By: ABP Desam | Updated at : 23 May 2023 05:47 PM (IST)
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ను అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహణ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి చెల్లించేవారు. ఇందులో సుమారు రూ.80,000 వేల వరకు లెక్కలు చూపకపోవడంతో నర్సాగౌడ్ కు పలువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలిసింది.
దీని విషయంలోనే కక్ష పెంచుకొని నర్సాగౌడ్ ను హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నర్సా గౌడ్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఉదయం వరకు ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నర్సాగౌడ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ ఐ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Stray Dogs: హైదరాబాద్ లో మరో విషాదం, వీధి కుక్కల భయంతో బాలుడు మృతి!
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక చితిలోకి దూకిన వ్యక్తి, తీవ్ర గాయాలతో మృతి
Nizamabad Crime: అప్పు తీర్చు, లేకపోతే కోరిక తీర్చాలంటూ డాక్టర్ వేధింపులు- నర్సు ఆత్మహత్య!
US Teen Murders: తల్లిదండ్రుల్ని, తమ్ముళ్లను కాల్చి చంపిన 18 ఏళ్ల కుర్రాడు - రక్తంతో తడిసిపోయిన ఇల్లు
Cyber Fraud: వన్ ప్లస్ వన్ ఆఫర్ చూసి టెంప్ట్ అయిన మహిళ, లింక్ క్లిక్ చేయగానే రూ.90 వేలు హాంఫట్
కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్