అన్వేషించండి

Eluru News : ఏలూరు జిల్లాలో విషాదం, బైక్ పై విద్యుత్ వైర్ పడి అన్నదమ్ములు సజీవదహనం

Eluru News : ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులపై 11కేవీ విద్యుత్ వైర్ తెగిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనం అయ్యారు.

Eluru News : ఏలూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో ఇద్దరు యువకులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్న ఇద్దరు యువకులు దారిలోనే మంటల్లో చిక్కుకుని మరణించారు. దేవులపల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములు వల్లేపల్లి నాగేంద్ర (21), వల్లేపల్లి ఫణీంద్ర (19) పాలు తెచ్చేందుకు పొలం వద్దకు బైక్‌పై  వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. వీరు వెళ్తున్న బైక్‌పై 11 కేవీ విద్యుత్‌ వైరు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బైక్‌పై ఉన్న అన్నదమ్ములు ఇద్దరూ అక్కడిక్కడే సజీవదహనమయ్యారు. మృతుల్లో ఒకరైన నాగేంద్ర ఇంజినీరింగ్‌ ఫైనర్ ఇయర్ చదువుతున్నారు. ఫణీంద్ర ఇంటర్‌ రెండో సంవత్సవరం పూర్తిచేశారు. ఇద్దరు కుమారులు చనిపోయవడంతో ఆ తల్లిదండ్రుల గుండెలపగిలేలా రోధిస్తున్నారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్య్ం కారణంగానే ఈ విషాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అందనాలపాడులో సోమవారం విషాదం జరిగింది. దైవ కార్యం కోసం వెళ్లిన ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో మరణించడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సోమవారం అర్ధరాత్రి వర్షం కురవడంతో గుడి దగ్గర విద్యుత్ తీగల్లో కరెంట్ ప్రవహించింది. ఈ విషయం తెలియక కొందరు మైక్ సెట్ చేస్తుండగా అకస్మాత్తుగా కరెంట్ షాక్ వచ్చిందని సమాచారం. దాంతో స్థానిక ఆలయంలో మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్య లుగా గుర్తించారు.

దైవ కార్యానికి వెళ్తే 

డోర్నకల్ మండలం అందనాలపాడులోని స్థానిక ఆలయంలో ఓ వ్యక్తి మైక్ సెట్ చేయడానికి ట్రై చేశారు. నిన్న రాత్రి వర్షం కారణంగా విద్యుదాఘాతం జరిగింది. దాంతో కరెంట్ తీగల్ని పట్టుకుని మైక్ సెట్ చేస్తున్న వ్యక్తితో పాటు అతడ్ని అంటుకుని ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారు. కరెంట్ షాక్ కొట్టడంతో మస్తాన్‌రావు, సుబ్బారావు, వెంకయ్య ముగ్గురు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దేవుడి సన్నిధిలో అక్కడే ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దైవ కార్యం కోసం వెళ్లిన తమ ఇంటి యజమానులు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ విలపించడం చూసి గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది.

టాప్ హెడ్ లైన్స్

Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
Jayamundi Bhayamela Manasa OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి జయముంది భయమేల మనసా - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Chiranjeevi : మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
మెగా 158లో కూలీ లేడీ విలన్ - క్రేజీ ఆఫర్ కొట్టేసిన కన్నడ బ్యూటీ
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Embed widget