అన్వేషించండి

Life And Death Story: చనిపోయాడనుకుంటే చితిపై నుంచి లేచాడు - కొన్ని గంటల్లోనే మళ్లీ మృత్యుఒడికి, లైఫ్ అండ్ డెత్ స్టోరీ

Tragedy Incident: ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించగా అంత్యక్రియల కోసం తీసుకెళ్తే చితిపై నుంచి లేచాడు. మళ్లీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Dead Man Wakes Up Before Cremation In Rajasthan: ఓ యువకుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా ఆ సమయంలో చితిపై నుంచి లేచి అందరికీ షాక్ ఇచ్చాడు. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల్లోనే మృత్యుఒడికి చేరుకున్నాడు. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ యువకుడి జీవితంలో కొన్ని గంటలపాటు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన రాజస్థాన్‌లో సంచలనం కలిగించింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని (Rajasthan) ఝుంఝును ప్రాంతానికి చెందిన రోహితాష్ కుమార్ (25) బధిరుడు. నా అనుకునే కుటుంబీకులు ఎవరూ లేరు. స్థానికంగా ఓ పునరావాస కేంద్రంలో నివసిస్తున్నాడు. గురువారం అతను అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు అతన్ని బీడీకే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటలకు అతను చనిపోయినట్లు ప్రకటించారు. అనంతరం మార్చురీకి తరలించి 2 గంటల పాటు అక్కడే ఉంచారు. పోలీసుల పంచనామా అనంతరం అతన్ని అంత్యక్రియల కోసం తరలించారు. 

చితిపై నుంచి లేచాడు

చితిపై ఉంచిన కొద్దిసేపటికే రోహితాష్‌లో కదలికలు గుర్తించారు. వెంటనే అంబులెన్సును రప్పించి మళ్లీ బీడీకే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చేర్పించారు. శుక్రవారం అతన్ని జైపుర్‌లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్.. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను సస్పెండ్ చేశారు. పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

చితిపై నుంచి లేచి నీళ్లు అడిగిన బామ్మ

అటు, ఇలాంటి ఘటనే తమిళనాడు తిరుచ్చిలోనూ 2 రోజుల క్రితం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే చితిపై నుంచి లేచిన బామ్మ నీళ్లు అడిగడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. వృద్ధురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుచ్చి జిల్లా మనప్పారై మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన పంపైయ్యన్ (72), అతని భార్య చిన్నమ్మాల్ (62) దంపతులు. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ నెల 16న చిన్నమ్మాల్ పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వృద్ధురాలిని ఇంటికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే మృతి చెందింది.

దీంతో బంధువులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. శ్మశానంలో చితిపై వృద్ధురాలి మృతదేహాన్ని ఉంచి మరికాసేపట్లో దహనం చేయబోతారనగా.. ఉన్నట్లుండి ఆమెలో కదలిక వచ్చింది. అకస్మాత్తుగా కళ్లు తెరిచిన వృద్ధురాలు తనపై పడి ఏడుస్తున్న బంధువుల్లో ఒకరి చెయ్యి పట్టుకుని తనకు తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే తేరుకుని అంబులెన్సులో ఆమెను ఆస్పత్రికి తరలించారు. 

Also Read: Sidhu True Husband: మగ సావిత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ - దాదాపుగా చనిపోయిన భార్యను బతికించుకున్న వైనం తెలిస్తే మీరే ఒప్పుకుంటారు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
YS Jagan: ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
177 Crores Acre: ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
ఎకరం రూ.177 కోట్లు - హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో భూమికి రికార్డు ధర
Nara Lokesh:  ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
ముంబైలో నారా లోకేష్ విస్తృత పర్యటన - టాటా చైర్మన్ సహా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ !
YS Jagan: ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
ఉద్యోగుల్ని ఇంత మోసం చేస్తారా ? - మేనిఫెస్టో చూపించి మరీ ప్రశ్నించిన జగన్
Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
Women Cricker Names for Vizag Cricket Stands: స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
స్మృతి మందాన అడిగింది.. లోకేష్ చేశారు. వైజాగ్ స్టేడియంలో ఈ మార్పులు…!
Invest Telangana: తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ  మాన్యుఫాక్చరింగ్ హబ్
తెలంగాణలో అమెరికా ఫార్మాదిగ్గజం పెట్టుబడులు - బిలియన్ డాలర్లతో ఎల్ లిల్లీ మాన్యుఫాక్చరింగ్ హబ్
Andhra Pradesh Viral Accident: మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
మందుబాబు అంటే వీడే-రాంగ్ రూట్ లో వచ్చి కారును ఢీకొట్టింది కాక రచ్చరచ్చ చేశాడు !
Bihar Election 2025 Date:  రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు- పూర్తి షెడ్యూల్ ఇదే
Embed widget