అన్వేషించండి

Hyderabad News: 'ఇలాంటి మోసాల పట్ల అలర్ట్‌గా ఉండాలి' - స్విగ్గీ డెలివరీ బాయ్ ఏం చేశాడంటే?

Crime News: డెలివరీ సర్వీస్‌ బుక్ చేసుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సదరు డెలివరీ బాయ్ ఆ వస్తువును తిరిగి ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

Swiggy Delivery Boy Fraud In Hyderabad: ఫుడ్ నుంచి ఇంట్లో వాడుకునే వస్తువుల వరకూ అన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులభంగా దొరుకుతున్నాయి. చేతిలో మొబైల్ ఉంటే చాలు వస్తువులను తమకు నచ్చిన వారికి పంపించడం సహా ఇతరుల నుంచి వస్తువులను కూడా రిసీవ్ చేసుకోవచ్చు. కొందరు పాలు, కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకూ అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తుంటారు. ఫుడ్‌తో పాటు వస్తువులను సైతం డెలివరీ చేస్తుండగా సేవలు మరింత సులభతరం అయ్యాయి. అయితే, టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆన్ లైన్ మోసాలు సైతం అలానే పెరుగుతున్నాయి. తాజాగా, డెలివరీ సర్వీసుకు సంబంధించి ఓ వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ల్యాప్ టాప్‌ను డెలివరీ సర్వీస్ ద్వారా మరో చోటుకి పంపించాలని చూస్తే.. సదరు డెలివరీ బాయ్ దాన్ని చేర్చాల్సిన చోటుకు చేర్చకుండా తిరిగి ఇవ్వాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాన్ని బాధితుని భార్య లింక్డ్‌ఇన్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే.?

బాధితులు సోషల్ మీడియాలో తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ వ్యక్తి మాదాపూర్‌లోని (Madhapur) ఓ ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కు బ్యాక్ ప్యాక్‌లో ల్యాప్ టాప్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్విగ్గీ ప్యాకేజీ డెలివరీ సర్వీస్ Swiggy Genie సర్వీస్‌ను బుక్ చేసుకున్నారు. అనంతరం డెలివరీ పార్టనర్ బ్యాగ్ తీసుకున్నాడు. అయితే, ల్యాప్ టాప్ ఎంతకీ డెలివరీ కాకపోవడంతో బుక్ చేసిన వ్యక్తికి అనుమానం వచ్చి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. స్విగ్గీ కస్టమర్ కేర్‌కు కాల్ చేయగా.. వారు కూడా సదరు డెలివరీ బాయ్‌ను గుర్తించలేకపోయారు. 

కొద్దిసేపటి తర్వాత సదరు డెలివరీ బాయ్ వాట్సాప్‌లో మెసేజ్ చేశాడు. ల్యాప్ టాప్ కావాలంటే రూ.15 వేలు ఇవ్వాలని.. డబ్బులు పంపించిన వెంటనే ర్యాపిడో ద్వారా ల్యాప్ టాప్ తిరిగి ఇస్తానని పేర్కొన్నాడు. దీంతో షాకైన వ్యక్తి దీనిపై పోలీసులను ఆశ్రయించగా వారు విచారిస్తున్నారు. ఈ విషయాన్ని బాధిత వ్యక్తి భార్య లింక్డ్ ఇన్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.

Also Read: Crime News: జీడిమెట్లలో తీవ్ర విషాదం - ఇద్దరు పిల్లలను చంపి దంపతుల ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Jr NTR Interview: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్ 
Doon Express : ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర.. రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
ఎక్స్ ప్రెస్ రైలును బోల్తా కొట్టించే కుట్ర - రైల్వే ట్రాక్ పై ఏడు మీటర్ల కరెంట్ పోల్
Prakasam Barrage: హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
హమ్మయ్య! రెండో పడవను ఒడ్డుకు చేర్చిన ఇంజినీర్లు - మూడో దానికి ముహుర్తం ఎప్పుడో!
Balineni Srinivasa Reddy : వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
వైసీపీకి భవిష్యత్ లేదు - జగన్‌కు విశ్వసనీయత లేదు - పవన్‌ను కలిసిన తర్వాత బాలినేని కీలక వ్యాఖ్యలు
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
బిగ్ బాస్‌నే బూతులు తిట్టాడే... చీఫ్‌గా అభయ్ అట్టర్ ఫ్లాప్... విచక్షణ లేకుండా ఆట ఆడిన నిఖిల్, పృథ్వీ
Embed widget