అన్వేషించండి

Realtor Murder Case: కన్న కొడుకే కాలయముడు - రూ.25 లక్షల సుపారీ ఇచ్చి తండ్రి హత్య, రియల్టర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు

Crime News: రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న కొడుకే అసలు నిందితుడని.. ముగ్గురికి రూ.25 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

Realter Kammari Krishna Murder Case: రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాద్ నగర్ సమీపంలోని కమ్మదానమ్ వద్ద కేకే ఫామ్ హౌస్‌లో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ (Kammari Krishna) హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 10న జరిగిన హత్య సంచలనం సృష్టించగా.. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి కేసును ఛేదించారు. కమ్మరి కృష్ణ మొదటి భార్య కుమారుడు కమ్మరి శివే అసలు నిందితుడని.. రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించాడని నిర్థారించారు. ఆస్తి మొత్తం మూడో భార్యకు రాసిస్తున్నాడనే అక్కసుతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

కక్షతోనే హత్య..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ (కేకే) వ్యాపారంలో రూ.వందల కోట్లు సంపాదించారు. అయితే, ఆయన మొదటి భార్య, ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకోగా ఆమె మృతి చెందింది. ఈ క్రమంలోనే పావని అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 నెలల కుమార్తె ఉంది. ఆమె పేరిట దాదాపు రూ.16 కోట్ల విలువైన ఆస్తిని కేకే రిజిస్టేషన్ చేశారు. దీంతో మొదటి భార్య కుమారుడు ఆయనపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఆస్తి మొత్తం మూడో భార్యకే రాసిస్తాడనే ఉద్దేశంతో ఎలాగైనా కృష్ణను చంపాలని మొదటి భార్య కుమారుడు పథకం వేశాడు. కృష్ణ వద్ద పని చేసే బాబా శివానంద్ అలియాస్ బాబాకు రూ.25 లక్షలతో పాటు ఓ ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన బాబా శివానంద్ రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. బాబా, జీలకర్ర గణేష్ అలియాస్ లడ్డు, మరో మైనర్ తో కలిసి కృష్ణను హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు.

గొంతు కోసి చంపేశారు

ఈ నెల 10న సాయంత్రం 5:30 గంటలకు కమ్మదానంలోని కేకే ఫామ్ హౌస్‌కు చేరుకుని కృష్ణను హతమార్చారు. గణేష్, మైనర్ ఇద్దరూ కలిసి కృష్ణ చేతులు వెనక్కి పట్టుకోగా.. బాబా కత్తితో కృష్ణ గొంతు కోసి, అనంతరం పొట్టలో పొడిచి పరారయ్యాడు. పారిపోతూ ఫాం హౌస్‌లో పని చేస్తున్న వాళ్లను డమ్మీ పిస్టల్‌తో బెదిరించారు. అతని అరుపులు విని పై అంతస్తులో ఉన్న భార్య ఆందోళనతో కిందకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్న కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యపై మూడో భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఆధారాలు సేకరించి కన్న కుమారుడే అసలు నిందితుడని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, కమ్మరి కృష్ణ మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు.

Also Read: Hyderabad News: నగరంలో తీవ్ర విషాదం - అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tiger News: రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
రెండు రాష్ట్రాలను వణికిస్తున్న పులులు - అటువైపు వెళ్లాలంటే భయపడుతున్న రైతులు, ప్రజలు
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Tirumala News: తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు ఆరోపణలు అత్యంత దుర్మార్గం - టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన
Embed widget