అన్వేషించండి

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని ముగ్గురు మృతి!

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ట్రాక్ పై సిబ్బంది పనిచేస్తుండగా ట్రైన్ దూసుకొచ్చింది.

Train Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కొత్తపల్లి శివారులో రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు దూసుకురావడంతో  రైల్వే సిబ్బంది ఒకరు, దినసరి కూలీలు ఇద్దరు మృతి చెందారు. రైల్వే ట్రాక్ కు గ్రీసింగ్ చేస్తున్న సమయంలో పక్క ట్రాక్ పై నుంచి గూడ్స్ రైలు వెళుతుండగా ఆ శబ్దంతో పనిచేస్తున్న ట్రాక్ పై రాజధాని ఎక్స్ ప్రెస్ ను గమనించలేదు సిబ్బంది. దీంతో ఎక్స్ ప్రెస్ రైలు పనిచేస్తున్న సిబ్బందిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రైల్వే సిబ్బంది దుర్గయ్య, దినసరి కూలీలు పెద్దకల్వల, సుల్తానాబాద్ లకు చెందిన శ్రీనివాస్, వేణులుగా అనుమానిస్తున్నారు. 

రాజధాని ఎక్స్ ప్రెస్ ఢీకొని 

పెద్దపల్లి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి మండలం చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. దిల్లీ నుంచి బెంగళూరు వెళ్తోన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పెద్దపల్లి జిల్లా స్టేషన్ కొత్తపల్లి శివారులో ట్రాక్ మరమ్మతులు చేస్తున్న సమయంలో రైలు ఢీకొని రైల్వే సిబ్బంది ఒకరు, ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ముగ్గురు శరీరాలు చెల్లాచెదురయ్యాయి.  

బావిలో దూసుకెళ్లిన కారు 

తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సిరిసినగండ్ల, కొండపాక మధ్య జప్తి నాచారం శివారులో ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సిరిసినగండ్లకు చెందిన వెంకటస్వామి, ఆయన ఇద్దరు బావలు కనకయ్య, యాదగిరిలు కొండపాక స్టేజీ వద్దకు వచ్చిన తమ బంధువులను కారులో ఇంటికి తీసుకురావడానికి బయలుదేరారు. అతివేగంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రహదారి పక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి కారు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇది గమనించిన స్థానికులు బావిలో పడి  కారులో ఇరుక్కుపోయిన వారిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీశారు. వారిద్దరికీ గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కారులో చిక్కుకున్న సూరంపల్లికి చెందిన యాదగిరి (42) మృతిచెందాడని  పోలీసులు తెలిపారు.  కారు బావిలో పడిన సమయంలో అందులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిని ఇద్దర్ని స్థానికులు కాపాడారని, మరో వ్యక్తి చనిపోయాడని వెల్లడించారు. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు భారీ క్రేన్ తో సహాయక చర్యలు చేపట్టారు. పాడుబడిన బావికావడం, చుట్టూ చెట్లపొదలు ఉండడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగినట్లు తెలుస్తోంది. కారును, మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించారు. 

Also Read : Shocking: బైక్‌పై లిఫ్ట్ అడిగాడు, ఇంజక్షన్ ఇచ్చి హత్య చేశాడు - తరువాత ఏం జరిగిందంటే

Also Read: Kurnool Nude Call: వీడియో కాల్‌లో బట్టలిప్పేసిన యువతి, తర్వాత చుక్కలు! ఆ వెంటనే సీబీఐ అని ట్విస్ట్

 

టాప్ హెడ్ లైన్స్

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Indian Student Kills Family In Alton: టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
టెక్సాస్‌లో తల్లి,తండ్రితో పాటు అమ్మమ్మలనూ కాల్చేసిన భారత విద్యార్థి - సరదాకే ఇలా చేశాడా?
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
నేను హోం మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం: కాకినాడలో పవన్ కళ్యాణ్ టాప్ 10 పాయింట్స్
Annadata Sukhibhava Status Check Online: ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ రైతుల ఖాతాల్లో 7000 జమ.. అన్నదాత సుఖీభవ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
Embed widget