అన్వేషించండి

Crime News: రూ.20 అడిగినందుకు తల్లిని చితకబాదిన తనయుడు-తల్లి మృతి

Hyderabad Crime News: 20 రూపాయలు కోసం తల్లీకొడుకుల మధ్య మొదలైన గొడవ... తల్లి ప్రాణం తీసింది. తనయుడి చేతిలో తన్నులు తిన్న తల్లి... నిద్రలోనే ఊపిరి వదిలింది. ఈ దారుణం ఎక్కడ జరిగింది..?

Shadnagar Crime News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. 20 రూపాయల కోసం తల్లి,కొడుకుల మధ్య జరిగిన గొడవ... తల్లి ప్రాణం పోవడానికి  కారణమైంది. మద్యానికి అలవాటు పడ్డ తల్లి.. డబ్బుల కోసం తరచూ తనయుడిని వేధిస్తోందని సమాచారం. ఈ క్రమంలో 20రూపాయలు ఇవ్వమని అడిగిన తల్లిపై విచక్షణా  రహితంగా దాడి చేశాడు తనయుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె... ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. 

సుగుణమ్మ.. ఈమె వయస్సు 40ఏళ్లు. ఆమెకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయింది. భర్త లేకపోవడంతో కుమారుడు శివతో కలిసి  షాద్‌నగర్‌లోని కేశంపేటరోడ్డులో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది సుగుణమ్మ. ఆమె కూతురు నందిని కూడా షాద్‌నగర్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది. సుగుణమ్మ మద్యానికి  అలవాటు పడింది. మందు తాగేందుకు డబ్బుల కోసం తరచూ కుమారుడిని వేధిస్తోందని సమచారం. ఈ క్రమంలో ఆదివారం (జనవరి 7న) ఉదయం తల్లి సుగుణమ్మ మందు  తాగేందుకు 20రూపాయలు ఇవ్వాలని కొడుకు శివను అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు తనయుడు శివ.  పక్కింటి వాళ్లు వచ్చి... శివకు నచ్చజెప్పారు. ఆ తర్వాత శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తల్లి సుగుణమ్మ కూడా బయటకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది.  

ఆదివారం (జనవరి 7వ తేదీ) మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన సుగుణమ్మ... షాద్‌నగర్‌లోనే ఉంటున్న కూతురు నందిని ఇంటికి వెళ్లింది. కొడుకు కొట్టిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో నందిని వారి ఇంటికి వచ్చి... తల్లి, తమ్ముడితో మాట్లాడింది. అమ్మను ఎందుకు కొట్టావని తమ్ముడిని నిలదీసింది. డబ్బుల కోసం బాగా సతాయిస్తోందని, ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ మద్యం తాగుతోందని.. దీంతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు. తర్వాత తల్లికి, తమ్ముడికి నచ్చజెప్పింది నందిని. ఆదివారం (జనవరి 7న) మధ్యాహ్నం 3గంటల సమయంలో అక్కాతమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తల్లి సుగుణమ్మ కూడా బయటికి వెళ్లి మళ్లీ మద్యం తాగింది.  ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి... ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. 

అదే రోజు.. ఆదివారం (జనవరి 7వ తేదీ) అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ కూతురు నందినికి ఫోన్ చేసింది సుగుణమ్మ. కొడుకు డబ్బులివ్వడం లేదని, తనకు డబ్బులు ఇప్పించాలని చెప్పింది. ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పింది కూతురు నందింది. సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం 9గంటలకు కొడుకు తల్లి సుగుణమ్మను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా... ఆమె లేవలేదు.. సరికదా ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే పక్కింటి వాళ్లను, వైద్యుడిని పిలిపించి చూపించాడు. అప్పటికే సుగుణమ్మ చనిపోయిందని చెప్పారు. 

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు సుగుణమ్మ డెడ్‌‌‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం షాద్‌‌‌‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు కొట్టిందువల్లే తల్లి చనిపోయిందా...? లేక.. ఇంకేమైనా కారణం ఉందా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందన్నారు పోలీసులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget