News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cyber Crime : చిన్నారి చికిత్స కోసం సాయం కోరిన తల్లి, సోనూసూద్ పేరుతో సైబర్ మోసం!

Cyber Crime : సోనూసూద్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేశారు. తన కుమారుడి చికిత్స కోసం ఆన్లైన్ లో సాయం కోరిన మహిళ బ్యాంకు ఖాతా నుంచి నగదు కొట్టేశారు సైబర్ మోసగాళ్లు.

FOLLOW US: 
Share:

Cyber Crime : అడిగిన వారికి లేదనుకుండా సాయం అందిస్తున్నారు సినీ నటుడు సోనూసూద్. తన ఫౌండేషన్ ద్వారా కరోనా సమయంలో ఎంతో మందిని ఆదుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో సోనూసూద్ ఫౌండేషన్ సేవలు అందిస్తుంది. సామాజిక మాధ్యమాలతో తనను ఎవరు సాయం కోరినా సోనూసూద్ వెంటనే స్పందిస్తారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు సోనూసూద్ పేరు వాడుకున్న ఓ కుటుంబాన్ని మోసం చేశారు. 

కొడుకు చికిత్స కోసం 

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన చిన్నారి వైద్యం కోసం ఓ తల్లి ఆన్లైన్ లో దాతల సాయం కోరింది. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ కేటుగాళ్లు ఆమెకు ఫోన్​ చేశారు. సోనూసూద్​ కార్యాలయం నుంచి ఫోను చేస్తున్నట్లు నమ్మించారు. సాయం చేస్తామని చెప్పి ఎనీ డెస్క్​ యాప్ ద్వారా ఆమె బ్యాంకు​ వివరాలు సేకరించారు. తన కుమారుడి చికిత్స కోసం దాతలు వేసిన నగదును సైబర్ మోసగాళ్లు ఆమె బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా మాయం చేశారు. ఈ ఘటన రాజమహేంద్రవరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత మహిళ పోలీసులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. 

సోనూసూద్ పేరుతో మోసం 

సినీనటుడు సోనూసూద్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ మహిళను మోసం చేసి బ్యాంకు ఖాతాలోని నగదును ఆన్‌లైన్‌లో చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరం నగరంలోని సీటీఆర్‌ఐ భాస్కరనగర్‌ లో నివాసం ఉంటున్న సత్యశ్రీ అనే మహిళకు ఆరు నెలల బాబు ఉన్నాడు. ఆ చిన్నారి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి చికిత్సకు రూ.లక్షలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి. అంత ఆర్థిక స్థోమత లేక మహిళ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని స్నేహితులు, బంధువులకు మెసేజ్ పెట్టింది. 

ఎనీ డెస్క్ యాప్ తో దోచేశారు 

సోషల్ మీడియా ఈ మెసేజ్ ఫార్వడ్ అవుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు జూన్‌ 27వ తేదీన సత్యశ్రీకి ఫోన్‌ చేశారు. సోనూసూద్‌ ఫౌండేషన్ నుంచి ఫోను చేస్తున్నట్లు చెప్పారు. చిన్నారి చికిత్సకు సాయం చేస్తామని మహిళను నమ్మించారు. దీంతో ఆమె బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేసేందుకు ప్రయత్నించింది. అవి అవసరం లేదని, ఫోనులో ఎనీ డెస్క్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి వివరాలు నమోదు చేయాలని ఆమెకు సూచించారు. సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు ఆమె వివరాలు యాప్‌లో నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెకు నగదు రాకపోగా విడతల వారీగా సత్యశ్రీ బ్యాంకు ఖాతా నుంచి రూ.95 వేలు మాయం అయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Published at : 01 Jul 2022 04:00 PM (IST) Tags: cyber crime AP News East Godavari news sonusood Rajahmundry news any desk app

ఇవి కూడా చూడండి

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే: విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Visakha Crime: గంజాయి రవాణా చేసేది కొరియర్ బాయ్ లే:  విశాఖ సీపీ సంచలన విషయాలు వెల్లడి

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి