అన్వేషించండి

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి

Kathua Terrorist Attack: జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే గ్రెనేడ్ విసిరి, ఆపై కాల్పులు జరపగా నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు.

Jammu and Kashmir Terrorist Attack: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. భారత ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రమూకలు దాడి చేశాయి. ఈ ఉగ్రదాడిలో నలుగురు భారత జవాన్లు అమరులయ్యారు. మరో ఆరుగురు సైనికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఉగ్రదాడి ఘటన జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలోని మచేది ఏరియాలో సోమవారం జరిగింది. మొదట ఆర్మీ కాన్వాయ్ వెళ్తుంటే గ్రెనేడ్ విసిరిన ఉగ్రవాదులు ఆ వెంటనే జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. కానీ అప్పటికే తీవ్ర నష్టం జరిగి పోయింది. సమాచారం అందగానే పెద్ద ఎత్తున బలగాలు అక్కడికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

కథువా సిటీకి 150 కిలోమీటర్ల దూరంలోని మచెడి-కిండ్లీ- మల్హర్ రహదారిపై బద్నోటా గ్రామంలో  ఈ ఉగ్రదాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా దాడి చేశారు. మొదట గ్రెనేడ్ విసిరిన టెర్రరిస్టులు, ఏం జరిగిందని జవాన్లు తెరుకునేలోగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులు కాగా, మరో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. భారత ఆర్మీ అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు అక్కడినుంచి అడవిలోకి పరారయ్యారని పీటీఐ రిపోర్ట్ చేసింది.

జమ్మూకాశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు.. 
గత నాలుగు వారాల్లో కథువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఇది రెండో అతిపెద్ద ఘటన. మరోవైపు కుల్గామ్‌లో భారత ఆర్మీ ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చిన తరువాత ఈ దాడి జరిగింది. జూన్ 12, 13 తేదీలలో సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ చేయడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం ఎదురుకాల్పులు జరపగా, ఈ కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు, ఓ జవాన్ చనిపోయారు. జూన్ 26న దోడా జిల్లాలోని గండోహ్ లో ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిసిందే. 

రియాసి జిల్లాలోని శివ్ ఖోరి ఆలయం నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై జూన్ 9న  ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో వాహనం డ్రైవర్, కండక్టర్‌తో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 41 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు.

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
సమంత నా సోల్‌మేట్‌ - నాగార్జునకు కాబోయే కోడలు శోభితా ధూళిపాళ కామెంట్స్ వైరల్!
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Prakash Raj: డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
డిప్యూటీ సీఎం అంటే ఉదయనిధి స్టాలిన్‌లా ఉండాలి - పవన్ కళ్యాణ్‌కు ప్రకాష్ రాజ్ మరో కౌంటర్
Embed widget