అన్వేషించండి

Palnadu Crime : నడిరోడ్డుపై హత్యతో వినుకొండలో 144 సెక్షన్- వ్యక్తిగత కక్షగా పోలీసుల నిర్దారణ

Vinukonda Murder: వినుకొండలో యువకుడి హత్య రాజకీయరంగు పులుముకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైసీపీ ఆరోపించగా, వ్యక్తిగత కక్షలే కారణమని టీడీపీ విమర్శించింది

Andhra Pradesh Crime: వినుకొండ(Vinukonda) హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. రషీద్‌ అనే వ్యక్తిని జిలానీ నడిరోడ్డుపై కత్తితో నరికి చంపారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని పోలీసుశాఖ పట్టణంలో 144 సెక్షన్ విధించింది. దీనికి మీరు కారణమంటే మీరే కారణమంటూ టీడీపీ(TDP), వైసీపీ(YCP) మధ్య మాటల యుద్ధం మొదలైంది.

నడిరోడ్డుపై హత్య
వినుకొండలో ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రషీద్‌(Rashidh) అనే యువకుడిని జిలానీ(Jilani) కొబ్బరి బోండాలు నరికే కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య కలకలం రేపింది. పాతకక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అయినప్పటికీ...మొహర్రం రోజు హత్య జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తక్షణం పట్టణంలో 144 సెక్షన్ విధించారు. 

మాటల యుద్ధం
రషీద్ హత్య ఘటన నేపథ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హత్యకు గురైన రషీద్‌ వైసీపీ(YCP) యువజన విభాగం నాయకుడిగా  ఆ పార్టీ ప్రకటించింది. జిలానీ తెలుగుదేశం(TDP) సానుభూతిపరుడిగా పేర్కొంటూ విమర్శల దాడికి దిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హత్యా రాజకీయాలకు తెరలేపారంటూ విమర్శించింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో నరికి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యం వైసీపీ వర్గీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు(Law and order) క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేతల అండ చూసుకునే జిలానీ ఈ హత్యకు పాల్పడ్డాడని వారు విమర్శించారు. వైసీపీ ఆరోపణలు తెలుగుదేశం నేతలు తిప్పికొట్టారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యలకు రాజకీయరంగు పులమొద్దని హితవు పలికారు.

గతంలో జిలానీపై రషీద్‌ దాడి చేసి తీవ్రంగా కొట్టాడని...అందుకే ఇప్పుడు ఈ హత్య జరిగిందని వివరించారు. దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న టీడీపీ నేతలు...ఈ వివాదం మరింత పెరగకుండా పోలీసులు(Police) 144 సెక్షన్ అమలు చేసి కట్టడి చేశారని గుర్తుచేశారు. నిందితుడిని వెంటనే అరెస్ట్‌ చేశారని తెలిపారు. వైసీపీ నేతలు ప్రజలలను రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని..శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. ఈ హత్యను వ్యక్తిగత కారణాలతోనే చూడాలి తప్ప..రాజకీయ, సామాజికవర్గ అంశాలకు ముడిపెట్టవద్దన్నారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వరుస హత్యలు, బెదిరింపులపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని వైసీపీ నేతలు చెప్పారు. రషీద్ హత్య ఘటన వీడియోలను  ఆపార్టీ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. 

పోలీసుల వివరణ

పాతకక్షలతోనే వినుకొండలో యువకుడి హత్య జరిగింది తప్ప..ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పోలీసులు తెలిపారు. గతంలో జిలానీపై రషీద్‌ చేయడం వల్లే తిరిగి ఇప్పుడు దాడి చేశాడన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు గానీ, హింసను ప్రేరేపించడంగానీ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.

Also Read: ఒక కాకిని కట్టేస్తే వందల కాకుల ధర్నా- నడిరోడ్డుపై వ్యక్తిని నరుకుతుంటే వీడియో తీసిన జనం- ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి?

Also Read: వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget