అన్వేషించండి

Nagarkurnool Kids Murder: చావాలంటే చనిపోవచ్చు..పిల్లల్ని కూడా చంపాలా? - ఈ తండ్రి చేసిన పని తెలిస్తే గుండె పగిలిపోతుంది!

Murderer Father: పిల్లల్ని గట్టిగా కొట్టాలంటేనే తండ్రులు సంశయిస్తారు. ఎంత తప్పు చేసినా కొట్టరు.కానీ ఈ తండ్రి వారిని చంపి..పెట్రోల్ పోసి కాల్చేశాడు.

Father kills three children: పిల్లలకు భయం చెప్పడానికి తల్లి కోపగించుకుంటుందేమో కానీ.. తండ్రి మాత్రం తప్పు చేసినా వెనకేసుకొస్తాడు.కానీ ఈ తండ్రి మాత్రం కర్కోటకుడు. ఎంత అంటే.. మాభం శుభం తెలియని చిన్న పిల్లల్ని చంపేసి.. పెట్రోల్ పోసి కాల్చేశాడు. మొత్తం ముగ్గుర్ని ఇలా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెపగిలే ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.       

భార్యతో గొడవపడి పిల్లలతో బ యటకు వచ్చిన తండ్రి              

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన గుత్తా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత నెల 30వ తేదీన భార్యతో గొడవపడ్డాడు. తన ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వచ్చేశారు. ఆ ముగ్గురు చిన్న పిల్లరు.  మోక్షితకు ఎనిమిదేళ్లు,  రఘువర్షిణికి ఆరేళ్లు,  శివధర్మకు నాలుగేళ్లు. మూడు రోజులైనా కనిపించకపోవడంతో భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.           

శ్రీశైలం మీదుగా నాగర్ కర్నూలు రాక - అక్కడ పురుగుమందు తాగి ఆత్మహత్య           

నాగర్ కర్నూలులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోయినట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఆయన స్థానికుడు కాదు. దాంతో మిస్సింగ్ కేసుల గురించి ఆరా తీశారు. ప్రకాశం జిల్లాలో నమోదైన మిస్సింగ్ కేసు.. బైక్ నెంబర్ ఆధారంగా ఆత్మహత్య చేసుకున్నది గుత్తా వెంకటేశ్వర్లు అని గుర్తించారు. కుటుంబసభ్యులు వచ్చారు. అయితే పిల్లల ఆచూకీ కనిపించలేదు. దాంతో పోలీసులు గుత్తా వెంకటేశ్వర్లు  ప్రకాశం జిల్లా నుంచి నాగర్ కర్నూలు ఎలా వచ్చాడో .. ఆ దారిలో సీసీ సీసీ కెమెరాలు వెదికారు. కొన్ని చోట్ల్ల ముగ్గురు పిల్లలు.. కొన్ని చోట్ల ఒక్క పాపతో కనిపించాడు.                 

పిల్లలను వేర్వేరు చోట్ల చంపేసి పెట్రోల్ పోసి కాల్చిన తండ్రి                  

దాంతో పోలీసులు అనుమానాస్పద ప్రాంతాల్లో వెదికారు. ఓ చోట ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ తో కాల్చిన ఆనవాళ్లు..మరో చోట మరో పాపను అలాగే కాల్చేసిన ఆనవాళ్లు లభించాయి. అంటే తన బిడ్డల్ని చంపేసి ఘోరంగా పెట్రోల్ తో కాల్చేసి తానుపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.                       

ఈ తండ్రి చేసిన పనికి దిగ్భ్రాంతికి గురైన సమాజం                 

పసిపిల్లలను తన చేతులతో చంపాలని ఎందుకు అనుకున్నాడో.. కానీ చనిపోవాలనుకుంటే..తాను చనిపోవచ్చని..ఎంతో భవిష్యత్ ఉన్న పిల్లల్ని ఎందుకు చంపేశాడోనని కొంత మంది ఆవేదన చెందుతున్నారు. ఈ దారుణ సంఘటన స్థానిక సమాజంలో షాక్‌ను కలిగించింది. దాంపత్య కలహాలు ఇంత దారుణమైన ఫలితాలకు దారితీయడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget