అన్వేషించండి

Palnadu News: పదహారేళ్ల కుమారుడితో కలిసి వ్యక్తిని చంపిన తండ్రి - 16 ముక్కలు చేసి ఆపై కాల్చేసి!

Palnadu Crime News: పాత పగల మనసులో పెట్టుకొని పదహారేళ్ల కుమారుడితో వెళ్లిన ఓ తండ్రి.. ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని 16 ముక్కలు చేసి కాల్చేశారు. ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయారు. 

Palnadu Crime News: పాత పగలు మనసులో పెట్టుకున్న ఓ తండ్రి, తన పదహారేళ్ల కుమారుడి సాయంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ముందుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆపై మృతదేహాన్ని సంచిలో తీసుకొని తమ పంట పొంల వద్దకు వెళ్లారు. అక్కడే మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికారు. ఆపై కట్టెలన్నీ ఓ చోట చేర్చి... ఆ ముక్కలను అందులో వేసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. హత్య చేసినప్పుడు వాళ్లు వేసుకున్న బట్టలను విడిచి ఇవ్వగా భార్యగా కాల్చి వేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోపే అక్కడకు పోలీసులు వచ్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

పల్నాడు జిల్లా గురజాయ నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 45 ఏళ్ల కోటేశ్వర రావు, బొంబోతుల సైదులు నగర పంచాయతీలో పొరుగు సేవల కింద ప్లంబర్లుగా పిన చేస్తున్నారు. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారను ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ వద్దకు కోటేశ్వర రావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాచిన సైదులు, అతడి 16 ఏళ్ల కుమారుడు కలిసి ఇనుప రాడ్లతో కోటేశ్వర రావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.  అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసుకొని తమ పంట పొలం వద్దకు తీసుకు వెళ్లారు. మిర్చి పంటలో మృతదేహాన్ని ఉంచి గొడ్డలితో పైశాచికంగా నరికారు. మృతదేహాన్ని 16 ముక్కలు చేసి.. వాటిపై కర్రలు పేర్చారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక ఇంటికి వెళ్లిపోయారు. 

అయితే రాత్రి పది దాటినా కోటేశ్వర రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆరా తీశారు. తలోదారి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అదే క్రమంలో ఎదురైన తండ్రీకుమారులను అడగ్గా.. తమకు తెలియదంటూ ఆతృతగా వారు వెళ్లిపోయారు. బంధువులు అనుమానంతో ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. పొలాల్లో మంటలను చూసి అక్కడకు వెళ్లి క్షణ్ణంగా పరిశీలించారు. అయితే కాలిపోతున్న ఓ కాలు పాదాన్ని గుర్తించి.. వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసి ఆపై వెంటనే నిందితుల ఇంటికి బయలుదేరారు. నిందితులు ఇద్దరూ వస్త్రాలు మార్చుకని బయటకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. కోటేశ్వరరావు ఏమయ్యారని నిలదీయగా.. సమాధానం దాట వేశారు. హత్య చేసి ఇంటికి వచ్చిన తండ్రీకుమారుల వస్త్రాలను సైదులు భార్య కోటమ్మ కాలుస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గురజాల ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను రప్పించి ఘటనా స్థలంలోనే పంచనామా చేయించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం బాధిత కుటుంబీకులు, బంధువులు ధర్నాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారమే కోటేశ్వర రావును హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సైదులుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాత కక్షలు కారణం అని వారు భావిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ పరిశీలిస్తు్ననారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Nandu World Couple Reaction : డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
డబ్బులు తీసుకుని ఫేక్ ప్రచారం... ఎవరూ నమ్మొద్దు - యూకే వీసా స్కాంపై నందు వరల్డ్ జంట రియాక్షన్
Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
Lalit Modi :
"సోనియాగాంధీ సహా అప్పటి ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేశారు" బాంబులు పేలుస్తున్న లలిత్ మోడీ!
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Opposition Crisis Deep Dive Analysis: ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
ప్రాంతీయ పక్షాల కోటలకు బీటలు! ప్రశ్నార్థకంగా పార్టీల మనుగడ! అధికారంలో లేకపోతే అంతే సంగతులా?
Chiranjeevi On Peddi: చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
చరణ్ తండ్రిగానే కాదు, నటుడిగానూ గర్విస్తున్నా - పెద్ది విజయంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
Kerala Menstrual Leave for Schoolgirls:కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
కేరళ విద్యార్థులకు మెన్‌స్ట్రువల్ హాలిడేస్ ! దేశవ్యాప్తంగా చర్చినీయాంశమైన మోడల్‌!
AP DSC 2025 Irregularities: మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
మెగా డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆరోపణలు! కమిటీ వేసిన వైఎస్‌ జగన్! సీబీఐ విచారణకు డిమాండ్!
Peddi Vs Pushpa: పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
పెద్ది వర్సెస్ పుష్ప... ఒక్క పాయింట్‌ మీద సినిమాలు తీసిన సుక్కు & బుచ్చి
Embed widget