By: ABP Desam | Updated at : 08 Aug 2022 09:34 PM (IST)
బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పని చేస్తారు!
Bullet Bikes Thieves: బైకులంటే ఇష్టపడని యువకులు ఉండరు. ప్రతీ ఒక్క యువకుడికీ కొత్త, స్టైలిష్ బైకుపై రయ్ రయ్ మంటూ తిరగాలని ఉంటుంది. వెనకాల గర్ల్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టుకొని రౌండ్ల మీద రౌండ్లు వేయాలనుకుంటారు. అందుకోసం ఎంతైనా కష్టపడతారు. ప్రతీ అబ్బాయికి తన మొదటి ద్విచక్ర వాహనం అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇక బండిలేని వారైతే మరీ స్నేహితుల వాహనాలు చూస్తూ బాధపడుతుంటారు. ఒక్క రైడ్ కోసం బండి ఇచ్చినా చాలని కోరుకుంటారు. బతిమాలి అయినా సరే బండిపై రౌండ్లు వేస్తుంటారు. అయితే ఓ ఇద్దరు అబ్బాయిలు ఈ మధ్య తరచుగా కొత్త కొత్త బండ్లపై తిరుగుతున్నారు. ముందు పోలీసులు పట్టించుకోలేదు. కానీ రోజుకో కొత్త బైకు.. అందులోనూ అవన్నీ రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలే కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వీరి సంగతి తెలుసుకుందామని వారిపై కొన్ని రోజులుగా నిఘా పెట్టారు. ఇంకేం ఉంది వారి బాగోతం తెలిసి షాకయ్యారు. వెంటనే వారిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
బైకులంటే వారికి ప్రాణం..
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన నవీన్ బాబు, అదే ప్రాంతంలోని పాతూరికి చెందిన చల్లా భవానీ శంకర్ స్నేహితులు. అందరి యువకుల్లాగే వీరికి కూడా ద్విచక్ర వాహనాలంటే చాలా ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ కు చెందిన బుల్లెట్ బైక్ లు అంటే వారికి మరింత ఇష్టం. ఆ ఇష్టమే వారిని జైలుకు వెళ్లేలా చేసింది. ఎలా అనుకుంటున్నారా.. వారు చేసిన దోపిడీ పర్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీరిద్దరూ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. సినిమా మధ్యలో లేచి బయటకు వచ్చేస్తారు. అలా అని సినిమాలు నచ్చకో లేక బయట పని ఉండో వచ్చారు అనుకునేరు. అలా కాదులెండి.. పథకం ప్రకారమే బయటకు వచ్చే వాళ్లు.
రాష్ట్రంలో దాటించి అమ్మకాలు..
పట్టణం అంతా తిరుగుతూ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్లను మాత్రమే హ్యాండిల్ లాక్ లను విరగ్గొట్టి దొంగతనం చేసే వారు. ఆ బైకులను మాచర్ల తీసుకు వెళ్లి.. అక్కడి నుండి వాహనాలను రాష్ట్రం దాటించి మరీ అమ్ముకునేవారు. ఎక్కువగా తెలంగాణకు వచ్చి విక్రయించారు ఆ ఇద్దరు దొంగ స్నేహితులు. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే చిలకలూరి పేట పట్టణంలోని సుబ్బయ్య తోటకు చెందిన కనమర్ల పూడి పవన్ అనే వ్యక్తి బైక్ పోయింది. గత నెల 29వ తేదీన ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దొంగతనం రాత్రి 10 గంటల సమయంలో జరిగినట్లు బాధితుడు పవన్ తెలిపారు. తన రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నంబరు AP 39 HU 9600 అని తెలిపాడు. తన ఇంట్లోనే మరో పోర్షన్ లో ఉంటున్న మరో వ్యక్తికి చెందిన బైకును కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. అతని బైక్ కూడా రాయల్ ఎన్ ఫీల్డ్ బైకే. అతని పేరు కొమ్మనబోయిన నాగ అనిల్. అనిల్ బుల్లెట్ బైక్ నంబరు AP 39 JX 2468. దీంతో నాగ అనిల్, పవన్ ఇద్దరూ వెళ్లి తమ బైక్ లను దొంగలు ఎత్తుకు పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రూ.11 లక్షల విలువైన బైకులు స్వాధీనం..
దొంగ స్నేహితులు మాచర్ల నవీన్ బాబు, చల్లా భవాని శంకర్ లను పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న దొంగలించిన బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 11 లక్షలు ఉంటుందని పోలీసులు అధికారులు తెలిపారు.
Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ కానీ హంగ్కూ చాన్స్ !
ABP Cvoter Exit Poll: ఏయే రాష్ట్రంలో ఎవరిది పైచేయి? ABP CVoter ఎగ్జిట్ పోల్ కచ్చితమైన అంచనాలు
Telangana Assembly Election 2023: సాయంత్రం 5 గంటలకు తెలంగాణ వ్యాప్తంగా 63.94 శాతం పోలింగ్, ముగిసిన పోలింగ్ సమయం
Madhya Pradesh Exit Poll 2023 Highlights: మధ్యప్రదేశ్ ఈసారి కాంగ్రెస్దే! ABP CVoter ఎగ్జిట్ పోల్ అంచనాలు ఇవే
/body>