By: ABP Desam | Updated at : 05 Dec 2022 11:13 AM (IST)
Edited By: jyothi
ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ ఇన్ ఫ్రా మోసాలు - వెయ్యి కోట్లు దొచేయడంతో ఈడీ కన్ను
Hyderabad News: ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న సాహితీ ఇన్ ఫ్రా సంస్థలపై ఈడీ దృష్టి సారించింది. పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగందని భావిస్తున్న ఈడీ ఇది వరకే కేసు నమోదు చేసింది ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు భావిస్తున్న స్థలాలకు సంబంధించి వివరాలు పంపాలంటూ సంబంధిత సబ్ రిజిస్ట్రార్ లకు లేఖలు రాసింది. వివరాలు అందిన తర్వాత ఆ ఆస్తులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో సాహితీ సంస్థలు భారీగా డబ్బులు వసూలు చేసినప్పటికీ వాటిలో చాలా ప్రాజెక్టులు మొదలు కూడా పెట్టలేదు. దాంతో డబ్బు కట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
వీరి ఫిర్యాదుల ఆధారంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రీలాంచ్ ప్రాజెక్టుల పేరుతో 2500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేసినట్టు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై విచారణ జరరిపిన అధికారులు మోసాలు నిజమని తేల్చారు. అందుకే ఆయన్ని అరెస్టు చేశారు. 2019లో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సాహితీ శరవణి ఎలైట్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించారు. 23 ఎకరాల్లో 38 అంతస్తులతో పది అపార్టుమెంట్లు నిర్మిస్తున్నామని ప్రకటనల్లో తెలిపారు. డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ల ఫ్లాట్లు ఉంటాయని నమ్మబలికారు. మంచి ఎమినిటీస్తో తక్కువ ధరకే ఇస్తామని అందర్నీ ఆకర్షించారు. ఈ ప్రకటనలకు ఆకర్షితులైన 1700 మంది పెట్టుబడి పెట్టారు. వాళ్లంతా 539 కోట్ల రూపాయలు సాహితీ ఇన్ఫ్రాకు అందజేశారు.
నెలలు కాదు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో కస్టమర్స్ సాహితీ శరవణి ఎలైట్పై ఆరా తీశారు. అసలు ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేవని ఆలస్యంగా తెలిసింది. అంతే వాళ్లంతా మోసపోతున్నామని గ్రహించి బుకింగ్లు రద్దు చేసుకోవడం స్టార్ట్ చేశారు. డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్లను శాంతిపజేయడానికి వడ్డీ పేరుతో మరో మోసానికి తెరశారు బూదాటి లక్ష్మీనారాయణ. ఏడాదికి 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికారు. అందరికీ నమ్మకం కలిగించేందుకు కొందరికి చెక్స్ కూడా ఇచ్చారు. వడ్డీ వస్తుంది కదా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ చెక్స్ను బ్యాంకులో వేస్తే బౌన్స్ అయ్యాయి. దీంతో పూర్తి తామంతా మోసపోయామని గ్రహించి లబోదిబోమని పోలీస్స్టేషన్కు వెళ్లారు.
కేసు రిజిస్టర్ చేసుకొని విచారించిన పోలీసులుకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. ఒక్క అమీన్పూర్లోనే కాదు మరిన్ని ప్రాంతాల్లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రగతినగర్, బొంగుళూరు, కాకతీయ హిల్స్, అయ్యప్ప సొసైటీ, కొంపల్లి, శామీర్పేట్లో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడ్డారు. ఇలా 2,500 మంది నుంచి 900 కోట్లు వసూలు చేశారు. హైదరాబాద్లో ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడ్డ లక్ష్మీనారాయణ... ఆ సొమ్మునంతా అమరావతిలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇలా వచ్చిన డబ్బులను వివిధ ప్రాజెక్టులకు మళ్లించి... అవసరాలకు వాడుకొని బాధితులను నిలువునా ముంచారు. ఆయన ప్రారంభించిన ప్రాజెక్టుల్లో వేటికి కూడా అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు.
Wine Shop Seize: ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు, సీన్ కట్ చేస్తే వైన్ షాప్ సీజ్ ! ఎందుకంటే
Guntur Kidnap Case : గుంటూరులో మిర్చీ వ్యాపారి కిడ్నాప్ కలకలం, ఎవరు చేశారంటే?
Karthika Deepam Serial Issue : కార్తీకదీపం సీరియల్ ఎఫెక్ట్, క్లైమాక్స్ చూస్తున్నప్పుడు విసిగించాడని కస్టమర్ వేలు కొరికిన వ్యాపారి!
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Hyderabad Crime: అద్దె ఇంటి కోసం వచ్చి చైన్ స్నాచింగ్, గుడి నుంచి ఫాలో అయ్యి చివరి నిమిషంలో ట్విస్ట్
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం