అన్వేషించండి

Hyderabad Crime: పెట్రోల్ దొంగతనం చేస్తుండగా అడ్డుకున్న బైక్ యజమాని, తుపాకీతో నిందితుల కాల్పులు

Hyderabad News: తమ కారులో పెట్రోల్ అయిపోవడంతో.. పక్క కార్ లోని పెట్రోల్‌ను దొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు క్యాషియర్ అఖిలేష్ ప్రయత్నించారు.

Gun firing at a hotel at gajularamaram: గన్ కల్చర్ విజృంభిస్తోంది. రోజూ ఏదో ఒక చోట కాల్పుల ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి.  గాజులరామారంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. మంగళవారం అర్థరాత్రి ఎల్‌ఎన్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద క్యాషియర్‌పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తమ కారులో పెట్రోల్ అయిపోవడంతో.. పక్క కార్ లోని  పెట్రోల్‌ను దొంగిలించేందుకు ముగ్గురు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు క్యాషియర్ అఖిలేష్ ప్రయత్నించారు. దీంతో అతడిని బెదిరించేందుకు నరేష్ అనే వ్యక్తి  తుపాకితో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. 

మూడు రౌండ్ల కాల్పులు
నరేష్ మొత్తం అతడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ సిబ్బంది నరేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం.  అయితే కాల్పులు జరిగిన సమాచారాన్ని బార్ యాజమాన్యం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారైనట్లు సమాచారం. కాల్పులు జరిపిన గన్ కు లైసెన్స్ లేదని పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

బీజేపీ నేత పై  కాల్పులు
 మరో వైపు పశ్చిమ బెంగాల్‌లోనూ కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్‌పరా వద్ద తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. హత్యాయత్నంలో భాగంగా ఏడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు చేశారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలం నుంచి ఖాళీ బాంబు షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

బంగారం వ‌ర్త‌కుల‌పై కాల్పులు 
ఐదు రోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో బంగారం వ‌ర్త‌కుల‌పై కాల్పులు జ‌రిపి, వారి వ‌ద్ద నుంచి కొందరు బంగారం దోచుకున్నారు. క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. క‌ల‌క‌త్తాకు చెందిన షేక్ న‌జీర్ పదిహేనేళ్లుగా రాజాంలో బంగారం దుకాణం నడుపుతున్నారు.  తన షాప్‌లో ప‌ని చేసే హుస్సేన్‌తో క‌లిసి న‌గ‌ల‌కు న‌గిషీ ప‌ట్టించేందుకు ద్విచ‌క్ర వాహ‌నంపై బుధ‌వారం రాజాం నుంచి విజ‌య‌న‌గరం వెళ్లారు.  తిరిగి రాత్రి 9.30 గంట‌ల‌కు బైక్ పై వస్తుండగా ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు వీరిపై దాడి చేశారు. అప్పటికే త‌మ వ‌ద్ద ఉన్న 50 గ్రాముల బంగారాన్ని రోడ్డు ప‌క్క‌న తుప్ప‌ల్లోకి విసిరేశారు. త‌మ వ‌ద్ద బంగారం లేద‌నే సరికి కోపంతో దుండ‌గులు తుపాకీతో కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో హుస్సేన్ వైపు బుల్లెట్ తగిలింది.  వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, కొంత న‌గ‌దు తీసుకుని దుండ‌గులు ప‌రార‌య్యారు.  పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget