే రూపేశ్ జాడ తెలుస్తుందని ఆశిస్తున్నాం.' అని చికాగోలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో తెలిపింది. అటు దీనిపై పోలీసులు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. రూపేశ్ గురించి తెలిస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు.

ఈ ఏడాది ఆరంభంలోనే అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడం కలకలం రేపుతోంది. భారతీయ సంతతి విద్యార్థులు.. అక్కడ దాడులు, కిడ్నాప్ ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికాగోలో ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అలాగే, హైదరాబాద్ కు చెందిన అరాఫత్ 2023 మేలో క్వీవ్ ల్యాండ్ వర్శిటీ నుంచి ఐటీలో మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్లగా.. ఈ ఏడాది మార్చి 7 నుంచి అదృశ్యమయ్యాడు. 10 రోజుల తర్వాత అరాఫత్ ను కిడ్నాప్ చేశామని.. అతన్ని విడిపించేందుకు 1200 డాలర్లు గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేశారని.. బాధితుడి తండ్రి తెలిపారు. ఏప్రిల్ లో సత్యసాయి గద్దె అనే భారతీయ విద్యార్థి మృతి చెందిన ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా రూపేశ్ అదృశ్యం కావడం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. అటు, ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా.. తమ గడ్డపై విదేశీ విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపింది.

Also Read: CM Jagan: లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం జగన్ పిటిషన్ - అనుమతి ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్, తీర్పు వాయిదా

టాప్ హెడ్ లైన్స్

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Indian Student Kills Family In Alton: టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Embed widget