అన్వేషించండి

Hyderabad News: చిన్నారిని చిదిమేసిన కారు, చూసుకోకుండా పాప పైనుంచి వెళ్లడంతో ఘోరం

Hyderabad Crime News: భవననిర్మాణ కార్మికురాలిగా పని చేసే ఓ తల్లి తన మూడేళ్ల పాపను అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెట్టింది. అది చూడని ఓ వ్యక్కి పాప పైనుంచి కారు పోనివ్వగా అక్కడికక్కడే చనిపోయింది.

Hyderabad Crime News: ఆ తల్లి భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తోంది. మూడేళ్ల తన పాపను కూడా తన వెంట బెట్టుకొచ్చింది. చాలాసేపు ఆడుకున్న పాపకు బాగా నిద్ర రావడంతో.. విషయం గమనించిన తల్లి పాపను పడుకోబెట్టింది. అయితే అక్కడ ఎండగా ఉందని.. పక్కనే ఉన్న అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో పడుకోబెడితే చల్లగా ఉంటుందని అక్కకడకు తీసుకెళ్లి నిద్ర పుచ్చింది. ఆ తర్వాత ఆమె వచ్చిన నిర్మాణ పనుల్లో నిమగ్నమైంది. అయితే అపార్టుమెంటుకు చెందిన ఓ వ్యక్తి బయట నుంచి వచ్చాడు. తన పార్కింగ్ స్థలంలో పాప పడుకున్న విషయం తెలియక నేరుగా కారును పోనిచ్చాడు. దీంతో కారు పాప తలపైకి ఎక్కింది. తీవ్ర గాయాలపాలైన పాప అక్కడికక్కడే మృతి చెందింది. 

అసలేం జరిగిందంటే..?

కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా షాబాద్ కు చెందిన రాజు, కవిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వాళ్లలో ఏడేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. అయితే బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి వచ్చిన వారు బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని శ్రీ కృష్ణనగర్ లో నివాసం ఉంటున్నారు. హయత్ నగర్ సమీప లెక్చరర్స్ కాలనీలో బాలజీ ఆర్కేడ్ అపార్ట్ మెంట్ పక్కన నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో శ్లాబు పనులు చేస్తున్నారు. బుధవారం రోజు తమతో పాటే వచ్చిన చిన్నారి లక్ష్మీని తల్లి కవిత నిద్ర పుచ్చింది. తాను పని చేసే నీడ లేకపోవడంతో పక్కనే ఉన్న అపార్టుమెంట్ పార్కింగ్ స్థలంలో బిడ్డను పడుకోబెట్టింది. ఆపై నిర్మాణ పనిలో నిమగ్నమైంది. అయితే అదే అపార్టుమెంటులో నివసించే హరిరామ కృష్ణ తన కారుతో బట నుంచి వచ్చారు. తనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో పాప పడుకుని ఉండటాన్ని గమనించకుండా కారును పార్కు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పాప తలపైకి కారు ముందు చక్రం ఎక్కింది. తీవ్ర గాయాలపాలైన పాప అక్కడికక్కడే మృతి చెందింది.   

విషయం తెలుసుకున్న తల్లి గుండెలవిసేలా రోదిచింది. చిన్నారిని పట్టుకొని ప్రాణాలు కాపాడమంటూ అక్కడున్న వారందరినీ వేడుకుంది. దీంతో స్థానికులంతా కలిసి పాపను వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పాప చనిపోయిందని తెలుసుకున్న తల్లి తల్లడిల్లిపోయింది. కాసేపు పడుకోమని నిద్ర పుచ్చితే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయావా అంటూ తల బాదుకుంటూ ఏడుస్తోంది. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read:  ముగ్గురు పిల్లలను చంపేసి దంపతులు ఆత్మహత్య

ఫిబ్రవరి నెలలోనూ ఇలాంటి ఘటనే.. 

మూడు నెలల క్రితం కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రాయదుర్గంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఎనిమిదేళ్ల కుమారుడి పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో సదరు బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే బాలుడి తండ్రి ఇటీవలే చనిపోవడం.. ఉన్న ఒక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాల పాలవడంతో బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

అసలేం జరిగిందంటే..?

రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో ఓ ఇద్దరు బాలురు కింద కూర్చొని ఆడుకుంటున్నారు. ఇదే క్రమంలో కారు పార్కింగ్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. వారిపైకి దూసుకెళ్లాడు. ఓ బాలుడు వెంటనే తప్పించుకోగా.. మరో బాలుడు కారు కిందే ఇరుక్కుపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వచ్చి సదరు బాలుడిని కారు కింద నుంచి తీశారు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన బాలుడి పేరు జీవాన్ష్. సదరు బాలుడి తల్లిదండ్రులు శ్రావణి, సాయి. అయితే వీరు చిత్రపురి హెచ్ఐజీ-5- 705లో నివాసంలో ఉంటున్నారు. జీవాన్ష్ తండ్రి సాయి హెచ్ఐజీలో మేనేజర్ గా పని చేసేవాడు. కానీ ఆయన ఇటీవలే మరణించారు. ఈ బాధ నుంచి కుటుంబ సభ్యులు కోలుకోక ముందే.. మరో దెబ్బ తగలడంతో వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బాలుడు జీవాన్ష్ మృత్యువుతో పోరాడుతున్నాడు. భర్తను కోల్పోయి కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి.. కుమారుడికి ఏమవుతుందో అన్న బాధతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: శరీరాన్ని ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో, బకెట్‌లో - మహిళ తల గుర్తింపు కేసులో వణికిపోయే వాస్తవాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
Denduluru MLA Video Viral : దెందులూరులో డిష్యుం డిష్యుం- చింతమనేని బూతుల వీడియో వైరల్‌- వైసీపీ నేతలే హత్యాయత్నం చేశారని టీడీపీ ప్రచారం
దెందులూరులో డిష్యుం డిష్యుం- చింతమనేని బూతుల వీడియో వైరల్‌- వైసీపీ నేతలే హత్యాయత్నం చేశారని టీడీపీ ప్రచారం
PM Modi In US:అమెరికా గడ్డపై కాలు పెట్టిన ప్రధానమంత్రి మోదీ, సుంకాలపై ట్రంప్‌ను ఒప్పించగలరా?
అమెరికా గడ్డపై కాలు పెట్టిన ప్రధానమంత్రి మోదీ, సుంకాలపై ట్రంప్‌ను ఒప్పించగలరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Arrest: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు- హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
Denduluru MLA Video Viral : దెందులూరులో డిష్యుం డిష్యుం- చింతమనేని బూతుల వీడియో వైరల్‌- వైసీపీ నేతలే హత్యాయత్నం చేశారని టీడీపీ ప్రచారం
దెందులూరులో డిష్యుం డిష్యుం- చింతమనేని బూతుల వీడియో వైరల్‌- వైసీపీ నేతలే హత్యాయత్నం చేశారని టీడీపీ ప్రచారం
PM Modi In US:అమెరికా గడ్డపై కాలు పెట్టిన ప్రధానమంత్రి మోదీ, సుంకాలపై ట్రంప్‌ను ఒప్పించగలరా?
అమెరికా గడ్డపై కాలు పెట్టిన ప్రధానమంత్రి మోదీ, సుంకాలపై ట్రంప్‌ను ఒప్పించగలరా?
Bird Flue In Andhra Pradesh : బర్డ్‌ఫ్లూ తగ్గిపోయింది- కోడి మాంసం, గుడ్లు భయం లేకుండా తినొచ్చు- ఏపీ మంత్రి కీలక ప్రకటన 
బర్డ్‌ఫ్లూ తగ్గిపోయింది- కోడి మాంసం, గుడ్లు భయం లేకుండా తినొచ్చు- ఏపీ మంత్రి కీలక ప్రకటన 
Vijay Deverakonda: 'కింగ్‌డమ్‌'పై నేషనల్ క్రష్ స్పెషల్ పోస్ట్... రష్మికకు దేవరకొండ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?
'కింగ్‌డమ్‌'పై నేషనల్ క్రష్ స్పెషల్ పోస్ట్... రష్మికకు దేవరకొండ పెట్టిన ముద్దు పేరు ఏంటో తెలుసా?
2-2-2 Method for Weight Loss : బరువు తగ్గేందుకు 2-2-2 రూల్.. ఈ టెక్నిక్​ని ఫాలో అయితే ఇట్టే ఫిట్​గా మారిపోవచ్చు
బరువు తగ్గేందుకు 2-2-2 రూల్.. ఈ టెక్నిక్​ని ఫాలో అయితే ఇట్టే ఫిట్​గా మారిపోవచ్చు
Janasena : 23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
23న పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ కళ్యాణ్ సమావేశం - సంచలన నిర్ణయాలుంటాయా ?
Embed widget