అన్వేషించండి

Dowry Harassment: ఐఏఎస్ ఆఫీసర్‌గా నమ్మించి పెళ్లి, అదనపు కట్నం కోసం వేధింపులతో వెలుగులోకి వాస్తవం 

Fake IAS Officer: ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ మోసం చేసి పెళ్లి చేసుకోవడంతోపాటు అదనపు కట్నం కోసం వేధించిన ప్రబుద్ధుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. భార్య నుంచి రెండు కోట్లు కూడా కొట్టేశాడు.

Telangana Crime News: ఈ మధ్యకాలంలో మోసం చేసి వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఖిలాడి లేడీలు ఈ తరహా వివాహాలను చేసుకుంటున్న వ్యవహారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్మాయిలను మోసం చేస్తున్న అబ్బాయిల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని, పెద్ద పెద్ద కంపెనీలు నిర్వహిస్తున్నామని చెప్పి భారీ మొత్తంలో కట్న కానుకలు తీసుకుని మోసం చేస్తున్న కేసులు అనేకం వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇటువంటి కేసు మరొకటి వెలుగు చూసింది. తానో ఐఏఎస్ ఆఫీసర్ ని అంటూ యువతిని బురిడీ కొట్టించి వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు.. ఆమె వద్ద నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయడంతోపాటు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్లలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. 

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్ కుమార్ (38) కర్ణాటక ఐఏఎస్ కేడర్ లో ఎంపికైనట్లు 2016లో ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. తానో ఐఏఎస్ ఆఫీసర్ ను అంటూ ఓ మాట్రిమోనీలో వివరాలు కూడా నమోదు చేశాడు. ఈ వివరాలను చూసిన బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అరిమిల్లి శ్రావణి (34) కుటుంబీకులు అతడిని సంప్రదించారు. తమ కుమార్తె గురించి చెప్పడంతో పాటు వివాహాన్ని కుదుర్చుకున్నారు. వివాహ సమయంలో రూ.50 లక్షల రూపాయల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చి 2018లో ఘనంగా వివాహం జరిపించారు. ఆ తర్వాత కాలంలో అతని వ్యవహారం మెల్లగా బయటపడుతూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పిన ఆయన విధులకు వెళ్ళకపోవడంతోపాటు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ శ్రావణ్ కి అనుమానాన్ని కలిగించాడు. 

రేడియాలజిస్ట్ గా పని చేయడం ఇష్టం అంటూ మరో మోసం

తాను ఐఏఎస్ ఆఫీసర్ ను కాదన్న విషయం ఇంట్లో తెలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన సందీప్ కుమార్ మరో కట్టు కథను అల్లాడు. తనకు ఐఏఎస్ అధికారిగా పని చేయడం ఇష్టం లేదని రేడియాలజిస్ట్ గా ఉద్యోగం చేస్తానని భార్యకు చెప్పి నిత్యం విధులకు వెళ్లి వస్తున్నట్లు నమ్మించాడు. ప్రస్తుతం మల్లంపేట గ్రీన్ వ్యాలీ రోడ్డులో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. విధులకు మాత్రమే వెళుతున్న సందీప్ కుమార్ రూపాయి కూడా ఇంటికి ఇవ్వకపోవడంతో భార్య సంపాదనపై ప్రశ్నించింది. సంపాదనంతా ఏదని నిలదీసింది. దీనికి మరో కట్టు కథను అల్లిన సందీప్ కుమార్ వైద్యం ద్వారా తాను రూ.40 కోట్లు ఆర్జించానని, ఆదాయ పన్ను చెల్లించకపోవడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని చెప్పాడు. అవి రావాలంటే రెండు కోట్ల చెల్లించాలి అని చెప్పడంతో భార్య మిత్రుల ద్వారా రెండు కోట్ల రూపాయలను  సమకూర్చింది.

కుటుంబ సభ్యులకు మళ్లించిన సందీప్ కుమార్..

భర్త సంపాదించిన 40 కోట్ల రూపాయలు మొత్తం వస్తుందన్న ఉద్దేశంతో తెలిసిన వారి దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు మొత్తాన్ని సమకూర్చి భర్తకు అందించింది. అయితే, సందీప్ కుమార్ భారీ సమకూర్చిన రెండు కోట్ల రూపాయలను తన తండ్రి విజయకుమార్ (70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతికూరి లక్ష్మీ సాహితి (35) ఖాతాలకు బదిలీ చేశాడు. వివాహ సమయంలో ఇచ్చిన ఆభరణాలను సందీప్ కుమార్ తల్లి మాలతి (59) బ్యాంకులో తనఖా పెట్టి డబ్బు తీసుకుంది. రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా భర్త తన సంపాదించిన డబ్బులు తీసుకురాకపోవడంతోపాటు రకరకాల కథలు చెబుతుండడంతో భార్యకు అనుమానం వచ్చింది. అతడు గురించి వాకబు చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతోపాటు రేడియాలజిస్ట్ సర్టిఫికెట్ నకిలీవని శ్రావణి గుర్తించింది. ఇంత జరిగిన తర్వాత కూడా సందీప్ కుమార్ అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధిస్తుండడంతో ఆమె బాచుపల్లి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడితోపాటు అతడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని బుధవారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. మరో నిందితురాలు లక్ష్మీ సాహితీ పరారీలో ఉన్నట్లు సిఐ జే ఉపేందర్ వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Manchu Manoj: మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
Telugu TV Movies Today: చిరంజీవి ‘అన్నయ్య’, నాగార్జున ‘శివమణి’ to పవన్ ‘బాలు’, విజయ్ ‘మాస్టర్’ వరకు - ఈ శనివారం (ఫిబ్రవరి 15) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘అన్నయ్య’, నాగార్జున ‘శివమణి’ to పవన్ ‘బాలు’, విజయ్ ‘మాస్టర్’ వరకు - ఈ శనివారం (ఫిబ్రవరి 15) టీవీలలో వచ్చే సినిమాలివే
US Deportation: నేడు భారత్‌కు అమెరికా వలసదారుల రెండో విమానం, కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
నేడు భారత్‌కు అమెరికా వలసదారుల రెండో విమానం, కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.