అన్వేషించండి

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని ముగ్గురు మృతి!

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ట్రాక్ పై సిబ్బంది పనిచేస్తుండగా ట్రైన్ దూసుకొచ్చింది.

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తపల్లి శివారులో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు దూసుకురావడంతో  రైల్వే సిబ్బంది ఒకరు, దినసరి కూలీలు ఇద్దరు మృతి చెందారు. రైల్వే ట్రాక్ కు గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ పై నుంచి గూడ్స్ రైలు వెళుతుండగా ఆ శబ్దంతో పనిచేస్తున్న ట్రాక్ పై రాజధాని ఎక్స్ ప్రెస్ ను గమనించలేదు సిబ్బంది. దీంతో ఎక్స్ ప్రెస్ రైలు పనిచేస్తున్న సిబ్బందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది దుర్గయ్య, దినసరి కూలీలు పెద్దకల్వల, సుల్తానాబాద్ లకు చెందిన శ్రీనివాస్, వేణులుగా అనుమానిస్తున్నారు. 

రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొని 

పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి మండలం చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు శరీరాలు చెల్లాచెదురయ్యాయి.  

బావిలో దూసుకెళ్లిన కారు 

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరిలు కొండపాక స్టేజీ వద్దకు వచ్చిన తమ బంధువులను కారులో ఇంటికి తీసుకురావడానికి బయలుదేరారు. అతివేగంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు బావిలో పడి  కారులో ఇరుక్కుపోయిన వారిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరికీ గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి (42) మృతిచెందాడని  పోలీసులు తెలిపారు.  కారు బావిలో పడిన సమయంలో అందులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని ఇద్దర్ని స్థానికులు కాపాడారని, మరో వ్యక్తి చనిపోయాడని వెల్లడించారు. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు భారీ క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు. పాడుబడిన బావికావడం, చుట్టూ చెట్లపొదలు ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. 

Also Read : Shocking: బైక్‌పై లిఫ్ట్ అడిగాడు, ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు - తరువాత ఏం జరిగిందంటే

Also Read: Kurnool Nude Call: వీడియో కాల్‌లో బట్టలిప్పేసిన యువతి, తర్వాత చుక్కలు! ఆ వెంటనే సీబీఐ అని ట్విస్ట్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Rahul Gandhi in Germany: జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
జర్మనీలోని BMW ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్ గాంధీ; భారతదేశంలో ఉత్పత్తి పెంచాలని సూచన !
Embed widget