అన్వేషించండి

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో గురువారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. 13 మంది సజీవదహనం అయ్యారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మార్కాపురం సమీపంలో టిప్పర్, బస్సు ఢీకొని పది మంది సజీవదహనం.
  • బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధం.
  • హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుండగా అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదం.
  • స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం.

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్ పూర్తిగా కాలిపోయింది. 

మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రామీణ మండల పరిధిలోని రాయవరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్‌ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది.  

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం రాయవరం వద్ద జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్, టిప్పర్ అతివేగంగా ఎదురెదురుగా  ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగాయి. సెకన్లలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్ నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. 

చాలా మంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కొందరు సాహసించి బస్ కిటికీలు పగులుగొట్టి ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 13మంది సజీవదహనం అయ్యారు. 

సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బస్ పూర్తిగా అస్తిపంజరంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాయవరం సమీపంలోనీ ఈ ప్రాంతంలో క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడ భారీగా టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అతి వేగం, డ్రైవర్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమమవుతుంటాయి. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాం అందించడంతోపాటు మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. 

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది. అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. 

మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రమాదం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా అతివేగంగా ఢీ కొన్నాయి. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు వ్యాపించాయి.

ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget