అన్వేషించండి

Kurnool: ప్రభాస్ ఫ్యాన్ ఆత్మహత్య, ఇంట్లోనే ఉరేసుకొని - తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అవాక్కైన పోలీసులు!

Radhe Shyam Movie: సినిమా తనకు నచ్చలేదనే కారణంతోనే రవితేజ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అతని తల్లి కూడా ఈ విధంగానే ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. కర్నూలు నగరంలోని తిలక్ నగర్ కాలనీకి చెందిన రవితేజ (24) అనే యువకుడు పాల్పడ్డాడు. అతను వెల్డింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తాను ఎంతగానో అభిమానించే హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా తనకు నచ్చలేదనే కారణంతోనే రవితేజ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. అతని తల్లి కూడా ఈ విధంగానే ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం మరో ఊరికి వెళ్లిన అతని తల్లి.. రవితేజకు ఫోన్ చేస్తే చాలా సార్లు లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడ్డ ఆమె రవితేజ స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు ఉదయం రవితేజ ఇంటికి వెళ్లి తలుపు తట్టినా స్పందించ లేదు. వెల్డింగ్ యంత్రంతో ఘడియను తొలగించి చూడగా ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే అతణ్ని కిందకి దింపి బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి రవితేజ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. 

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాగా లేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకొన్నట్లుగా మృతుడి తల్లి ఫిర్యాదు ఇచ్చింది. దీంతో బంధువులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు బలవన్మరనానికి పాల్పడటంతో తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది.

‘పుష్ప’ను దాటేసిన రాధేశ్యామ్
‘రాధే శ్యామ్’ సినిమా మిశ్రమ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ.79 కోట్లు వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. బాక్సాఫీస్ ను రాధే శ్యామ్ శాసిస్తోందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత తమ చిత్రాన్ని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. తొలి రోజు వసూళ్లలో అల్లు అర్జున్ చిత్రం పుష్పను రాధే శ్యామ్ దాటేసింది. తొలి రోజున పుష్ప రూ.71 కోట్లు వసూలు చేసింది. పుష్ప చిత్రానికి కూడా తొలి రోజున మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పుంజుకుని ఏకంగా రూ.330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే తరహాలో రాధే శ్యామ్ కూడా భారీ వసూళ్లను రాబడుతుందేమో వేచి చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్న

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Telangana BJP :   తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ -  కొన్ని చోట్ల  తప్పదా ?
తెలంగాణ బీజేపీలో టిక్కెట్ల మార్పు రచ్చ - కొన్ని చోట్ల తప్పదా ?
Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో షాక్ - ఈడీ కస్టడీ పొడిగించిన న్యాయస్థానం
Embed widget