అన్వేషించండి

Sangareddy News: అన్నం తినిపించిన చేతులే ఆయువు తీశాయి - ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య, సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం

Telangana News: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి అనంతరం ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

Mother Poisoned Her Children And Died In Sangareddy: నవమాసాలు కనిపెంచిన ఆ తల్లే ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశమైంది. అన్నం తినిపించాల్సిన చేతులతోనే విషం ఇచ్చి ముగ్గురు చిన్నారుల ఆయువు తీసింది. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) ఈ విషాద ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు (Patancheru) మండలం రుద్రారం గ్రామంలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ప్రాణం తీసింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త ఇస్నాపూర్‌లో మెకానిక్ కాగా కొద్ది రోజులుగా అతను కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నాడు. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ కారణంగానే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు గ్రామంలో నలుగురు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

మరో ఘటన

అటు, హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఇలాంటి విషాద ఘటనే చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు అనంతరం వారు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెంకటేశ్ (40), వర్షిణి (33) దంపతులు తమ ఇద్దరు పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3)తో కలిసి ఉంటున్నారు. శనివారం రాత్రి తమ ఇద్దరు పిల్లలను చంపిన దంపతులు అనంతరం వారూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి స్వస్థలం మంచిర్యాల కాగా.. ఆర్థిక ఇబ్బందులతోనే దంపతులు ఇలా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉరి వేసుకునే ముందు వెంకటేశ్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మృతుని తండ్రి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Ponguleti Srinivas Reddy: వరదలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, కాపాడలేకపోయానంటూ మంత్రి పొంగులేటి కన్నీళ్లు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Daughter in law Stab Mother in law: అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
Mobile Battery Blast Asifabad: మరణం కూడా ఇలా కూడా వస్తుంది - నోట్లో పేలిన సెల్ బ్యాటరీ - ఆసిఫాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు మృతి!
మరణం కూడా ఇలా కూడా వస్తుంది - నోట్లో పేలిన సెల్ బ్యాటరీ - ఆసిఫాబాద్‌లో 15 ఏళ్ల బాలుడు మృతి!
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Embed widget