అన్వేషించండి

Crime News: రూ.20 అడిగినందుకు తల్లిని చితకబాదిన తనయుడు-తల్లి మృతి

Hyderabad Crime News: 20 రూపాయలు కోసం తల్లీకొడుకుల మధ్య మొదలైన గొడవ... తల్లి ప్రాణం తీసింది. తనయుడి చేతిలో తన్నులు తిన్న తల్లి... నిద్రలోనే ఊపిరి వదిలింది. ఈ దారుణం ఎక్కడ జరిగింది..?

Shadnagar Crime News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. 20 రూపాయల కోసం తల్లి,కొడుకుల మధ్య జరిగిన గొడవ... తల్లి ప్రాణం పోవడానికి  కారణమైంది. మద్యానికి అలవాటు పడ్డ తల్లి.. డబ్బుల కోసం తరచూ తనయుడిని వేధిస్తోందని సమాచారం. ఈ క్రమంలో 20రూపాయలు ఇవ్వమని అడిగిన తల్లిపై విచక్షణా  రహితంగా దాడి చేశాడు తనయుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె... ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. 

సుగుణమ్మ.. ఈమె వయస్సు 40ఏళ్లు. ఆమెకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురికి పెళ్లి అయిపోయింది. భర్త లేకపోవడంతో కుమారుడు శివతో కలిసి  షాద్‌నగర్‌లోని కేశంపేటరోడ్డులో ఒక అద్దె ఇంట్లో ఉంటోంది సుగుణమ్మ. ఆమె కూతురు నందిని కూడా షాద్‌నగర్‌లోనే భర్తతో కలిసి ఉంటోంది. సుగుణమ్మ మద్యానికి  అలవాటు పడింది. మందు తాగేందుకు డబ్బుల కోసం తరచూ కుమారుడిని వేధిస్తోందని సమచారం. ఈ క్రమంలో ఆదివారం (జనవరి 7న) ఉదయం తల్లి సుగుణమ్మ మందు  తాగేందుకు 20రూపాయలు ఇవ్వాలని కొడుకు శివను అడిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో తల్లిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు తనయుడు శివ.  పక్కింటి వాళ్లు వచ్చి... శివకు నచ్చజెప్పారు. ఆ తర్వాత శివ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తల్లి సుగుణమ్మ కూడా బయటకు వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది.  

ఆదివారం (జనవరి 7వ తేదీ) మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చిన సుగుణమ్మ... షాద్‌నగర్‌లోనే ఉంటున్న కూతురు నందిని ఇంటికి వెళ్లింది. కొడుకు కొట్టిన విషయాన్ని ఆమె చెప్పింది. దీంతో నందిని వారి ఇంటికి వచ్చి... తల్లి, తమ్ముడితో మాట్లాడింది. అమ్మను ఎందుకు కొట్టావని తమ్ముడిని నిలదీసింది. డబ్బుల కోసం బాగా సతాయిస్తోందని, ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ మద్యం తాగుతోందని.. దీంతో విసిగిపోయానని చెప్పుకొచ్చాడు. తర్వాత తల్లికి, తమ్ముడికి నచ్చజెప్పింది నందిని. ఆదివారం (జనవరి 7న) మధ్యాహ్నం 3గంటల సమయంలో అక్కాతమ్ముడు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తల్లి సుగుణమ్మ కూడా బయటికి వెళ్లి మళ్లీ మద్యం తాగింది.  ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి... ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. 

అదే రోజు.. ఆదివారం (జనవరి 7వ తేదీ) అర్ధరాత్రి 12 గంటలకు మళ్లీ కూతురు నందినికి ఫోన్ చేసింది సుగుణమ్మ. కొడుకు డబ్బులివ్వడం లేదని, తనకు డబ్బులు ఇప్పించాలని చెప్పింది. ఉదయం వచ్చి మాట్లాడతానని చెప్పింది కూతురు నందింది. సోమవారం (జనవరి 8వ తేదీ) ఉదయం 9గంటలకు కొడుకు తల్లి సుగుణమ్మను నిద్ర లేపేందుకు ప్రయత్నించగా... ఆమె లేవలేదు.. సరికదా ఎలాంటి స్పందన రాలేదు. వెంటనే పక్కింటి వాళ్లను, వైద్యుడిని పిలిపించి చూపించాడు. అప్పటికే సుగుణమ్మ చనిపోయిందని చెప్పారు. 

పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు సుగుణమ్మ డెడ్‌‌‌‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం షాద్‌‌‌‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు కొట్టిందువల్లే తల్లి చనిపోయిందా...? లేక.. ఇంకేమైనా కారణం ఉందా అన్నది పోస్టుమార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందన్నారు పోలీసులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget