అన్వేషించండి

Gandhi Hospital Case: మిస్టరీగా గాంధీ హాస్పిటల్ గ్యాంగ్ రేప్ వ్యవహారం.. కేసులో మరో ట్విస్ట్

కిడ్నీల సమస్యతో బాధపడుతున్న తన భర్తను, తన చెల్లిని వెంటబెట్టుకొని ఓ మహిళ గాంధీ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఈ అక్కా చెల్లెళ్లపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారం జరిగిందని బాధితురాలు పేర్కొంది.

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లుగా భావిస్తున్న ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఇంకా మిస్టరీగానే ఉంది. మరోవైపు, గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో సెక్యూరిటీ గార్డు రాము అనే వ్యక్తి అదృశ్యం కావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సెక్యూరిటీ గార్డు రాము ఈనెల 14 నుంచి కనిపించడం లేదని గాంధీ ఆస్పత్రిలోని పర్యవేక్షకులు చెబుతున్నారు. రాము కనిపించకుండా పోవడంతో ఆ సామూహిక అత్యాచార ఘటనలో సెక్యూరిటీ గార్డు రాము పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇంకోవైపు, బాధిత మహిళల్లో ఒకరి ఆచూకీ ఇంకా దొరకలేదు. 

Also Read: Tamilisai Mother Passed Away: గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం.. సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

ఇప్పటివరకూ ఈ కేసులో అనుమానితులుగా అరెస్టు చేసిన నిందితులు ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ గార్డును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయినా, ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న బాధితురాలు చెప్పిన దాని ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అక్కా చెల్లెళ్లు ఈ నెల 8న మిస్ అయ్యారు. ఆ తర్వాతే వీరిపై సామూహిక అత్యాచారం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించిన ప్రత్యేక టీమ్.. గాంధీ ఆసుపత్రి, ఆ చుట్టు పక్కల ప్రాంతాలు, రోడ్లపై ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన వీడియోలను క్షుణ్నంగా పరిశీలించింది. ఇలా వాటి ఆధారంగా ఇప్పటి వరకూ ఆచూకీ లేని మహిళ ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒంటరిగా గాంధీ ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాక, మరికొందరు ప్రత్యక్ష సాక్షుల్ని కూడా పోలీసులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలు కూడా 14వ తేదీన గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు గుర్తించారు. 

Also Read: MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట

కేసు వివరాలేంటంటే..
మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన ఓ మహిళ కిడ్నీల సమస్యతో బాధపడుతున్న తన భర్త నర్సింహులును, తన చెల్లిని వెంటబెట్టుకొని కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. అక్కడ ఈ అక్కా చెల్లె్ళ్లపై ఐదుగురు వ్యక్తులు సాముహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సింహులును ఈ నెల 4న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. గాంధీ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అయిన ఉమామహేశ్వర్ అనే వ్యక్తిది కూడా నర్సింహులు సొంత ఊరే. అయితే, అతను ఉన్నాడన్న భరోసాతో నర్సింహులు కుటుంబంతో ట్రీట్‌మెంట్ కోసం వచ్చాడు. ఈ నెల 11వ తేదీన అతనికి కిడ్నీ సంబంధిత చికిత్స నిర్వహించారు. చివరికి అతను డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన భార్య, చెల్లెలు కనిపించకుండా పోయారు.

ఇలా హైదరాబాద్‌లో మిస్ అయిన అక్కాచెల్లెళ్లలో నర్సింహులు మరదలు.. మహబూబ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్ దగ్గర ప్రత్యక్షమైంది. ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తన అక్కను, తనను కిడ్నాప్ చేశారని, కొందరు లైంగికంగా వేధించారని, రేప్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. తాను మాత్రం వాళ్ల కళ్లుగప్పి ఏదోలా తప్పించుకున్నానని వివరించింది. తప్పిపోయిన ఆమె అక్క ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. బాధితురాలి ఫిర్యాదుతో మహబూబ్‌ నగర్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దాన్ని హైదరాబాద్‌లోని చిలకలగూడ పీఎస్‌కు మార్చారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించగా, ఉమామహేశ్వర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇతనితోపాటు మిగతా నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకూ అక్కాచెల్లెళ్లు ఎక్కడెక్కడ తిరిగారన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐదు రోజులుగా ఉమామహేశ్వర్‌ డ్యూటీకి సరిగ్గా హాజరు కాలేదని, వచ్చినా రెండు, మూడుగంటలు పనిచేసి తొందర తొందరగా వెళ్లిపోతున్నా

Also Read: Mancherial: అఫ్గానిస్థాన్‌లో తెలుగువాళ్లు.. చిక్కుకుపోయిన మంచిర్యాల వాసి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్న ఫ్యామిలీ

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Uday Krishna Reddy Arrest: పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
పరారీలో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ - మిర్యాలగూడ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget