అన్వేషించండి

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో గురువారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. 13 మంది సజీవదహనం అయ్యారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మార్కాపురం సమీపంలో టిప్పర్, బస్సు ఢీకొని పది మంది సజీవదహనం.
  • బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధం.
  • హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుండగా అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదం.
  • స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం.

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్ పూర్తిగా కాలిపోయింది. 

మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రామీణ మండల పరిధిలోని రాయవరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్‌ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది.  

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం రాయవరం వద్ద జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్, టిప్పర్ అతివేగంగా ఎదురెదురుగా  ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగాయి. సెకన్లలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్ నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. 

చాలా మంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కొందరు సాహసించి బస్ కిటికీలు పగులుగొట్టి ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 13మంది సజీవదహనం అయ్యారు. 

సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బస్ పూర్తిగా అస్తిపంజరంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాయవరం సమీపంలోనీ ఈ ప్రాంతంలో క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడ భారీగా టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అతి వేగం, డ్రైవర్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమమవుతుంటాయి. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాం అందించడంతోపాటు మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. 

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది. అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. 

మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రమాదం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా అతివేగంగా ఢీ కొన్నాయి. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు వ్యాపించాయి.

ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget