అన్వేషించండి

Kamareddy Crime: భర్త వేధింపులు భరించలేక భార్య దారుణం... భర్త మెడకు చున్నీ బిగించి హత్య...!

కామారెడ్డి పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ చున్నీతో భర్త గొంతు నులిమి హత్య చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కుటుంబ కలహాలతో భార్య భర్తను హత్య చేసిన ఉదాంతం కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. డీఎస్పీ సోమనాథం తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన ఆఫ్రోజ్(38) పట్టణంలో అల్లం వెల్లుల్లి వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇతనికి భార్య ఫర్జానా, పదేళ్ల కొడుకు ఉన్నారు. రోజు మద్యం సేవించి తనను మానసికంగా వేధించేవాడని ఫర్జానా ఆరోపిస్తుంది. ఆ బాధలు భరించలేని ఫర్జానా సోమవారం రాత్రి ఆఫ్రోజ్ నిద్రపోయిన తర్వాత చున్నీని ఆఫ్రోజ్ గొంతును బిగించి హత్య చేసింది. దాంతో ఆఫ్రోజ్ మృతి చెందాడు. ఆఫ్రోజ్ గొంతుకు గాయమైనట్టుగా పోలీసులు గుర్తించారు. 

Also Read: కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..

కేసులో మరో కోణం

అయితే ఫర్జానాకు ఆఫ్రోజ్ రెండో భర్త. మొదటి భర్తతో విడిపోయి ఆఫ్రోజ్ ను పెళ్లి చేసుకుంది. మొదటి భర్తకు  సుమారు 15 సంవత్సరాల కుమారుడు ఉండగా అతను ఫర్జానాతోనే ఉంటున్నాడు. రెండో భర్త అయిన ఆఫ్రోజ్ కు ఇద్దరు కొడుకులు. కాగా ఒక కుమారుడు చనిపోయాడు. అయితే ఆఫ్రోజ్ ను ఫర్జానానే హత్య చేసిందా లేదా ఆమెకు ఇంకా ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్రోజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి డీఎస్పీ సోమనాథం జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. నిందితురాలు ఫర్జానాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టుగా సమాచారం.

Also Read:  గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..

ప్రియుడి మోజులో భర్తను హత్య

 మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామానికి చెందిన మొద్దు వెంకటేష్‌ అనే 37 ఏళ్ల వ్యక్తికి బుద్దారం గ్రామానికి చెందిన మాధవితో పదేళ్ల కిందటే పెళ్లి జరిగింది. అయితే, భార్య మాత్రం నాగర్‌ కర్నూల్‌కు చెందిన జంగం రమేష్‌ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని రహస్యంగా కొనసాగిస్తోంది. నాగర్‌కర్నూల్‌కు చెందిన జంగం రమేశ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం కాగా.. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం చివరకు భర్తకు తెలిసిపోయింది.

భర్త వెంకటేష్‌ తన భార్యను వివాహేతర సంబంధం గురించి నిలదీశాడు. దీంతో భార్య భర్తను ఎలాగైనా అంతం చేయాలని నిశ్చయించుకుంది. పొలం పనులకు వెళ్లి వచ్చిన భర్త ఆదివారం రాత్రి ఎప్పటిలా భోజనం చేసి నిద్ర పోతున్న సమయంలో చంపాలని ప్రణాళిక వేసింది. అప్పటికే, వేసిన ప్లాన్ ప్రకారం.. భార్య మాధవి రమేష్‌తో కలిసి భర్త వెంకటేష్‌ గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే భర్త శవాన్ని మధ్యలో ఉంచుకొని బైక్‌పై ముగ్గురూ నాయినోని పల్లి శివారులో మెయిన్ రోడ్డుపై వేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అలా వెళ్తుండగా మధ్యలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించారు. వీరిని గుర్తించిన హన్వాడ పోలీసులు ప్ర ధాన రహదారిపై వారిని ఆపేశారు. భయంతో ఇద్దరూ మృతదేహాన్ని వదిలి పారిపోతుండగా వెంబడించి పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget