అన్వేషించండి

Nizamabad News : మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ బాయ్ ఆత్మహత్య, చివరిగా ఓ మహిళకు మెసేజ్!

Nizamabad News : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Nizamabad News : తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆఫీస్ బాయ్ దేవేందర్‌ (19) ఆదివారం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ లోని ఓ గదిలో యువకుడు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆర్మూర్‌ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు ఆమెకు మెసేజ్ పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వారం రోజులుగా రిప్ స్టేటస్ 

మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆఫీస్ బాయ్ దేవేందర్ ఆత్మహత్యపై ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. యువకుడు వ్యక్తిగత కారణాల వల్లే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.  దేవేందర్ సెల్ ఫోన్ పరిశీలిస్తే గత కొద్ది కాలంగా అతడు ఓ మహిళ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోందన్నారు. ఆ మహిళతో శనివారం రాత్రి 12 గంటల వరకూ వాట్సాప్ ఛాటింగ్ చేశాడన్నారు.  వారం రోజులుగా దేవేందర్ వాట్సాప్ స్టేటస్ రిప్ అని పెట్టుకున్నాడని, శనివారం రాత్రి నేను వెళ్తున్నా ప్రశాంతంగా ఉండూ అని ఆమెతో ఛాట్ చేయడంతో  ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.  మృతుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో పని చేస్తున్నాడని తెలిపారు. మరిన్ని వివరాలు విచారణలో తెలుస్తాయని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు  వెల్లడించారు. 

పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం! 

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. అమలాపురం డివిజన్ రాజోలు మండలం రాజోలు సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశవదాసు పాలేనికి చెందిన యర్రంశెట్టి విజయ లక్ష్మి(36).. పీఎశ్ ఆవరణలోనే పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 15 నిమిషాల పాటు మంటలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఇసుక, దుప్పట్లు వంటి వాటిని ఆమెపైకి విసిరారు.  స్థానికంగా ఉన్న హెల్త్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం చేసింది. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి చెక్కపై ఉంచి భుజాలపై మోసుకుని తీసుకెళ్లారు. ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అయితే ఆమె కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

యూట్యూబ్ ఛానల్ కు పనిచేస్తూ 

విజయలక్ష్మి ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. అప్పు ఇచ్చినవారు మలికిపురం మండలంలో తన అమ్మ ఇంటి వద్ద ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో మంతనాలు జరిగాయి. ఆమె శుక్రవారం రాజోలు సీఐకు ఫిర్యాదు చేయడానికి ఆమె ద్విచక్ర వాహనంపై వచ్చింది. ముందుగానే లీటర్ పెట్రోలు బాటిల్ వెంట తెచ్చుకున్న ఆమె స్థానికంగా కానిస్టేబుల్ ను సీఐని కలవాలని అడిగింది. అయితే సోమవారం వస్తారని చెప్పడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Nellore Murders: హోటల్ ఓనర్ దంపతుల దారుణ హత్య, ఇంట్లోనే గొంతుకోసి మరీ - బంగారం అంతా అక్కడే కానీ

Also Read : Car Drowned in Brook: ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా విషాదం, వాగులో కారు కొట్టుకుపోయి యువతి మృతి

 

టాప్ హెడ్ లైన్స్

Naked Woman Found Dead: అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
అర్ధరాత్రి నగ్నంగా యువతి పరుగులు.. తెల్లారేసరికి చెరువులో శవమై తేలింది! పీర్జాదిగూడలో సంచలనం
Wife Kills Husband With Snake: చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
చివరికి మొగుళ్లను ఇలా కూడా చంపుతున్నారా ? - డ్రైవర్‌తో ఎఫైర్ పెట్టుకుని పాముకాటుతో భర్తను హత్య చేసిన భార్య!
Tragedy in Polavaram: గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
గోదావరిలో చేపల వేటకు వెళ్లి ఐదుగురి మృతి.. వారిలో ముగ్గురు మహిళలు- పోలవరం జిల్లాలో విషాదం
Vikarabad Latest News: యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!
యాలాల మండలంలో స్వామీజీ ఆశ్రమంలో గంజాయి సాగు! పట్టుకున్న పోలీసులు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget