అన్వేషించండి

Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

Elephants Attacked: ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి. బయటకు రావాలంటే వణికిపోతున్నారు

Kumram Bhim Asifabad : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధారం సాయంత్రం ఒక రైతును తొక్కి చంపిన ఏనుగులు ఈ ఉదయం కూడా మరో రైతుపై దాడి చేశాయి. ఇద్దరు రైతులు స్పాట్‌లోనే మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

ఇతర్రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బుధవారం ఒకర్ని , ఈ ఉదయం మరొకర్ని బలి తీసుకున్నాయి. బుధారం సాయంత్రం పొలానికి వెళ్లిన అల్లూరి శంకర్ అనే రైతులను ఏనుగులు తొక్కి చంపేశాయి. ఈ ఘటన మరువక ముందే మరో రైతు ప్రాణాలు తీశాయి గజరాజులు.   


Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి రైతు ఉదయాన్ని పొలానికి వెళ్లాడు. ఆయనపై దాడి చేసిన ఏనుగులు చంపేశాయి. పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు ఈ ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు మోటర్‌ వేస్తున్న క్రమంలో అతనిపై ఏనుగు దాడి చేశాయి. ఈ దాడిలో పోచయ్య స్పాట్‌లోనే ప్రాణాలు వదిలేశాడు. 


Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

ఏనుగులు దాడి గుర్తించిన స్థానికులు హడావుడి చేసి వాటిని తరిమేశారు. వెళ్లి చూస్తే అప్పటికే పోచయ్య చనిపోయినట్టు గుర్తించారు. స్థానికులు కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలోకి ఏనుగు వెళ్లిపోయింది. పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పిన పోచయ్య చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఏనుగు దాడి సంగతిని స్థానికులు అటు పోలీసులకు, ఇటు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము చెప్పే వరకు ఎవరూ పొలాలకు తోటలకు వెళ్లొద్దని బయటకు రావద్దని సూచిస్తున్నారు.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణహిత నది దాటి వచ్చిన ఏనుగులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. ఇది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే ప్రజలు బయటకు రావద్దని ఏనుగు అటవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. 

సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లా: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గంలో ఏనుగుల సంచారం, ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు మాజీ ఎమ్మెల్యే కోనప్ప. అటవీశాఖ మంత్రి సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. మంత్రులు ఇద్దరూ స్పందించాలని అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. 

ఏనుగు దాడి బాధితులకు ఉద్యోగం ఇవ్వాలి: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
ఏనుగు దాడిలో మరణించిన బూరేపల్లివాసి శంకర్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌..."అటవీశాఖ అధికారుల సమన్వయలోపంతో ఏనుగులు సంచారం ఎక్కువైంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్‌లో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. మహారాష్ట్రలో ఇస్తున్నట్టు చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా అందివ్వాలి. ఏనుగును తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వాలి.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget