అన్వేషించండి

Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

Elephants Attacked: ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు జనాలను పరుగులు పెట్టిస్తున్నాయి. బయటకు రావాలంటే వణికిపోతున్నారు

Kumram Bhim Asifabad : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగులు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. బుధారం సాయంత్రం ఒక రైతును తొక్కి చంపిన ఏనుగులు ఈ ఉదయం కూడా మరో రైతుపై దాడి చేశాయి. ఇద్దరు రైతులు స్పాట్‌లోనే మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

ఇతర్రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు నాశనం చేస్తున్నాయి. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బుధవారం ఒకర్ని , ఈ ఉదయం మరొకర్ని బలి తీసుకున్నాయి. బుధారం సాయంత్రం పొలానికి వెళ్లిన అల్లూరి శంకర్ అనే రైతులను ఏనుగులు తొక్కి చంపేశాయి. ఈ ఘటన మరువక ముందే మరో రైతు ప్రాణాలు తీశాయి గజరాజులు.   


Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి రైతు ఉదయాన్ని పొలానికి వెళ్లాడు. ఆయనపై దాడి చేసిన ఏనుగులు చంపేశాయి. పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు ఈ ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు మోటర్‌ వేస్తున్న క్రమంలో అతనిపై ఏనుగు దాడి చేశాయి. ఈ దాడిలో పోచయ్య స్పాట్‌లోనే ప్రాణాలు వదిలేశాడు. 


Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

ఏనుగులు దాడి గుర్తించిన స్థానికులు హడావుడి చేసి వాటిని తరిమేశారు. వెళ్లి చూస్తే అప్పటికే పోచయ్య చనిపోయినట్టు గుర్తించారు. స్థానికులు కేకలు వేయడంతో సమీప అటవీ ప్రాంతంలోకి ఏనుగు వెళ్లిపోయింది. పొలానికి నీళ్లు పెట్టి వస్తానని చెప్పిన పోచయ్య చనిపోయాడన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఏనుగు దాడి సంగతిని స్థానికులు అటు పోలీసులకు, ఇటు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము చెప్పే వరకు ఎవరూ పొలాలకు తోటలకు వెళ్లొద్దని బయటకు రావద్దని సూచిస్తున్నారు.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

సిర్పూర్ (టి) నియోజకవర్గంలో 24 గంటల వ్యవధిలోనే ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందడంతో ప్రజలు వణికిపోతున్నారు. భయాందోళనలకు గురవుతున్నారు. ప్రాణహిత నది దాటి వచ్చిన ఏనుగులు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. ఇది ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే ప్రజలు బయటకు రావద్దని ఏనుగు అటవుల్లోకి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు అధికారులు. 

సమస్యను మంత్రుల దృష్టికి తీసుకెళ్లా: మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూర్ నియోజకవర్గంలో ఏనుగుల సంచారం, ఏనుగుల దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు మాజీ ఎమ్మెల్యే కోనప్ప. అటవీశాఖ మంత్రి సురేఖ, జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. మంత్రులు ఇద్దరూ స్పందించాలని అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలను కూడా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. 

ఏనుగు దాడి బాధితులకు ఉద్యోగం ఇవ్వాలి: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
ఏనుగు దాడిలో మరణించిన బూరేపల్లివాసి శంకర్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్‌..."అటవీశాఖ అధికారుల సమన్వయలోపంతో ఏనుగులు సంచారం ఎక్కువైంది. కాగజ్ నగర్ అటవీ డివిజన్‌లో 2 నిండు ప్రాణాలు బలయ్యాయి. మహారాష్ట్రలో ఇస్తున్నట్టు చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా అందివ్వాలి. ఏనుగును తిరిగి ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతాలకు పంపించే ఏర్పాట్లు చేయాలి. అటవీ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించి భరోసా ఇవ్వాలి.
Telangana News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు- గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల మృతి

టాప్ హెడ్ లైన్స్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget