అన్వేషించండి

Kolkata Murder Case: బీజేపీ వాళ్లే హాస్పిటల్‌ని ధ్వంసం చేశారు, మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Kolkata: కోల్‌కత్తాలో హాస్పిటల్‌పై జరిగిన దాడిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఇది కచ్చితంగా బీజేపీ కార్యకర్తల పనేనని ఆరోపించారు. హత్యాచారం చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

Kolkata Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్‌ హాస్పిటల్‌పై నిరసనకారులు దాడి చేశారు. అద్దాలు, తలుపులతో పాటు అక్కడి పరికరాలనూ ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లలో 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే..ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే హాస్పిటల్‌ని సందర్శించిన గవర్నర్‌...ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్‌ని కలిశారు. ఆ తరవాత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడి వెనక బీజేపీ ఉందని మండి పడ్డారు. అంతే కాదు. వామపక్షాలపైనా ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీల వాళ్లే హాస్పిటల్‌ని ఇలా ధ్వంసం చేశారని అన్నారు. వీళ్లంతా విద్యార్థులే కాదని, బయటి వ్యక్తులు వచ్చి ఇదంతా చేశారని అన్నారు. 

"హాస్పిటల్‌పై దాడి చేసింది ట్రైనీ డాక్టర్లు కాదు. వాళ్లెవరో బయటి వ్యక్తులు. వామపక్షాలు, బీజేపీ పార్టీకి చెందిన వాళ్లు. విద్యార్థులకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఆ పార్టీల జెండాలు కూడా కనిపించాయి. పోలీసులు ఎవరిపైనా ఎలాంటి ఎదురు దాడులు చేయలేదు. మేమూ చాలా సార్లు ఆందోళనలు చేశాం. కానీ ఇలా హాస్పిటల్‌లోకి వెళ్లి ఇంత దారుణంగా విధ్వంసం సృష్టించలేదు. ఏదేమైనా ఈ హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. త్వరలోనే నేను ఈ ఘటనను నిరసిస్తూ ర్యాలీ చేపడతాను. నిందితులను ఉరి తీయాల్సిందే"

- మమతా బెనర్జీ, బెంగాల్ ముఖ్యమంత్రి

ఆగస్టు 14న రాత్రి వేలాది మంది మహిళలు బెంగాల్‌లో రోడ్లపైకి వచ్చి ట్రైనీ డాక్టర్‌ హత్యాచారంపై నిరసన వ్యక్తం చేశారు. Reclaim the Night పేరుతో ర్యాలీ చేపట్టారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ వరకూ శాంతియుతంగానే నిరసన కొనసాగినా హాస్పిటల్‌లోకి వెళ్లాక ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహంతో నిరసనకారులు హాస్పిటల్‌పై దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేశారు. హాస్పిటల్ బయట ఉన్న పోలీస్ వాహనాలపైనా దాడి చేశారు. దాదాపు 40-50 మంది ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ దాడిలో దాదాపు 15 మంది పోలీసులకు గాయాలయ్యాయి. నిరసనకారుల ఫొటోలు విడుదల చేసిన కొద్ది గంటల్లోనే వాళ్లను అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ టీమ్‌ హాస్పిటల్‌కి చేరుకుంది. అక్కడ శాంపిల్స్ సేకరించింది. అయితే..నిరసనకారులు మాత్రం ఎంత మందిని అరెస్ట్ చేసినా ఆందోళనలు ఆగవని తేల్చి చెబుతున్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని అంటున్నారు. 

Also Read: Kolkata Doctor Murder: ట్రైనీ డాక్టర్‌ డైరీలో చివరి పేజీ, ఈ దారుణానికి కొద్ది గంటల ముందు ఏం రాసుకుందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget