అన్వేషించండి

Aruna Shanbaug: నర్స్‌పై పాశవికంగా అత్యాచారం చేసి, కుక్క గొలుసుతో గొంతు బిగించి - కోల్‌కతాకి మించిన దారుణమిది

Aruna Shanbaug Case: కోల్‌కతా కేసుపై విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అరుణ శాన్‌బాగ్ కేసు గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ కేసుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Who is Aruna Shanbaug: కోల్‌కతా హత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్న సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఓ అత్యాచార కేసు గురించి ప్రస్తావించారు. 1973లో ముంబయిలోని కేఈఎమ్ హాస్పిటల్‌లో పని చేస్తున్న నర్స్ అరుణ శాన్‌బాగ్‌పై (Aruna Shanbaug Case) అత్యంత పాశవికంగా అత్యాచారం చేశారు. అప్పటి నుంచి దాదాపు 42 ఏళ్ల పాటు ఆమె కోమాలోనే ఉండి 2015లో మృతి చెందారు. మహిళా వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడుతూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌ ఈ కేసు ప్రస్తావన తీసుకొచ్చారు. మహిళా ఉద్యోగులనే టార్గెట్‌గా చేసుకుని ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో అత్యాచారం జరిగేంత వరకూ ఎదురు చూస్తూ ఉండలేమని, వైద్యుల భద్రతకు ప్రత్యేకంగా టాస్క్‌ ఫోర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అయితే...ఆయన ప్రస్తావించి అరుణ శాన్‌బాగ్ కేసు దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు దారి తీసింది. వైద్య రంగ చరిత్రలోనే ఇదో రక్తపు మరకగా మిగిలిపోయింది. 

హాస్పిటల్‌లో అత్యాచారం..

ముంబయిలోని KEM Hosptal లో 1967లో నర్స్‌గా చేరారు అరుణ శాన్‌బాగ్. అదే హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ సందీప్ సర్దేశాయ్‌తో అప్పటికే ఆమెకి నిశ్చితార్థమైంది. 1974లో వివాహం కావాల్సింది. కానీ ఆ కలలన్నీ ఒక్క రాత్రిలో చెదిరిపోయాయి. 1973 నవంబర్ 27వ తేదీన రాత్రి హాస్పిటల్‌లో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. కుక్కను కట్టేసే చైన్‌తో గొంతు బిగించాడు. ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ లైంగిక దాడిలో అరుణ శాన్‌బాగ్ తీవ్రంగా గాయపడ్డారు. బ్రెయిన్ డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆమె మంచానికే పరిమితమయ్యారు. కోమాలోకి వెళ్లిపోయారు. మెదడు తీవ్రంగా గాయపడడం వల్ల పక్షవాతం వచ్చింది. మాట్లాడలేకపోయారు. పూర్తిగా మరో మనిషిపైనే ఆధారపడి బతకాల్సి వచ్చింది. ఏ హాస్పిటల్‌లో అయితే ఆమె జీవితం ఇలా దుర్భరంగా మారిపోయిందే..అదే హాస్పిటల్ సిబ్బంది ఆమెని కుటుంబ సభ్యురాలిగా చూసుకుంది. హాస్పిటల్‌లో ప్రయోగాలు చేసేందుకు కొన్ని కుక్కలను తీసుకొచ్చారు. వాటికి పెట్టాల్సిన ఆహారాన్ని ఆ వార్డ్ అటెండర్ దొంగిలించడాన్ని అరుణ శాన్‌బాగ్ చూశారు. ఇది పై అధికారులకు చెబుతానని బెదిరించారు. దీంతో పగ పెంచుకున్న అటెండర్ ఇంత దారుణంగా ఆమెని అత్యాచారం చేశాడు. 

కారుణ్య మరణం కోసం పిటిషన్..

ఆమె బాధ చూడలేక 2011లో సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పింకీ విరాణి కారుణ్యమరణం అవకాశం కల్పించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌తో దేశవ్యాప్తంగా ఈ కేసు మరోసారి అలజడి సృష్టించింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్‌ని తిరస్కరించింది. ఇదే సమయంలో passive euthanasia కి అనుమతినిచ్చింది. అంటే అప్పటి వరకూ ఆమెకి అందిస్తున్న అత్యవసర వైద్యాన్ని ఆపేయచ్చు. అయితే...ఆమె బంధువులు లేదా కేర్‌టేకర్స్ నుంచి పిటిషన్‌లు వస్తే తప్ప ఇందుకు అనుమతి ఉండదని కోర్టు తేల్చి చెప్పింది. దాదాపు 42 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన అరుణ శాన్‌బాగ్ 2015 మే 18న న్యుమోనియో కారణంగా కన్ను మూశారు. ఈ కేసులో నిందితుడిపైన హత్యాయత్నం కేసు పెట్టి ఏడేళ్ల జైలుశిక్షతో సరిపెట్టారు. 1980లో నిందితుడు విడుదలయ్యాడు. 

Also Read: Kolkata: ఆ రాత్రంతా ఇద్దరు వేశ్యలతో నిందితుడు, రెడ్‌లైట్ ఏరియా నుంచి నేరుగా హాస్పిటల్‌కి - ఆపై డాక్టర్‌పై హత్యాచారం

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస
వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury: వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస
వామపక్ష యోధుడు సీతారాం ఏచూరి కన్నుమూత, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Karimnagar: కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
కరీంనగర్‌లో సైకో టీచర్, బాత్రూంలో పిల్లలు బట్టలేకుండా ఉండగా వీడియోలు!
Crime News: ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
ఏపీలో దారుణం - ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసిన కసాయి కొడుకు, మరో చోట అప్పుల బాధతో అన్నదమ్ముల ఆత్మహత్య
Gummadi Sandhya Rani: మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం - భద్రతా సిబ్బంది సహా ముగ్గురికి గాయాలు
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Embed widget