అన్వేషించండి

Siddipet News: దారుణాలు - మంత్రాల నెపంతో ఓ చోట, భిక్షాటన డబ్బుల కోసం మరో చోట హత్యలు, ఎక్కడంటే?

Telangana Crime News: మంత్రాల నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. అలాగే, భిక్షాటన డబ్బుల కోసం ఓ వృద్ధున్ని ఆటో డ్రైవర్ చంపేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.

Man Murdered Pretext of Black Magic in Siddipet: శాస్త్ర సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొన్ని చోట్ల మూఢ నమ్మకాలు వీడడం లేదు. తాజాగా, మంత్రాలు చేశాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నుంగునూరు మండలం ఘనపూర్ గ్రామంలో ఓ వ్యక్తి తన కుమార్తె అనారోగ్యానికి మరో వ్యక్తి మంత్రాలు చేయడమే కారణమని భావించి అతన్ని హతమార్చాడు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బత్తుల రజిత, తిరుపతి దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతుండగా.. ఎన్ని ఆస్పత్రులకు తిప్పినా ప్రయోజనం లేకపోయింది. దీంతో అదే గ్రామానికి చెందిన బండి వెంకటయ్య మంత్రాలు వేయడమే దీనికి కారణమని తిరుపతి భావించాడు. వెంకటయ్యను చంపితేనే తన కూతురి ఆరోగ్యం కుదుట పడుతుందని.. అతన్ని చంపేందుకు ప్లాన్ చేశాడు. ఇందు కోసం పరశురాములు, సాయిగౌడ్ తో కలిసి రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందు రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చి.. ఆ తర్వాత మరో రూ.లక్ష వారికి చెల్లించాడు. వెంకటయ్యను చంపిన తర్వాత మిగతా మొత్తం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ప్లాన్ ప్రకారం

ఈ మేరకు ప్లాన్ ప్రకారం ఈ నెల 3న పరశురాములు, సాయిగౌడ్ తో పాటు సాయి, రంజిత్, అరవింద్.. బైక్ పై వెళ్తున్న వెంకటయ్యను మరో బైక్ పై వెంబడించారు. అనంతరం అతన్ని బైక్ తో ఢీకొట్టారు. కింద పడ్డ వెంకటయ్యను వారితో తెచ్చుకున్న తువ్వాలు, తాడు సాయంతో గొంతు బిగించి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని, బైక్ ను సమీపంలోని జేసీబీ గుంటలో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. అయితే, వెంకటయ్య కుటుంబ సభ్యులు అతని కోసం గాలించి గుంటలో అతన్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించగా.. అంత్యక్రియల సమయంలో మృతదేహంపై గాయాలు గుర్తించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. దీంతో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు.

వృద్ధుడి దారుణ హత్య

ఓ వృద్ధుడి భిక్షాటన డబ్బుల కోసం అతన్ని ఓ ఆటో డ్రైవర్ దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన వెంకటయ్య (69) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే భిక్షాటన చేసి గ్రామానికి తిరిగి వచ్చేందుకు శుక్రవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన రాఘవేందర్ ఆటో ఎక్కాడు. వృద్ధుడి దగ్గర డబ్బులు గుర్తించిన ఆటో డ్రైవర్ వాటిని కాజేసేందుకు ప్లాన్ చేశాడు. మార్గమధ్యలో ఆటోను దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. తన డబ్బు మూటను లాక్కునేందుకు యత్నించగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వెంకటయ్యపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇద్దరూ సమీపంలోని బావిలో పడిపోయారు. బావిలోనే రాఘవేందర్.. వెంకటయ్యను చంపి బయటకు వచ్చేందుకు యత్నించాడు. బావిలో నుంచి పైకి వస్తున్న రాఘవేందర్ ను గుర్తించిన స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంకటయ్య మృతదేహాన్ని బావిలోంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గ్రామస్థుల చేతిలో గాయపడ్డ నిందితుడు రాఘవేందర్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: 'ధరణి' కొందరికే ఆభరణం, చాలా మందికి భారం' - అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget