అన్వేషించండి

Palnadu News: పదహారేళ్ల కుమారుడితో కలిసి వ్యక్తిని చంపిన తండ్రి - 16 ముక్కలు చేసి ఆపై కాల్చేసి!

Palnadu Crime News: పాత పగల మనసులో పెట్టుకొని పదహారేళ్ల కుమారుడితో వెళ్లిన ఓ తండ్రి.. ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని 16 ముక్కలు చేసి కాల్చేశారు. ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయారు. 

Palnadu Crime News: పాత పగలు మనసులో పెట్టుకున్న ఓ తండ్రి, తన పదహారేళ్ల కుమారుడి సాయంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ముందుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆపై మృతదేహాన్ని సంచిలో తీసుకొని తమ పంట పొంల వద్దకు వెళ్లారు. అక్కడే మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికారు. ఆపై కట్టెలన్నీ ఓ చోట చేర్చి... ఆ ముక్కలను అందులో వేసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. హత్య చేసినప్పుడు వాళ్లు వేసుకున్న బట్టలను విడిచి ఇవ్వగా భార్యగా కాల్చి వేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోపే అక్కడకు పోలీసులు వచ్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

పల్నాడు జిల్లా గురజాయ నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 45 ఏళ్ల కోటేశ్వర రావు, బొంబోతుల సైదులు నగర పంచాయతీలో పొరుగు సేవల కింద ప్లంబర్లుగా పిన చేస్తున్నారు. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారను ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ వద్దకు కోటేశ్వర రావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాచిన సైదులు, అతడి 16 ఏళ్ల కుమారుడు కలిసి ఇనుప రాడ్లతో కోటేశ్వర రావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.  అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసుకొని తమ పంట పొలం వద్దకు తీసుకు వెళ్లారు. మిర్చి పంటలో మృతదేహాన్ని ఉంచి గొడ్డలితో పైశాచికంగా నరికారు. మృతదేహాన్ని 16 ముక్కలు చేసి.. వాటిపై కర్రలు పేర్చారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక ఇంటికి వెళ్లిపోయారు. 

అయితే రాత్రి పది దాటినా కోటేశ్వర రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆరా తీశారు. తలోదారి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అదే క్రమంలో ఎదురైన తండ్రీకుమారులను అడగ్గా.. తమకు తెలియదంటూ ఆతృతగా వారు వెళ్లిపోయారు. బంధువులు అనుమానంతో ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. పొలాల్లో మంటలను చూసి అక్కడకు వెళ్లి క్షణ్ణంగా పరిశీలించారు. అయితే కాలిపోతున్న ఓ కాలు పాదాన్ని గుర్తించి.. వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసి ఆపై వెంటనే నిందితుల ఇంటికి బయలుదేరారు. నిందితులు ఇద్దరూ వస్త్రాలు మార్చుకని బయటకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. కోటేశ్వరరావు ఏమయ్యారని నిలదీయగా.. సమాధానం దాట వేశారు. హత్య చేసి ఇంటికి వచ్చిన తండ్రీకుమారుల వస్త్రాలను సైదులు భార్య కోటమ్మ కాలుస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గురజాల ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను రప్పించి ఘటనా స్థలంలోనే పంచనామా చేయించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం బాధిత కుటుంబీకులు, బంధువులు ధర్నాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారమే కోటేశ్వర రావును హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సైదులుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాత కక్షలు కారణం అని వారు భావిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ పరిశీలిస్తు్ననారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ చెప్పారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget