అన్వేషించండి

Mahabubabad News: నాడు కన్నబిడ్డలకు విషమిచ్చి చంపారు - నేడు ఆత్మహత్య చేసుకున్నారు, కుళ్లిన స్థితిలో మృతదేహాలు!

Telangana News: మహబూబాబాద్ జిల్లాలో దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు గత నెల ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.

Couple Forceful Death In Mahabubabad: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. గత నెలలో తమ ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అంకన్నగూడేనికి చెందిన దంపతులు అనిల్ (26), దేవి (22).. గ్రామానికి సమీపంలోని అడవిలో శవాలై కనిపించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో మృతదేహాలను గుర్తించారు. అనిల్ మృతదేహం చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో లభ్యమైంది. దేవి మృతదేహం కింద పడిపోయి, పుర్రె, ఎముకల చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఈ క్రమంలో వారు ఆత్మహత్య చేసుకుని దాదాపు నెల రోజులు దాటి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పిల్లలకు విషమిచ్చి చంపారు

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకన్నగూడెం గ్రామానికి చెందిన అనిల్ కు బయ్యారం మండలం నామాలపాడులోని రాయికుంటకు చెందిన దేవితో దాదాపు ఐదేళ్ల కిందట వివాహం అయ్యింది. వ్యవసాయంతో పాటు ఇటుక బట్టీల్లో పని చేసే అనిల్ తన అత్తవారి గ్రామమైన రాయకుంటలోనే నివాసం ఉంటున్నాడు. వీరికి లోహిత (2), జస్విత (1) ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్చి 10న తన ఇద్దరు పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చి  హత్య చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అనిల్ తండ్రి వెంకన్న.. అంకన్నగూడెంలోనే చిన్న పాటి కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతని ఇంటికి కొడుకు, కోడలు, మనవడు, మనవరాలితో రాగా రోజూలాగే తెల్లవారుజామున దుకాణం తెరిచేందుకు వెళ్లాడు. తిరిగి ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి కొడుకు, కోడలు కనిపించలేదు. చిన్నారులు ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లో మంచంపై పాల సీసా కనిపించింది. అలాగే, అనిల్, దేవి దుస్తుల బ్యాగ్ దగ్గరలో పురుగుల మందు డబ్బాను గుర్తించారు. తల్లిదండ్రులు పిల్లలకు విషమిచ్చి చంపి పరారై ఉంటారనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు అనిల్, దేవిల కోసం గాలింపు చేపట్టారు. చివరకు వారి మృతదేహాలు కుళ్లిన స్థితిలో అడవిలో కనిపించాయి.

Also Read: Kavitha: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్ - అరెస్టుపై కవిత ఏమన్నారంటే?

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget