అన్వేషించండి

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కారు బోల్తాపడింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉడండం అందర్నీ కంటతడి పెట్టించింది.

Road Accident: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందో చెప్పలేం. కనుక ఎల్లప్పుడూ ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. కానీ కొన్నిసార్లు కళ్లు మూసి తెరిచే లోపే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

టైరు పేలి కారు బోల్తా.. 
హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తోంది ఓ కారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బైపాస్ కొత్త పల్లి వద్దకు రాగానే.. కారు టైరు ఒక్కసారిగా పేలింది. అనుకోని ఘటనతో కారు అదుపు తప్పింది. కారు వేగంగా వెళ్తుండటం, అదే సమయంలో టైరు పేలడంతో కారు బోల్తా పడి, రెండు మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉండే రెయిలింగ్ కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ దుర్ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరిని కలిచి వేస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు పిల్లలు కాగా మరో ముగ్గురు పెద్ద వాళ్లు. టైరు పేలడంతో కారు పల్టీలు కొట్టి రెయిలింగ్ కు బలంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి. 

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. 
కారు ప్రమాదం ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారు, క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టోలిచౌకికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముప్కాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగి ఉన్న బస్సును ఓ స్కూటీ..

పల్నాడు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ నిండు ప్రాణం పోయింది. చిలకలూరిపేట నియోజవర్గంలోని యడ్లపాడు వద్ద ఆగి ఉన్న బస్సును ఓ స్కూటీ ఢీ కొట్టింది. నక్క వాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వసంత నూనె మిల్లుకు చెందిన బస్సు.. కార్మికులను తీసుకువచ్చేందుకు యడ్లపాడు వైపు వెళ్తుంది. నక్క వాగు సమీపంలోకి రాగానే డ్రైవర్ బస్సును ఆపాడు. సుబాబుల తోట వద్ద హైవేపై బస్సు నిలుపుదల చేసి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో అదే మార్గంలో గుంటూరుకు చెందిన తల్లి కూతుళ్లు.. నాగలక్ష్మి, సాయి లక్ష్మి స్కూటీపై వెళ్తున్నారు. చిలకలూరిపేట వైపు నుంచి యడ్లపాడు వైపు వెళ్తున్నారు. రోడ్డుపై ఆగి ఉన్న బస్సును వెనక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!

టాప్ హెడ్ లైన్స్

Adilabad Job Fraud Case: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట టోకరా - ఆదిలాబాద్ జాబ్ ఫ్రాడ్ కేసులో గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ అరెస్ట్!
Hyderabad Jewellery Shop Fined 10 Lakh: లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
లక్కీ లాకెట్ అని కొంటే దురదృష్టం వెన్నాడింది - మోసానికి పది లక్షల జరిమానా -ఇలాంటివి అసలు నమ్మవద్దు!
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget